ICC T20 World Cup: మహ్మద్ యూనస్ రాజకీయాలకు, భారత వ్యతిరేక వైఖరిని బంగ్లాదేశ్ క్రికెట్ బలైంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భారత్లో ఆడేందుకు బంగ్లాదేశ్ ప్లేయర్లు సిద్ధంగా ఉన్నా.. రాజకీయాల కోసం భారత్లో భద్రతా సమస్యలు ఉన్నాయని వాదిస్తూ .. చివరకు టోర్నీ నుంచి బహిష్కరించబడింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ ఘన విజయం సాధించి తారిక్ రెహ్మాన్ ప్రధాని అయ్యాడు. యూనస్ ఎగ్జిట్ అయ్యాడు. దీంతో ఒక్కొక్కరుగా బంగ్లాదేశ్ క్రికెట్కు జరిగిన అన్యాయంపై గళమెత్తుతున్నారు.
Read Also: Sree Vishnu Movies: టెన్షన్ మధ్య నిద్రపోని హీరో శ్రీ విష్ణు.. ఎట్టకేలకు లైన్ క్లియర్!
బంగ్లాదేశ్ అసిస్టెంట్ కోచ్ మొహమ్మద్ సలాహుద్దీన్, యూనస్ హయాంలో క్రీడా సలహాదారుగా ఉన్న ఆసిఫ్ నజ్రుల్ను తీవ్రంగా విమర్శించారు. టీ20 వరల్డ్ కప్ ఆడకపోవడంతో ఇద్దరు క్రికెటర్లు ‘‘మెంటల్ కోమా’’లోకి వెళ్లారని అన్నారు. యూనస్ సన్నిహితుడిగా పేరున్న నజ్రుల్ ఈ మొత్తం వివాదానికి కారణమయ్యాడు. భారత్లో ఆడొద్దననే నిర్ణయం గట్టిగా నిలబడ్డాడు. చివరకు బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చింది.
టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడం బంగ్లా టీమ్కు ఇదే తొలిసారి. ఫిబ్రవరి 23న ప్రారంభమయ్యే బంగ్లాదేశ్ క్రికెట్ లీగ్కు ముందు విలేకరులతో సలాహుద్దీన్ మాట్లాడుతూ.. యువ క్రికెటర్ల కలల్ని నజ్రుల్ చెదరగొట్టాడని అన్నారు. ఈ నిర్ణయంతో ఐదు రోజుల పాటు ఇద్దరు ఆటగాళ్లు తీవ్ర మానసిక వేధనకు గురైనట్లు చెప్పారు. నజ్రుల్ తప్పుడు వాదనలు చేసి, ఇప్పుడు యూ-టర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. భారత్లో మ్యాచ్ ఆడకూడదని బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని వ్యాఖ్యానించారు. అయితే, నజ్రులు ఇటీవల మాట్లాడుతూ తప్పును బంగ్లా ప్లేయర్లపై నెట్టేశాడు. భారత్లో ఆడకూడదని వారే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.