ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిధుల వ్యవహారంలో ఉద్యోగులు నిరసన బాట పట్టారు.. మరోవైపు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీలో నిధుల బదలాయింపు ప్రక్రియ పూర్తి చేశారు అధికారులు.. రూ. 400 కోట్ల మేర వర్శిటీ నిధులను ఫైనాన్షియల్ సర్వీసు కార్పొరేషనులోకి బదలాయించారు వీసీ.. బదలాయింపు ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఓవైపు యూనివర్శిటీ ఉద్యోగుల ఆందోళన చేస్తున్నా.. ఈ ప్రక్రియను మాత్రం ఆపలేకపోయారు.. ఇక, ఈ వ్యవహారాన్ని తప్పుబడుతున్న ఉద్యోగులు విధులు బహిష్కరించి.. యూనివర్శిటీ ప్రారంగణంలో బైఠాయించారు. ఫైనాన్స్ కార్పొరేషన్ క్రెడిబిలిటీపై…
ఇంజనీరింగ్, డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులకు కాలేజీలు మొదలవ్వబోతున్నాయి. ఇప్పటికే కొత్త విద్యార్థులకు పరిచయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఆనందం ఎంతోకాలం నిలబడేట్టు కన్పించడం లేదు. కరోనా వేరియంట్ ఒమిక్రాన్ నీలినీడల నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి తిరిగి ఆన్లైన్ బోధన ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ దిశగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలను సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియలో భాగంగా మంగళవారం రాష్ట్రం లోని అన్ని విశ్వవిద్యాలయాల ఉప కులపతులతో సమావేశం నిర్వహిస్తోంది. ఆన్లైన్ విద్యాబోధనే ఇందులో…
కరోనా తరువాత చదువు, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లేవారి సంఖ్య మరింతగా పెరుగుతున్నది. ముఖ్యంగా ఇండియా నుంచి యూకే వెళ్లేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలను ఎత్తివేయడంతో మరింత ఎక్కువ మంది విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు యూరప్ దేశాలు సైతం జానాభాను పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. కరోనా సంక్షోభంలో యూరప్ లో భారీ ప్రాణనష్టం సంభవించింది. దీన్ని భర్తీ చేసుకునేందుకు యూరప్ దేశాలు వీసాలను సులభతరం చేసింది. Read:…
కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామని అనుకునే లోపే మళ్లీ కేసులు మొదలవుతున్నాయి. వ్యాక్సిన్ ను వేగంగా అందరికీ అందిస్తున్నా కరోనా నుంచి ఇప్పటి వరకు పూర్తిగా కోలుకోలేకపోయాం. తాజాగా కర్ణాటకలోని ధార్వాడ్లోని ఓ మెడికల్ కాలేజీలో 66 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్థారణ జరిగింది. 400 మంది విద్యార్థులున్న కాలేజీని మూసివేశారు. రెండు హాస్టల్స్ నుంచి విద్యార్థులు ఎవర్నీ బయటకు రానివ్వకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. Read: ఆ కొండ వెనుక కొండంత కష్టం……
ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్స్ ను మరోసారి పొడిగించారు. ఇప్పటికే పలుమార్లు తేదీని పొడిగిస్తూ వచ్చిన ఇంటర్ బోర్డ్ తాజాగా ఈనెల 30 వరకు గడువును పొడిగించింది. ఇదే చివరి అవకాశం అని, మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థులు 30 వ తేదీలోగా అడ్మీషన్లు పొందాలని పేర్కొన్నది. ఇక, ఈ విద్యాసంవత్సంలో ఇంటర్లో 70 శాతం సిలబస్ మాత్రమే ఉండబోతున్నట్టు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. Read: ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం సరికాదు: గోరంట్ల బుచ్చయ్య…
ఈశాన్యభారత దేశంలోని త్రిపుర రాష్ట్రప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకున్నది. హాస్టళ్లలో ఉండే విద్యార్థినుల కోసం వినూత్న నిర్ణయం తీసుకున్నది. హాస్టళ్లలో అమ్మప్రేమ పేరుతో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టినట్టు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రతన్లాల్ నాథ్ తెలిపారు. పిల్లలు.. తల్లులతో ఎక్కువ చనువుగా ఉంటారని, పిల్లలకు మొదటి గురువు తల్లే అని, హాస్టళ్లలో ఉండే పిల్లలతో తల్లులు రెండు వారాల పాటు ఉండేందుకు అవకాశం కల్పిస్తు మధర్ ఆన్ క్యాంపస్ పేరుతో పథకాన్ని తీసుకొచ్చినట్టు…
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.. రోడ్డు ప్రమాదానికి గురై రాత్రి సమయంలో సాయం కోసం ఎదురుచూస్తున్నవారికి బాసటగా నిలిచారు.. తన కాన్వాయ్లోనే ఆస్పత్రికి తరలించారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే బుధవారం రాత్రి సమయంలో మియాపూర్కు చెందిన ఇద్దరు విద్యార్థులు.. హకీంపేట దగ్గర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.. గాయాలపాలై సాయం కోసం ఎదురుచూస్తోన్న సమయంలో.. అటుగా వెళ్తున్న మంత్రి కేటీఆర్.. ఆ దృశ్యాలను గమనించారు.. వెంటనే కాన్వాయ్ని ఆపి కిందికి దిగారు.. విద్యార్థులను…
నరకానికి కేరాఫ్ అడ్రస్గా మారింది బోధన్ రోడ్డు. ఆ రోడ్డుపై వెళ్లాలంటేనే జనం వణికిపోతున్నారు. తీవ్రగాయాలతో ఆస్పత్రుల పాలవుతున్నవారు ఎందరో. గత రెండున్నరేళ్ళుగా బోధన, బాన్స్ వాడ రోడ్డుని ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలతో మరింతగా గుంతలు పడ్డాయి. గర్భిణీలు ఈ రోడ్డుపై వెళ్ళి ఆస్పత్రికి చేరాలంటే భయపడుతున్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చే నేతలు ఆ తర్వాత వాటి అమలును మరిచిపోతున్నారు. దీంతో రోడ్డు పై ప్రయాణించాలంటేనే జనం వణికిపోతున్నారు. రోజూ వందలాదిమంది…
ఏపీలో ఎయిడెడ్ కళాశాలలు, పాఠశాలల విలీన వ్యవహారం మరోసారి వివాదాస్పదమవుతోంది. ఎయిడెడ్ కాలేజీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ఆందోళన కార్యక్రమాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఎస్ఎస్బీఎన్ కాలేజీ, స్కూల్ విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. దీంతో నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జీ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోగా… ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు.…
సమాజంలో లింగ భేదాన్ని నిర్ములించడానికే ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. ఆడ, మగా ఇద్దరు సమానమేనని అందరు అంటూ ఉంటారు కానీ చేతల్లో మాత్రం చూపించరు. అమ్మాయి జీన్స్ వేసుకుంటే తప్పు లేదు.. కానీ అబ్బాయి మాత్రం స్కర్ట్ వేసుకుంటే మాత్రం అందరు వింతగా చూస్తారు.. ఎగతాళి చేస్తారు. లింగ బేధం లేనప్పుడు ఎవరు ఎలాంటి డ్రెస్ వేసుకొంటే ఏంటి..? అనే ప్రశ్న ఆ స్కూల్ విద్యార్థులకు వచ్చింది. ఆ ప్రశ్నే ఒక పోరాటానికే నాంది పలికింది. ఒక…