వచ్చే నెల నుండి సుప్రీం కోర్టులో ప్రత్యక్ష విచారణ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబర్ 1 నుంచి సుప్రీం కోర్టు “ప్రత్యక్ష విచారణ” పునరుద్దరణకు ఆదేశాలు జారీ చేసింది ప్రధాన న్యాయమూర్తి. ప్రాణాంతక “కోవిడ్” పరిస్థితికి అనుగుణంగా ఈ నిర్ణయం అమలులో ఉంటుంది. అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించేందుకు కూడా అవకాశం ఉంది. సంబంధిత న్యాయమూర్తుల కమిటీ సిఫార్సులను ఆధారం చేసుకుని, బార్ అసోసియేన్స్ విజ్ఞప్తులను దృష్టి లో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రధాన న్యాయమూర్తి. ఈ మేరకు అధికార ప్రకటనను జారీ చేసింది సుప్రీం కోర్టు. కానీ సంబంధిత “కోవిడ్” నిబంధనలు మాత్రం అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.
అయితే ధర్మాసనం ఆదేశాలు జారీ చేస్తే తప్ప, తుది విచారణ కేసులు లేదా మామూలు రెగులర్ కేసులలో కోర్టు హాల్ లో పిటీషనర్ల తరఫున 20 మంది కంటే ఎక్కువ మంది లాయర్లు హాజరయ్యే అవకాశమే ఉంటే, ఆయా కేసులలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించేందుకు విచారణ కేసుల జాబితాను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఒకసారి ప్రత్యక్షంగా వాదనలు వినిపించేందుకు అడ్వకేట్ ఆన్ రికార్డు కాని, లేదా పిటీషనర్-ఇన్ పర్సన్ కానీ తమ పేర్లను నమోదు చేసుకున్న తర్వాత, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించేందుకు వారిని అనుమతించేదిలేదని స్పష్టం చేసిన ప్రకటన విడుదల చేసింది. ప్రత్యక్ష విచారణ జరిపే కేసులలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించేందుకు కూడా అవకాశం ఇస్తే, లాయర్లు రెండు పధ్దతుల్లోనూ వాదనలు వినిపించవచ్చు. ప్రత్యక్ష విచారణలో పాల్గొనేందుకు ఎంచుకున్నట్లయుతే, “అడ్వకేట్ ఆన్ రికార్డ్” కానీ, లేదా నామినీ కానీ హాజరు కావచ్చు. అలాగే, పిటీషనర్ తరఫు వాదనలు వినిపించే ఒక లాయర్ తో పాటు మరో జూనియర్ లాయర్ కూడా కోర్టు హాలులో ప్రవేశించేందుకు అనుమతి ఇచ్చింది.
Also Read
- Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
- West Bengal: ‘‘అమ్మాయిలు 3 నెలల స్కర్టులు ధరించొద్దు’’.. బెంగాల్ మంత్రి ఎందుకు ఇలా చెప్పారు.?
- Free LPG Cylinders Scheme: గుడ్న్యూస్ చెప్పిన గోవా సీఎం.. 3 ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్
- RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
అలాగే, ఒక కేసులో “అడ్వకేట్ ఆన్ రికార్డ్” ఎంపిక చేసుకున్న ఒక క్లర్క్ ను కూడా సంబంధిత కేసు పేపర్లు, జర్నల్స్ ను కోర్టు హాల్ వరకు మోసుకొచ్చేందుకు అనుమతి. ప్రత్యక్ష విచారణ కు హాజరయ్యే లాయర్లు, పిటీషనర్లకు ప్రత్యేక పాసులు జారీ. ప్రత్యక్ష విచారణ కేసుల జాబితా ను ప్రకటించిన తరువాత, మరుసటిరోజు 1 గంట లోగా, “అడ్వకేట్స్ ఆన్ రికార్డ్” ఆయా కేసుల్లో ప్రత్యక్షంగా హాజరౌతారో లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరౌతారో నమోదు చేసుకోవాలని ఆదేశించింది. సుప్రీం కోర్టు పోర్టల్ లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపింది.
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!