జి.కొత్తపల్లి వైసీపీ గ్రామ అధ్యక్షుడు గంజి ప్రసాద్ హత్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.. స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్తులు దాడికి యత్నించారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.. హత్యకు గురైన గంజి ప్రసాద్ ఫ్యామిలీతో పాటు.. మరికొందరు ఎమ్మెల్యే తలారిపై ఆరోపణలు చేస్తున్నారు.. ఈ వ్యవహారంపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఎమ్మెల్యే తలారి వెంకట్రావు సహకారంతోనే హత్య జరిగిందని కుటుంబ సభ్యులు, గ్రామస్థులూ చెబుతున్నారు.. మరి ఎమ్మెల్యే తలారి విషయంలో…
తెలంగాణ మంత్రి కేటీఆర్ పొరుగు రాష్ట్రంపై చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారాయి.. ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు కేటీఆర్కు కౌంటర్ ఇస్తే.. కొందరు టీడీపీ నేతలు స్వాగతించారు.. మరికొందరు టీఆర్ఎస్-వైసీపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. అయితే, కేటీఆర్ ఎపిసోడ్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి.. నిన్నటి టీడీపీ నేతల కామెంట్లకు భిన్నంగా సోమిరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి.. తెలంగాణ ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తేశారు సోమిరెడ్డి.. తెలంగాణను చూసి ఏపీ కొన్ని అంశాలైనా నేర్చుకోవాల్సిన…
టీడీపీ నేతలకు ఎవరి పార్టీ ఆఫీసు వాళ్లదే నూకసాని బాలాజీ. తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు. గతంలో వైసీపీలో ఉన్న ఆయన తర్వాత పసుపు కండువా కప్పుకొన్నారు. వైసీపీలోనూ ఆయనకు జిల్లా అధ్యక్షుడి హోదా కట్టబెట్టారు. జడ్పీ చైర్మన్ అభ్యర్దిగా ప్రకటించినా.. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో అది సాధ్యం కాక మరొకరు ఆ పోస్టును తన్నుకు పోయారు. చేసేదేమీ లేక టీడీపీలో చేరిపోయారు నూకసాని. అప్పటి నుంచి టీడీపీలో ఆయనకు సముచిత స్ధానమే దక్కింది. కొంతకాలానికి…
టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శిపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి… ఖబడ్దార్ చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకో అని హెచ్చరించిన ఆయన.. దమ్ముంటే చంద్రబాబు లేదా లోకేష్ తంబళ్లపల్లెలో నాపై పోటీ చేయాలని.. డిపాజిట్లు తెచ్చుకోవాలని సవాల్ విసిరారు.. ఇక, కుప్పంలో రాజీనామా చేయి.. నీకు డిపాజిట్లు గల్లంతు చేస్తానని ప్రకటించారు. ఎక్కడో నీ పక్కన కిశోర్ కుమార్ రెడ్డిని, కడప నుంచి వచ్చిన శ్రీనివాసులు రెడ్డిని…
తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో కాకపుట్టిస్తున్నాయి.. వైసీపీ నేతలు కేటీఆర్ను టార్గెట్ చేస్తే.. టీడీపీ నేతలు మాత్రం నిజమే అంటున్నారు.. ఇక, కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.. ఏపీలో ఉన్న వాస్తవ పరిస్థితులు కేటీఆర్ చెప్పారన్నారు.. అయితే, ఏపీ విధ్వంసం, తెలంగాణ అభివృద్ధి వైఎస్ జగన్ -కేసీఆర్ల ఉమ్మడి అజెండాగా ఆరోపించారు. ఒకప్పుడు ఏపీలో ఉన్న భూముల ధరలు 200 శాతం పడిపోతే, తెలంగాణలో గణనీయంగా…
ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్నికలు జరిగే పరిస్థితి లేకపోయినా.. ముందస్తు ఎన్నికలపై ప్రచారం సాగుతోంది.. ప్రతిపక్ష టీడీపీ ముందస్తు ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు అంటుంటే.. అధికార వైసీపీ మాత్రం ముందస్తు ఎన్నికలకు పోయేదేలేదని స్పష్టం చేస్తోంది. ఇక, పొత్తులపై కూడా చర్చ సాగుతోంది.. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో పవన్ కల్యాణ్ పొత్తులపై చర్చకు తెరలేపారు. అయితే, 2024 ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ ఇచ్చారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. Read…
2024 ఎన్నికలకు సిద్ధం అవుతోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. వైసీపీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేసిన పార్టీ అధినేత వైఎస్ జగన్.. రాష్ట్రంలోని 175 స్థానాల్లో 175 ఎందుకు గెలవకూడదు అని ప్రశ్నించారు.. దీనిపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సెటైర్లు వేస్తోంది… సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి… రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ పార్టీకి 175 స్థానాలు ఎలా వస్తాయి..? అని…
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో సామూహిక అత్యాచార ఘటన తర్వాత.. ఏపీ మహిళా కమిషన్ ఎపిసోడ్ వార్తల్లో నిలిచింది.. దీనికి కారణం.. పరామర్శల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మధ్య జరిగిన వాగ్వాదం.. ఆ తర్వాత, ఆరోపణలు, విమర్శలు, నోటీసులు, ఆందోళనల వరకు వెళ్లింది.. తాజాగా, ఈ వ్యవహారంలో కొత్త అంశాన్ని తెర మీదకు తెచ్చారు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు.. బాధితుల గోప్యత పాటించే విషయంలో వాసిరెడ్డి పద్మే…
ప్రకాశం జిల్లా ఒంగోలు లోక్సభ సెగ్మెంట్. ఇప్పటి వరకూ 17సార్లు ఎన్నికలు జరిగాయి. టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన పది ఎన్నికల్లో కేవలం రెండుసార్లు మాత్రమే సైకిల్ గెలిచింది. ఒకసారి బెజవాడ పాపిరెడ్డి.. మరోసారి కరణం బలరామ్లే టీడీపీ ఎంపీలుగా గెలిచారు. మొదటి నుంచి కాంగ్రెస్కు.. తర్వాత వైసీపీకి పెట్టని కోటలా మారింది ఒంగోలు లోక్సభ స్థానం. పైగా ఇక్కడ అభ్యర్థిని బరిలో దించాలంటే టీడీపీకి తలకు మించిన భారంగా ఉంటోందట. ఎన్నికల్లో ఎవరో ఒకర్ని నియమించడం..…
ఉపాధ్యాయులు, ఉద్యోగుల పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఇచ్చిన హామీలను నేరవేర్చమంటే అరెస్టులతో వేధిస్తున్నారా.?తాడేపల్లి ప్రాంతమంతా ముళ్ల కంచెలతో కాశ్మీర్ బార్డర్ ను తలపిస్తోంది. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలన్న దాహంతో ఎన్నికల్లో గెలవడానికి కన్నూమిన్నూ కానకుండా హామీలిచ్చారు. ప్రచారంలో చిటికెలేసి అన్ని సభల్లో వారంలో రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్నారు. ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి మర్చిపోయినా.. నమ్మిన ఉద్యోగులు మర్చిపోలేదు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలి. జగన్ చేసిన…