GHMC Debts: బల్దియా అప్పులను టేకోవర్ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GHMC Debts: హైదరాబాద్ నగర అభివృద్ధికి కీలకంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)పై ఉన్న భారీ అప్పులను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. జీహెచ్ఎంసీపై ప్రస్తుతం సుమారు రూ. 4,780 కోట్ల అప్పులు ఉండగా, వాటిని చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని తెలుస్తోంది. ఇటీవల జీహెచ్ఎంసీని మూడు వేర్వేరు కార్పొరేషన్లుగా విభజించే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో.. అప్పులను ఎలా పంచుకోవాలనే అంశంపై ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పడే కార్పొరేషన్లకు అప్పులను పంచితే ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావించి, మొత్తం అప్పు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని అధికారులు సూచించినట్లు తెలుస్తోంది.
Team India: “13 క్యాచ్లు మిస్”.. టీమిండియాకు మాజీ వికెట్ కీపర్ హెచ్చరిక.. ఈ తప్పులు చేస్తే ఇంటికే!
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
2014 నుంచి హైదరాబాద్ నగరంలో ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, కొత్త డ్రైనేజీ నాళాలు వంటి మౌలిక వసతుల నిర్మాణానికి బల్దియా సుమారు రూ. 7 వేల కోట్ల వరకు అప్పులు చేసింది. ఈ అప్పులపై గత రెండు సంవత్సరాలుగా ప్రతి నెల సుమారు రూ. 100 కోట్ల వరకు వడ్డీలు చెల్లిస్తూ జీహెచ్ఎంసీ భారీ ఆర్థిక భారం భరిస్తోంది. ఇక మరోవైపు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి జీహెచ్ఎంసీకి రావాల్సిన సుమారు రూ. 2,500 కోట్ల మ్యుటేషన్ బకాయిలు కూడా పెండింగ్లో ఉన్నాయి. అదనంగా రాష్ట్ర ప్రభుత్వ భవనాలకు సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్లు కూడా జీహెచ్ఎంసీకి చాలా కాలంగా బకాయిగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
Sangameswara Temple: బయటపడ్డ సంగమేశ్వర ఆలయం.. ఆలయ చరిత్ర ఇదిగో..!
ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం బల్దియా అప్పులను స్వీకరించి తీర్చినట్లయితే.. భవిష్యత్తులో ఏర్పడే మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే నగర అభివృద్ధి పనులు మరింత వేగంగా జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..