కొలీజియం సిఫార్సు.. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రేసులో ముగ్గురు మహిళలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
9 మంది న్యాయమూర్తుల నియామకాన్ని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది కొలీజియం.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని కొలీజియం.. ఈ సిఫార్సులు చేసింది.. తొమ్మిది మందిలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు కూడా ఉన్నారు.. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న భవిష్యత్తులో తొలి భారత సుప్రీం కోర్టు మహిళా ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.. జస్టిస్ విక్రమ్ నాధ్ ( గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి) జస్టిస్ బి.వి. నాగరత్న ( కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి)తో పాటు, సీనియర్ అడ్వకేట్ పీఎస్ నరసింహ భారత ప్రధాన న్యాయమూర్తులు అయ్యే అవకాశం ఉందంటున్నారు.
ఇక, నలుగురు హైరోర్టు ప్రధాన న్యాయమూర్తులను.. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లి, కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏ.ఎస్. ఓకా, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాధ్, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జే.కే.మహేశ్వరిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియామకం చేసేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు.. కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.టి. రవికుమార్, మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుందరేశ్ పేర్లు కూడా సిఫార్సు చేశారు.. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది, ( మహిళ న్యాయమూర్తి) పేరును కూడా సిఫార్సు చేసింది కొలీజియం. సుప్రీం కోర్టులో ఖాళీ గా ఉన్న మొత్తం 9 మంది న్యాయమూర్తుల నియామకాలకు సిఫార్సులు చేశారు. ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ నేతృత్వంలో మొత్తం ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన కొలీజియం.. జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఏ.ఎమ్. ఖన్విల్కర్, జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ లావు నాగేశ్వరరావు ఈ సిఫార్సులు చేసింది. కొలీజియం సిఫార్సు చేసిన సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్ పిఎస్ నరసింహా పేరును కనుక ప్రభుత్వం ఆమోదిస్తే, బార్ అసోసియేషన్ నుంచి ఇప్పటివరకు నేరుగా న్యాయమూర్తులుగా నియామకమైన 9 మందిలో ఒకరు కానున్నారు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
తాజావార్తలు
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కలకలం.. బెన్ స్టోక్స్పై వేటు తప్పదా?
-
Obsession Heroine : ‘అబ్సెషన్’ గర్ల్ను పరిచయం చేసింది మన దర్శకుడే !
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
-
OTT Releases This Week : తెలుగు నుంచి మలయాళం వరకు… ఈవారం ఓటీటీలో మస్ట్ వాచ్ మూవీస్
ట్రెండింగ్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?