Waqf Act: “వక్ఫ్ ఆస్తుల” రిజిస్ట్రేషన్కు రంగం సిద్ధం..
- వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్కి రంగం సిద్ధం..
- జూన్ 6 నుంచి ఉమీద్ పోర్టల్ ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waqf Act: దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్కి రంగం సిద్ధమైంది. వక్ఫ్ ఆస్తుల మెరుగైన నిర్వహణ, పారదర్శకత పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జూన్ 6న ‘‘ఉమీద్’’ పోర్టల్ని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ‘ఏకీకృత వక్ఫ్ నిర్వహణ, సాధికారత, సామర్థ్యం మరియు అభివృద్ధి’ అనే పోర్టల్ దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులను నమోదు చేయడానికి కేంద్రీకృత వేదికగా పనిచేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ప్రణాళిక ప్రకారం, అన్ని వక్ఫ్ ఆస్తుల్ని ఆరు నెలల్లోపు పోర్టల్లో నమోదు చేయాలి. ఆస్తుల పొడవు, వెడల్పు, జియో ట్యాగ్ చేయబడిన స్థానాలతో సహా వివరాలను నమోదు చేయడం తప్పనిసరి. మహిళల పేర్లతో నమోదు చేయబడిన ఆస్తులను వక్ఫ్గా ప్రకటించడానికి అర్హత ఉండదు. వక్ఫ్ ఆస్తుల ప్రాథమిక లబ్ధిదారులలో మహిళలు, పిల్లలు, సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాలు ఉంటారు.
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
Read Also: Jagtial: పామును కాపాడబోయిన ఆర్టీసీ డ్రైవర్.. బస్సు గేర్ బాక్స్ లో చొరబడిన పాము.. చివరకు
సంబంధిత రాష్ట్ర వక్ఫ్ బోర్డులు రిజిస్ట్రేషన్లను సులభతరం చేస్తాయి. సాంకేతిక లేదా ఇతర ఏదైనా కారణాల వల్ల నిర్ణీత కాలపరిమితి లోపు నమోదు చేయని ఆస్తులను ఒకటి నుంచి రెండు నెలల పొడిగింపు కోరవచ్చు. అయితే, అనుమతించబడిన వ్యవధిలో నమోదు చేయని ఆస్తులను వివాదాస్పద ఆస్తులుగా పరిగణించి, పరిష్కారం కోసం వక్ఫ్ ట్రిబ్యునల్స్కి పంపుతారు.
ఇటీవల అమలులోకి వచ్చిన వక్ఫ్ (సవరణ) బిల్లు, 2025 నేపథ్యంలో ఈ పోర్టల్ ప్రారంభించబడుతోంది. ఏప్రిల్ 5న పార్లమెంట్ ఉభయసభల్లో ఈ బిల్లు ఆమోదం పొందింది. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకంతో చట్టంగా మారింది. అయితే, ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ చట్టం రాజ్యాంగ హామీలను ఉల్లంఘించిందని పిటిషన్లు పేర్కొన్నాయి. అయితే, ఈ పిటిషన్లను కొట్టివేయాలని కేంద్రం కోర్టుని కోరింది. ఏప్రిల్ 17న, ప్రభుత్వం ప్రస్తుతానికి కొన్ని నిబంధనలను అమలు చేయబోమని హామీ ఇచ్చిన తర్వాత, చట్టంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మే 27న జరిగిన విచారణ సందర్భంగా, సుప్రీంకోర్టు ఈ విషయంపై కేంద్రం, ఇతర పార్టీల నుండి ప్రతిస్పందనలను కోరింది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!