Priyanka Gandhi: చండీగఢ్ ఉదంతంపై ప్రియాంక కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చండీగఢ్ ఉదంతంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme court) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మేయర్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారంటూ రిట్నరింగ్ అధికారిని ఉద్దేశిస్తూ ధర్మాసనం సంచలన వ్యా్ఖ్యలు చేసింది. మేయర్ ఎన్నిక నిర్వహించేది ఇలానేనా? అంటూ నిలదీసింది. ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేస్తారా? అంటూ న్యాయస్థానం మండిపడింది. తాజాగా ఇదే అంశంపై ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) స్పందించారు.
ప్రియాంక ట్వీట్..
చండీగఢ్ ఉదంతాన్ని ఉటంకిస్తూ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మేయర్ ఎన్నికల్లో జరిగిన ఎన్నికల మోసాన్ని ధర్మాసనం ఖండించిందని.. ప్రజాస్వామ్యాన్ని అపహ్యాసం చేసినట్లుగా చీవాట్లు పెట్టిందని గుర్తుచేశారు. ప్రజల గొంతును అణిచివేసేందుకు బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తోందని.. ప్రజలు దీనికి సమాధానం చెబుతారని ప్రియాంక ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.
Also Read
- Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో (Chandigarh Mayoral polls) బీజేపీకి బలం లేకపోయినా పీఠాన్ని కైవసం చేసుకుంది. రిటర్నింగ్ అధికారి కుయుక్తితో తిమ్మిని బమ్మిని చేసి సునాయాసంగా మేయర్ పదవి దక్కించుకుంది. దీంతో ఆప్, కాంగ్రెస్ పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును పట్టించుకోకపోవడంతో సుప్రీం మెట్లు ఎక్కారు. ఈ సందర్భంగా పిటిషన్ విచారిస్తూ రిటర్నింగ్ అధికారి తీరుపై న్యాయస్థానం మండిపడింది.
చండీగఢ్ మేయర్ ఎన్నికపై (Chandigarh Mayor Elections) దాఖలైన పిటిషన్పై సోమవారం సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి తీరుపై (Returning Officer) ఫైర్ అయింది. చండీగఢ్ మేయర్ ఎన్నికకు సంబంధించిన వీడియోగ్రఫీ సహా అన్ని బ్యాలెట్ పత్రాలు, ఇతర ఒరిజినల్ రికార్డులను పంజాబ్-హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్కు అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పేపర్లను తారుమారు చేశాడని స్పష్టంగా తెలుస్తోంది? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారా? ప్రజాస్వామ్యాన్ని ఇలా ఖూనీ చేయడాన్ని అనుమతించబోమంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 7న జరగాల్సిన చండీగఢ్ మునిసిపల్ కార్పొరేషన్ సమావేశాన్ని వాయిదా వేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
ఇటీవల చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో జిమ్మిక్ జరిగింది. ఇండియా కూటమిగా బరిలో దిగిన ఆప్, కాంగ్రెస్ పార్టీలకు 20 మంది (13+7) కార్పొరేటర్లు ఉన్నారు. బీజేపీకి చెందిన మనోజ్ కుమార్ సోలంకి కేవలం 16 ఓట్లే ఉన్నాయి. కానీ బీజేపీ అభ్యర్థే మేయర్గా ఎన్నికయ్యాడు. దీంతో ఇండియా కూటమి అవాక్కైంది.
ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్కు 20 మంది మద్దతు ఉన్నా.. 12 ఓట్లే వచ్చాయి. కూటమికి చెందిన 8 ఓట్లు చెల్లలేదని అధికారి ప్రకటించారు. దీంతో ఆగ్రహించిన ఆప్, కాంగ్రెస్ సభ్యులు కార్పొరేషన్ కార్యాలయంలో ఆందోళనకు దిగారు. రిటర్నింగ్ అధికారి తీరుపై మండిపడ్డారు. అనంతరం హైకోర్టును ఆశ్రయించగా ఈ అంశాన్ని పట్టించుకోలేదు. దీంతో ఆప్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సోమవారం దీనిపై విచారణ చేపట్టి ప్రిసైడింగ్ అధికారి తీరుపై మండిపడింది.
తాజావార్తలు
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
-
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
-
Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
-
Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!