GHMC Debts: బల్దియా అప్పులను టేకోవర్ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GHMC Debts: హైదరాబాద్ నగర అభివృద్ధికి కీలకంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)పై ఉన్న భారీ అప్పులను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. జీహెచ్ఎంసీపై ప్రస్తుతం సుమారు రూ. 4,780 కోట్ల అప్పులు ఉండగా, వాటిని చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని తెలుస్తోంది. ఇటీవల జీహెచ్ఎంసీని మూడు వేర్వేరు కార్పొరేషన్లుగా విభజించే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో.. అప్పులను ఎలా పంచుకోవాలనే అంశంపై ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పడే కార్పొరేషన్లకు అప్పులను పంచితే ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావించి, మొత్తం అప్పు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని అధికారులు సూచించినట్లు తెలుస్తోంది.
Team India: “13 క్యాచ్లు మిస్”.. టీమిండియాకు మాజీ వికెట్ కీపర్ హెచ్చరిక.. ఈ తప్పులు చేస్తే ఇంటికే!
Also Read
- India-Pakistan: "పాకిస్తాన్తో ఆడేది లేదు".. కేంద్రం సంచలన నిర్ణయం..
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి ప్లాన్ అమలు.. చివరికిలా..!
- SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం...
- Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
2014 నుంచి హైదరాబాద్ నగరంలో ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, కొత్త డ్రైనేజీ నాళాలు వంటి మౌలిక వసతుల నిర్మాణానికి బల్దియా సుమారు రూ. 7 వేల కోట్ల వరకు అప్పులు చేసింది. ఈ అప్పులపై గత రెండు సంవత్సరాలుగా ప్రతి నెల సుమారు రూ. 100 కోట్ల వరకు వడ్డీలు చెల్లిస్తూ జీహెచ్ఎంసీ భారీ ఆర్థిక భారం భరిస్తోంది. ఇక మరోవైపు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి జీహెచ్ఎంసీకి రావాల్సిన సుమారు రూ. 2,500 కోట్ల మ్యుటేషన్ బకాయిలు కూడా పెండింగ్లో ఉన్నాయి. అదనంగా రాష్ట్ర ప్రభుత్వ భవనాలకు సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్లు కూడా జీహెచ్ఎంసీకి చాలా కాలంగా బకాయిగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
Sangameswara Temple: బయటపడ్డ సంగమేశ్వర ఆలయం.. ఆలయ చరిత్ర ఇదిగో..!
ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం బల్దియా అప్పులను స్వీకరించి తీర్చినట్లయితే.. భవిష్యత్తులో ఏర్పడే మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే నగర అభివృద్ధి పనులు మరింత వేగంగా జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Nithiin : ఎట్టకేలకు సినిమా మొదలెట్టిన నితిన్
-
India-Pakistan: “పాకిస్తాన్తో ఆడేది లేదు”.. కేంద్రం సంచలన నిర్ణయం..
-
Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి ప్లాన్ అమలు.. చివరికిలా..!
-
SRH Vs PBKS: ఉప్పల్లో హైవోల్టేజ్ పోరు.. ప్లే ఆఫ్ వేటలో పంజాబ్తో హైదరాబాద్ ఢీ.. స్టేడియం వద్ద పోలీసుల కొత్త నినాదం…
-
Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!