Student Suicide: మీనాక్షికి పదే పదే ఫోన్ చేసిన రహీం.. ఉరేసుకుని యువతి సూసైడ్
- గుంటూరు జిల్లా పోలకం పాడు గ్రామంలో విషాదం..
- రహీం అనే వ్యక్తి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య..
- రూంకి రావాలని రహీం నా కూతురిని వేధించాడు: మీనాక్షి తల్లిదండ్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Student Suicide: గుంటూరు జిల్లాలోని పోలకం పాడు గ్రామంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదువుతున్న పోలూరు మీనాక్షి అనే యువతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మీనాక్షికి అదే కాలేజీలో చదివే రహీం అనే సీనియర్తో పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం క్రమంగా వేధింపులుగా మారిందని ఆరోపించారు. తరచూ ఫోన్ చేసి మాట్లాడాలని, రూముకు రావాలని ఒత్తిడి చేస్తూ, అలా చేయకపోతే తన దగ్గర ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని రహీం బెదిరించినట్లు మీనాక్షి తండ్రి చెప్పారు.
Read Also: Taliban-Domestic Violence: భార్యను చితకబాదే హక్కు.. ప్రజా ప్రదేశాల్లో మహిళలకు బహిరంగ శిక్షలు!
Also Read
- Ambati Rambabu: పోలీసులను రాజకీయ కక్షకు వాడుతున్నారు.. అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
అంతేకాదు, ఆ ఫొటోలను మీ తల్లిదండ్రులకు పంపిస్తానని కూడా మీనాక్షి బెదిరించినట్లు బాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన మీనాక్షి, మొన్న రాత్రి అన్ని విషయాలను మాకు చెప్పింది, “ఇక నా వల్ల కాదమ్మా, నేను చనిపోతాను” అని బాధతో చెప్పినట్లు ఆమె తల్లి వాపోయింది. అనంతరం తల్లిదండ్రులు పనుల కోసం బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి, ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని మీనాక్షి కనిపించిందన్నారు.
Read Also: Neal Katyal: ట్రంప్నకు వ్యతిరేకంగా వాదించి గెలిచింది మనోడే..
ఇక, రహీం అనే వ్యక్తి బెదిరింపులు, ర్యాగింగ్ తట్టుకోలేకే మా కూతురు ఆత్మహత్య చేసుకుందని మీనాక్షి తండ్రి కన్నీరు పెట్టుకున్నాడు. తన కుమార్తె భవిష్యత్తు కోసం విమానాశ్రయంలో ఉద్యోగానికి ట్రైనింగ్ కి పంపించాలని కూడా అనుకున్నాను, కానీ ఇంతలోనే ఈ దారుణం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!