అమరావతి: నేడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశం. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ నేతలతో భేటీ. హాజరుకానున్న వైసీపీ ముఖ్యనేతలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, వైసీపీ శ్రేణులు. తెలంగాణలో జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ షెడ్యూల్ విడుదల. ఇవాళ్లి నుంచి మొదటి దశ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. మే చివరి వరకు దరఖాస్తుల స్వీకరణ. జూన్ 2 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభం. జూన్ 30 వరకు మొదటి దశ అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తి.…
Supreme Court: జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టుల్ని ముష్కరులు కాల్చి చంపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైంది. ఈ ఘటనకు పాల్పడింది తామే అని లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రవాద సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ప్రకటించింది.
సినీనటుడు మంచు మోహన్బాబుకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది.. 2019 ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కేసులో స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.. అయితే, ఈ కేసు విచారణకు హాజరుకాకుండా స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లో దాఖలు చేశారు మోహన్బాబు.. మే 2న విచారణాధికారి ముందు ఖచ్చితంగా హాజరు కావాలని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది..
జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన మే 14న సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నియామకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రకటించారు. “జస్టిస్ బిఆర్ గవాయ్ నియామకం భారత న్యాయవ్యవస్థకు కీలక అడుగు. న్యాయ రంగంలో ఆయన తన శ్రేష్ఠత, నిష్పాక్షికతకు ప్రసిద్ధి చెందారు” అని కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. Also…
Ranveer Allahbadia: యూట్యూబర్ రణ్ వీర్ అల్హాబాదియాకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. పాస్ పోర్టును అతనకి తిరిగి ఇచ్చేయాలని ఇవాళ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో ప్రసారమయ్యే సినిమాలు, వెబ్ సిరిస్ లను సెన్సార్ చేయాలని ఎప్పటినుండో డిమాండ్ వినిపిస్తోంది. ముఖ్యంగా కొన్ని లీడింగ్ ప్లాట్ ఫామ్స్ లో హాలీవుడ్ కు చెందిన వెబ్ సిరీస్ లో సెక్సువల్ కంటెంట్ ను ఎటువంటి వార్నింగ్ నోట్ ఇవ్వకుండా డైరెక్ట్ గా ప్రసారం చేస్తున్నారని ఎప్పటినుండో ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో సెక్సువల్ కంటెంట్ పై నిషేధం విధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.…
ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. అయితే, దీనిపై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.. తదుపరి విచారణ వరకు మిథున్ రెడ్డికి మధ్యంతర రక్షణ కొనసాగనున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది.. తదుపరి విచారణ వరకు మిథున్ రెడ్డికి గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణ కొనసాగనుంది..
Kolleru: కొల్లేరుపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యంపై మరోసారి తనిఖీ జరపాలని “కేంద్ర సాధికార కమిటీ”కి జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అయితే, కొల్లేరులో ప్రైవేటు భూములను నోటిఫై చేయడంపై సుప్రీంకోర్టును ప్రైవేటు మత్స్యకారులు సంఘం ఆశ్రయించిన విషయం విధితమే.
Waqf Act: కేంద్రం తీసుకువచ్చిన వక్ఫ్ చట్టం అమలుపై పాక్షికంగా లేదా పూర్తిగా స్టే విధించడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తామని ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకి తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం దాఖలు చేసిన పిటిషన్లో.. ఇలాంటి కేసుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా చట్టబద్ధమైన నిబంధనల్ని నిలిపేసే అధికారం కోర్టులకు లేదని, చట్టంలో అలా లేదని ప్రభుత్వం వాదించింది. ‘‘పార్లమెంట్ చేసిన చట్టాలకు రాజ్యాంగబద్ధత ఉంది. మధ్యంతర స్టే అనేది అధికారాల సమతుల్యత సూత్రానికి విరుద్ధం’’ అని పేర్కొంది. ఉమ్మడి పార్లమెంటరీ…
Jagdeep Dhankhar: వక్ఫ్ సవరణ చట్టంపై విచారణ, బిల్లుల విషయంలో రాష్ట్రపతికి సుప్రీంకోర్టు డెడ్లైన్ విధించిన నేపథ్యంలో..న్కాయ వ్యవస్థపై పలువురు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా, ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్తో పాటు నిషికాంత్ దూబే వంటి పలువురు బీజేపీ నేతలు సుప్రీంకోర్టుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా, మరోసారి జగదీప్ ధంఖర్ న్యాయవ్యవస్థ అతిగా స్పందించడాన్ని విమర్శించారు.