KTR: అలా చేసినట్లయితే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మూసి నది శుద్ధి, నగరాభివృద్ధి, పేదల ఇళ్ల నిర్మాణం వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మూసి నదిని శుభ్రపరచడం కోసం తమ ప్రభుత్వం ఉన్న సమయంలో 32 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని కేటీఆర్ తెలిపారు. మూసిలోకి వచ్చే ప్రతి నీటి చుక్కను శుద్ధి చేయాలన్నదే తమ ఆలోచన అని అన్నారు.
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
శుద్ధి చేసిన నీటిని నిర్మాణరంగానికి ఉపయోగపడే విధంగా తయారు చేసినట్లు వివరించారు. రెండో దశలో కాలేశ్వరం నీటిని మూసిలో ప్రవహింపజేయాలనే ప్రణాళిక కూడా ఉందని వెల్లడించారు. మూసి సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు కేటీఆర్. అయితే పేదల ఇళ్లను కూల్చకుండా ఆ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. మూసి పేరుతో ఎలాంటి అవినీతి జరిగితే బీఆర్ఎస్ అడ్డుకుంటుందని హెచ్చరించారు.
Ustaad Bhagat Singh:‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ పై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్..
అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యాయని, కానీ హైదరాబాద్లో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని ఆరోపించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు కేటీఆర్ సవాల్ విసిరారు. హైదరాబాద్లో ఒక్క ఇల్లు అయినా నిర్మించినట్లు చూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. పేద ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, రాబోయే రోజుల్లో వారు గట్టిగా స్పందిస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బడ్జెట్ సమావేశాల్లో పేదల గొంతుకగా ప్రభుత్వ విధానాలను ఎండగడతామని చెప్పారు. ప్రభుత్వం పాలన చేయలేకపోతే తప్పుకోవాలని, మంచి పాలన ఎలా ఉండాలో తాము చేసి చూపిస్తామని కేటీఆర్ అన్నారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!