Waqf Act: “వక్ఫ్ ఆస్తుల” రిజిస్ట్రేషన్కు రంగం సిద్ధం..
- వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్కి రంగం సిద్ధం..
- జూన్ 6 నుంచి ఉమీద్ పోర్టల్ ప్రారంభం..
Waqf Act: దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్కి రంగం సిద్ధమైంది. వక్ఫ్ ఆస్తుల మెరుగైన నిర్వహణ, పారదర్శకత పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జూన్ 6న ‘‘ఉమీద్’’ పోర్టల్ని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ‘ఏకీకృత వక్ఫ్ నిర్వహణ, సాధికారత, సామర్థ్యం మరియు అభివృద్ధి’ అనే పోర్టల్ దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులను నమోదు చేయడానికి కేంద్రీకృత వేదికగా పనిచేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ప్రణాళిక ప్రకారం, అన్ని వక్ఫ్ ఆస్తుల్ని ఆరు నెలల్లోపు పోర్టల్లో నమోదు చేయాలి. ఆస్తుల పొడవు, వెడల్పు, జియో ట్యాగ్ చేయబడిన స్థానాలతో సహా వివరాలను నమోదు చేయడం తప్పనిసరి. మహిళల పేర్లతో నమోదు చేయబడిన ఆస్తులను వక్ఫ్గా ప్రకటించడానికి అర్హత ఉండదు. వక్ఫ్ ఆస్తుల ప్రాథమిక లబ్ధిదారులలో మహిళలు, పిల్లలు, సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాలు ఉంటారు.
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
Read Also: Jagtial: పామును కాపాడబోయిన ఆర్టీసీ డ్రైవర్.. బస్సు గేర్ బాక్స్ లో చొరబడిన పాము.. చివరకు
సంబంధిత రాష్ట్ర వక్ఫ్ బోర్డులు రిజిస్ట్రేషన్లను సులభతరం చేస్తాయి. సాంకేతిక లేదా ఇతర ఏదైనా కారణాల వల్ల నిర్ణీత కాలపరిమితి లోపు నమోదు చేయని ఆస్తులను ఒకటి నుంచి రెండు నెలల పొడిగింపు కోరవచ్చు. అయితే, అనుమతించబడిన వ్యవధిలో నమోదు చేయని ఆస్తులను వివాదాస్పద ఆస్తులుగా పరిగణించి, పరిష్కారం కోసం వక్ఫ్ ట్రిబ్యునల్స్కి పంపుతారు.
ఇటీవల అమలులోకి వచ్చిన వక్ఫ్ (సవరణ) బిల్లు, 2025 నేపథ్యంలో ఈ పోర్టల్ ప్రారంభించబడుతోంది. ఏప్రిల్ 5న పార్లమెంట్ ఉభయసభల్లో ఈ బిల్లు ఆమోదం పొందింది. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకంతో చట్టంగా మారింది. అయితే, ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ చట్టం రాజ్యాంగ హామీలను ఉల్లంఘించిందని పిటిషన్లు పేర్కొన్నాయి. అయితే, ఈ పిటిషన్లను కొట్టివేయాలని కేంద్రం కోర్టుని కోరింది. ఏప్రిల్ 17న, ప్రభుత్వం ప్రస్తుతానికి కొన్ని నిబంధనలను అమలు చేయబోమని హామీ ఇచ్చిన తర్వాత, చట్టంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మే 27న జరిగిన విచారణ సందర్భంగా, సుప్రీంకోర్టు ఈ విషయంపై కేంద్రం, ఇతర పార్టీల నుండి ప్రతిస్పందనలను కోరింది.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?