టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువడనుంది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీం కోర్టు రేపు తీర్పు వెల్లడించనుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్ఐఆర్ రద్దు చేయాలంటూ చంద్రబాబు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు 17ఏపై దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది.
జీతాల సమస్యపై పాట్నా హైకోర్టు న్యాయమూర్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ( జీపీఎఫ్) ఖాతా తెరిచి జీతం విడుదల చేయాలని సుప్రీంకోర్టును కోరారు.
Ram Mandir: దేశం మొత్తం జనవరి 22న జరిగే భవ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఎదురుచూస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరవుతున్నారు. ప్రధానితో పాటు దేశవ్యాప్తంగా పలు రంగాల్లో కీలక వ్యక్తులు, సాధువులు 7000 మంది ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అన్ని ఏర్పాట్లను చేసింది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్– ఇ–ఇన్సాఫ్ (పీటీఐ)కు బ్యాట్ గుర్తు కేటాయింపు వివాదంపై ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు
ఈసీ, సీఈసీ నియామకాలకు సంబంధించి కొత్త చట్టంపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టంపై స్టే విధించలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
Maharastra : మహారాష్ట్రలో మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు బుధవారం పెద్ద షాక్ తగిలింది. షిండే వర్గ సభ్యులపై అనర్హత వేటు వేయాలన్న డిమాండ్ను అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ తోసిపుచ్చారు.
Article 370: జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే ‘ఆర్టికల్ 370’ని బీజేపీ నేతృత్వంలోని 2019లో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాలని కోరుతూ మళ్లీ సుప్రీంకోర్టులో ‘రివ్యూ పిటిషన్’ దాఖలైంది.
శ్రీకృష్ణ జన్మభూమి వివాదానికి సంబంధించిన పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మే 26న అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ షాహీ మసీదు ఈద్గా కమిటీ వేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం విచారించనుంది.
Rahul Gandhi: బిల్కిస్ బానో కేసులో ఈ రోజు సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. గతంలో గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష ద్వారా విడుదల చేసిన 11 నిందితులను ఉత్తర్వులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీనిపై కాంగ్రెస్తో సహా ఇతర ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇది న్యాయం సాధించిన విజయమని, బీజేపీ మహిళా వ్యతిరేకి అని, నేరస్తులను ప్రోత్సహిస్తోందని ఆరోపించాయి.