Hemant Soren Approaches Supreme Court Against ED Arrest: భూ కుంభకోణం కేసులో తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ.. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈడీ అరెస్టును సవాలు చేస్తూ.. గురువారం హేమంత్ సోరెన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అంగీకరించారు. అత్యవసర విచారణ కోసం భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం…
మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ అధికారాన్ని కోల్పోతారనే భయంతో ఉన్నారు. ఆయనపై అభిశంసన తీర్మానం తీసుకురావాలని ప్రతిపక్ష ఎంపీలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అభిశంసన ప్రక్రియకు సంబంధించి పార్లమెంటు విధివిధానాల్లో మార్పుల కోసం ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
చంద్రబాబు విచారణకు సహకరించపోతే బెయిల్ రద్దు పిటిషన్ వేయండి.. ఈ దశలో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని కేసు విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ దిపాంకర దత్తల సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది.
సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకలను ప్రధాని మోడీ ప్రారంభించారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం 75వ వసంతంలోకి అడుగు పెట్టింది. 1950 జనవరి 28న సుప్రీంకోర్టు ప్రారంభమైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యాయస్థాన వజ్రోత్సవాలను ప్రారంభించారు.
దేశ సర్వోన్నత న్యాయస్థానం 75వ వసంతంలోకి అడుగు పెట్టింది. 1950 జనవరి 28న సుప్రీంకోర్టు ప్రారంభమైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యాయస్థాన వజ్రోత్సవాలను ప్రారంభించనున్నారు
Mercy killing: పుట్టుకతోనే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్న తమ ఇద్దరు పిల్లలకు మరణాన్ని ప్రసాదించాలంటూ కేరళకు చెందిన ఓ జంట సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఇద్దరు పిల్లల చికిత్సను కొనసాగించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని కుటుంబీలకు చెప్పారు. కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన కుటుంబంలోని ఐదుగురు ‘మెర్సి కిల్లింగ్’ కోరుతూ భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు.
Gyanvapi Mosque case: జ్ఞానవాపి మసీదు కేసులో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐఏ) సర్వే నివేదిక వచ్చిన తర్వాత.. తాము విజయానికి చేరువలో ఉన్నామంటూ హిందూ పక్షం న్యాయవాది విష్ణుశంకర్ జైన్ గురువారం అన్నారు. ఏఎస్ఐ సర్వే నివేదిక వాజుఖానాలోని ఉన్నది శివలింగమా..? లేక ఫౌంటైనా.? అనేది తేలుస్తుందని ఆయన చెప్పారు. ‘‘వాజుఖనాలోని బావిలోని చేపలు చనిపోవడంతో వాటిని క్లీనింగ్ కోసం కోర్టులో దరఖాస్తు చేశాము.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడంపై ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు బెయిల్ను సుప్రీంలో ఏపీ ప్రభుత్వం సవాలు చేసింది.