Home
Supreme Court
Supreme Court News
-
అధికారుల లెక్కలన్నీ బుస్సే… కరోనా మరణాలు ఎక్కువే.. ఇదిగో సాక్ష్యం..!!
దేశంలో అధికారుల లెక్కల కంటే కరోనాతో మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తోంది. దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు సమర్పించిన గణాంకాలే ఈ వాస్తవాన్ని తెలుపుతున్నాయి. కరోనాతో మరణించిన ప్రతి బాధిత కుటుంబానికి రూ.50 వేల పరిహారం చొప్పున ఇవ్వాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న సమయంలో… పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మరణాలపై నివేదికలను సమర్పించాయి. ఈ నివేదికల ద్వారా కరోనా మరణాల సంగతి వెలుగులోకి వచ్చింది.… -
వ్యాక్సినేషన్పై ఎవర్నీ బలవంతపెట్టడం లేదు…
కరోనాను కట్టడి చేయాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం సూచించిన వ్యాక్సిన్ను తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రతిరోజూ ప్రచారం చేస్తున్నది. మొదటి వేవ్ తరువాత దేశంలో వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చింది. దశల వారీగా ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకోకుంటే జరిమానా విధిస్తామని చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ను తప్పనిసరి చేశారు. మాస్క్ తప్పనిసరి. ఇక ఇదిలా ఉంటే, వ్యాక్సినేషన్పై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ… -
మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం.. కమిటీ ఏర్పాటు చేసిన సుప్రీం
ఈ నెల 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా భద్రతా వైఫ్యలంపై దర్యాప్తునకు ఒక మిటీని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు.. ఆ కమిటీకి రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వం వహిస్తారని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కమిటీలో చండీగఢ్ డీజీపీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఐజీ, పంజాబ్… -
కరోనా కలకలం: మొన్న పార్లమెంట్, నిన్న సుప్రీంకోర్ట్… నేడు తీహార్ జైల్…
ఢిల్లీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రతీ రోజూ ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇటీవలే పార్లమెంట్లో 400 మంది సిబ్బందికి కరోనా సోకింది. పార్లమెంట్లో పనిచేస్తున్నా సిబ్బంది అందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టులో 150 మంది సిబ్బందికి కరోనా సోకింది. దీంతో అత్యున్నత న్యాయస్థానంలో పనిచేస్తున్న 3వేల మంది సిబ్బందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో దీనికోసం ప్రత్యేక కరోనా నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. Read: మనిషి… -
కరోనా ఎఫెక్ట్: సుప్రీంకోర్టులో 150 మంది సిబ్బందికి పాజిటివ్…
ఢిల్లీని కరోనా వణికిస్తోంది. కేసులు రోజురోజుకు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇప్పటికే పార్లమెంట్లో 400 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో పార్లమెంట్లో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ టెస్టులు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, ఇప్పుడు సుప్రీంకోర్టులో కరోనా కలకలం రేగింది. సుప్రీంకోర్టులో కరోనా కేసులు వరసగా బయటపడుతున్నాయి. కోర్టులో 3 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందులో ఇప్పటి వరకు 150 మందికి కరోనా నిర్ధారణ జరిగింది. Read: ఢిల్లీ బాటలో రాజస్థాన్… ప్రజలకు… -
ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యం.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం పెద్ద రచ్చగా మారింది.. తన పర్యటనలో దాదాపు 20 నిమిషాలపు పాటు చిక్కుకుపోయిన ప్రధాని మోడీ.. ఆకస్మాత్తుగా తన పర్యటన రద్దు చేసుకుని తిరిగి ఢిల్లీ చేరుకున్నారు.. అయితే, దీనిపై తీవ్రస్థాయిలో రాజకీయ విమర్శల పర్వం కొనసాగుతుండగా.. ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.. మోడీ పర్యటనలో భద్రతా పరమైన అంశాలపై అటు కేంద్రంలోనూ, ఇటూ రాష్ట్రంలోనూ ఓ కమిటీ విచారిస్తున్న విషయం తెలిసిందే కాగా.. వచ్చే సోమవారం… -
నీట్ పీజీ ప్రవేశాలకు సుప్రీంకోర్టు అనుమతి
వైద్య విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. 2021-22 వార్షిక సంవత్సరానికి సంబంధించి నీట్ పీజీ అడ్మిషన్లకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, ఏఎస్ బొప్పన్నలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉదయం తీర్పు వెల్లడించింది. ఈ మేరకు నీట్ పీజీ ప్రవేశాలకు కోటాను కూడా ఫిక్స్ చేసింది. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్, ఆర్థిక బలహీన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్కు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. దీంతో నీట్ పీజీ కౌన్సెలింగ్పై నెలకొన్న ప్రతిష్టంభనకు… -
ప్రధాని మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం..! నేడు సుప్రీం విచారణ
భారత ప్రధాని నరేంద్ర మోడీ.. పంజాబ్ పర్యటన పెద్ద చర్చగా మారింది.. మోడీ భద్రతా ఉల్లంఘనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రధాని మోడీ భద్రతలో ఎలాంటి ఉల్లంఘన జరగకుండా చూడాలని పిటిషన్ దాఖలు చేశారు సీనియర్ న్యాయవాది మణిందర్సింగ్.. మరోవైపు, పిటిషన్ కాపీని కేంద్ర ప్రభుత్వంతో పాటు పంజాబ్ సర్కార్కు కూడా అందించాలని న్యాయవాది మణిందర్ సింగ్కు సూచించింది సుప్రీంకోర్టు.. ఇదే సమయంలో.. ఇవాళ పిటిషన్ను విచారించేందుకు అంగీకరించింది. ఇక, ఇవాళ సీజేఐ ఎన్వీ రమణ ఆ… -
సుప్రీంకోర్టుకు ప్రధాని మోడీ పర్యటన వ్యవహారం..
ప్రధాని నరేంద్ర మోడీ.. పంజాబ్ పర్యటన మధ్యలోనే రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి రావడం పెద్ద రచ్చగా మారింది.. ఈ వ్యవహారం ఏకంగా సుప్రీంకోర్టు తలుపులు తట్టింది.. భద్రతా లోపాల కారణంగా పంజాబ్పర్యటనను ప్రధాని మోడీ ఆకస్మికంగా ముగించిన వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. భద్రతా లోపాలపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్వేశారు సీనియర్అడ్వకేట్మణిందర్ సింగ్.. ఈ వ్యవమారంలో కేంద్ర ప్రభుత్వం పాటు పంజాబా్ సర్కార్కు నోటీసులు వెళ్లగా.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ఎన్వీ రమణ… -
సొంతూరుకు రానున్న సీజేఐ ఎన్వీ రమణ
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేటి నుంచి ఏపీలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కృష్ణా జిల్లాలోని ఎన్వీ రమణ సొంతూరైన పొన్నవరం రానున్నారు. గత రెండుసంవత్సరాల క్రితం జస్టిస్ ఎన్వీ రమన్ తన సొంతూరు వచ్చారు. అయితే తొలిసారి సీజేఐ హోదాలో స్వగ్రామానికి ఎన్వీ రమణ విచ్చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆయనను పొన్నవరంలో ఎడ్లబండిపై ఊరేగింపుగా తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్వీ రమణ స్వగ్రామానికి వస్తున్నందున గ్రామస్థుల అభినందన…
తాజావార్తలు
-
TSLPRB : పోలీస్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి పెంపు.!
-
Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
-
Golconda Traffic : గోల్కొండకు రేపు వెళ్లే వారూ.. ఈ రూట్లు గుర్తుపెట్టుకోండి.!
-
BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. ఆసియా కప్, ఆసియా క్రీడలకు స్టార్ బ్యాటర్ దూరం..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!