దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తన వెబ్ సైట్ లో న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు, నియామక వివరాలను అప్ లోడ్ చేసింది. న్యాయ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ఈ చర్యకు పూనుకుంది. జడ్జీల సంబంధిత వివరాలను పబ్లిక్ డొమైన్లో ఉంచాలనే పూర్తి కోర్టు నిర్ణయానికి అనుగుణంగా, సుప్రీంకోర్టు సోమవారం తన వెబ్సైట్లో న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను అప్లోడ్ చేసినట్లు తెలిపింది. Also Read:What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే? ఏప్రిల్…
Supreme Court: పహల్గామ్ ఉగ్రవాదిలో 26 మంది టూరిస్టులు చనిపోయిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్పై దౌత్య చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇండియాలో ఉంటున్న పాకిస్తానీలు దేశం వదిలి వెళ్లిపోవాలని ఆదేశించింది. పాక్ జాతీయులు వీసాలను రద్దు చేసింది. అయితే, పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో జన్మించిన ఒక వ్యక్తిని, అతడి కుటుంబ సభ్యుల బహిష్కరణపై సుప్రీంకోర్టు ఉపశమనం కల్పించింది.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పిటిషనర్ను మందలించింది. పిటిషనర్ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్ వేసేముందు బాధ్యతగా వ్యవహరించాలని సుప్రీం కోర్టు హెచ్చరించింది. దేశంపై బాధ్యత లేదా అంటూ పిటిషనర్ను ప్రశ్నించింది. బలగాల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తారా అని అసహనం వ్యక్తం చేసింది. Also Read:Payal :…
అమరావతి: నేడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశం. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ నేతలతో భేటీ. హాజరుకానున్న వైసీపీ ముఖ్యనేతలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, వైసీపీ శ్రేణులు. తెలంగాణలో జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ షెడ్యూల్ విడుదల. ఇవాళ్లి నుంచి మొదటి దశ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. మే చివరి వరకు దరఖాస్తుల స్వీకరణ. జూన్ 2 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభం. జూన్ 30 వరకు మొదటి దశ అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తి.…
Supreme Court: జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టుల్ని ముష్కరులు కాల్చి చంపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైంది. ఈ ఘటనకు పాల్పడింది తామే అని లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రవాద సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ప్రకటించింది.
సినీనటుడు మంచు మోహన్బాబుకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది.. 2019 ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కేసులో స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.. అయితే, ఈ కేసు విచారణకు హాజరుకాకుండా స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లో దాఖలు చేశారు మోహన్బాబు.. మే 2న విచారణాధికారి ముందు ఖచ్చితంగా హాజరు కావాలని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది..
జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన మే 14న సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నియామకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రకటించారు. “జస్టిస్ బిఆర్ గవాయ్ నియామకం భారత న్యాయవ్యవస్థకు కీలక అడుగు. న్యాయ రంగంలో ఆయన తన శ్రేష్ఠత, నిష్పాక్షికతకు ప్రసిద్ధి చెందారు” అని కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. Also…
Ranveer Allahbadia: యూట్యూబర్ రణ్ వీర్ అల్హాబాదియాకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. పాస్ పోర్టును అతనకి తిరిగి ఇచ్చేయాలని ఇవాళ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో ప్రసారమయ్యే సినిమాలు, వెబ్ సిరిస్ లను సెన్సార్ చేయాలని ఎప్పటినుండో డిమాండ్ వినిపిస్తోంది. ముఖ్యంగా కొన్ని లీడింగ్ ప్లాట్ ఫామ్స్ లో హాలీవుడ్ కు చెందిన వెబ్ సిరీస్ లో సెక్సువల్ కంటెంట్ ను ఎటువంటి వార్నింగ్ నోట్ ఇవ్వకుండా డైరెక్ట్ గా ప్రసారం చేస్తున్నారని ఎప్పటినుండో ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో సెక్సువల్ కంటెంట్ పై నిషేధం విధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.…
ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. అయితే, దీనిపై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.. తదుపరి విచారణ వరకు మిథున్ రెడ్డికి మధ్యంతర రక్షణ కొనసాగనున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది.. తదుపరి విచారణ వరకు మిథున్ రెడ్డికి గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణ కొనసాగనుంది..