Nakka Anand Babu: ఆ కామెంట్లు వైఎస్సార్ను అవమానించినట్టే ఉన్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాకినాడ పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.. ఏపీలో పొత్తు రాజకీయాల చర్చకు దారి తీశాయి. అధికార పార్టీ నేతలందరూ ఒక్కాసారిగా దిగొచ్చి.. చంద్రబాబుకు ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము లేదని, అందుకే పొత్తులకు సిద్ధమయ్యారంటూ తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు రంగంలోకి దిగి, తన వ్యాఖ్యల్ని వక్రీకరించారంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలంతా కలిసి రావాలంటూ తాను కాకినాడలో చేసిన వ్యాఖ్యలను.. పొత్తులపై మాట్లాడినట్లు వక్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పుడు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు కూడా రంగంలోకి దిగి.. ‘పొత్తు’ విషయంపై చేస్తోన్న విమర్శలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు అసలు పొత్తుల గురించి ప్రస్తావించలేదని, ఆయన వ్యాఖ్యల్ని రాంగ్ డైరెక్షన్లో వైసీపీ తీసుకెళ్ళిందని దుయ్యబట్టారు. పొత్తుల విషయంలో వైసీపీ నేతల కామెంట్లు, జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అవమానించినట్టే ఉన్నాయన్నారు. 2004లో పొత్తులు పెట్టుకునే వైఎస్సార్ సీఎం అయ్యారనే విషయాన్ని వైసీపీ నేతలు మరిచారా? అంటూ ప్రశ్నించారు. ఇప్పటికే తల్లిని, చెల్లిని దూరం పెట్టిన జగన్.. పొత్తుల విషయంలో తన తండ్రి వైఎస్ను అవమానించేలా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడ్డారు.
Also Read
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
- Talliki Vandanam: ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. 41 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ..
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
1994లో కాంగ్రెస్ పార్టీని అతి తక్కువ స్థానాలకు పరిమితం చేసిన సందర్భంలోనూ టీడీపీ పొత్తులు పెట్టుకుందని నక్కా ఆనంద్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తామేమీ పొత్తుల కోసం వెంపర్లాడడం లేదని, చంద్రబాబు వ్యాఖ్యల్ని వక్రీకరించి వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతోందని ఆరోపించారు. ఇక సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై తాను కామెంట్ చేయదల్చుకోలేనని అన్నారు. కాగా.. జనసేనతో పొత్తు ఉందని స్పష్టం చేసిన వీర్రాజు, టీడీపీతోనూ జనసేన చేతులు కలుపుతోందా? అనే విషయంపై పవనే క్లారిటీ ఇవ్వాలని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే!
తాజావార్తలు
-
Nandamuri Kalyan Ram : పరశురామ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్.. కానీ?
-
Hero HF Deluxe: హీరో HF డీలక్స్ క్యాన్వాస్ బ్లాక్ బైక్పై ధర భారీగా తగ్గింపు.. రూ. 59,999కే కొనుగోలు చేసే ఛాన్స్!
-
Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ.. ఉద్యమంపై ప్రధాన న్యాయమూర్తి సంచలన వాఖ్యలు..
-
Hyderabad: ACBకి చిక్కిన మరో అవినీతి అధికారి.. భారీ మొత్తంలో ఆస్తులు గుర్తింపు.!
-
David Warner: డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన స్టార్ క్రికెటర్.. నేరం అంగీకారం.. శిక్షపై ఉత్కంఠ..!
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!