విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: ఆదిమూలపు సురేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోడల్ స్కూళ్లు, కేజీబీవీ విద్యార్థులకు అందజేసే భోజనం విషయంలో రాజీ పడబోమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం ఎన్నో కోట్లు ఖర్చు పెడుతుందని ఏ విషయంలోనూ రాజీపడొద్దని అధికారులకు సూచించారు. ఎక్కడైనా మెనూ సరిగా అమలు కావడం లేదని ఫిర్యాదు వస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా దర్శి, కడప జిల్లా ఖాజీపేట పాఠశాలల్లో వచ్చిన ఫిర్యాదులపై అధికారులు ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
కాగా జగన్ ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమం కింద విద్యార్థులకు పాఠశాలల్లో అన్ని సౌకర్యాలను కల్పించింది. ఇదే కాకుండా జగనన్న విద్యాదీవెన పేరుతో పేద విద్యార్థులకు నగదును సైతం అందజేస్తుంది. నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా జగన్ సర్కార్ ముందుకు వెళ్తుంది. నాడు నేడుకు ప్రత్యేకంగా ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని క్యాబినేట్ హోదా కల్పించి జగన్ సర్కార్ నియమించింది. పాఠశాల స్థాయి విద్యావ్యవస్థలో ఎక్కడ రాజీ పడబోమని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
Also Read
తాజావార్తలు
-
KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
-
V.D. Satheesan: “సతీశన్ అనే నేను”.. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
-
Vijay Jana Nayagan : విజయ్ CM అయినా కూడా రిలీజ్ పై క్లారిటీ రాని జననాయగన్
-
Jayam Ravi: జయం రవి వ్యక్తిగత వివాదం ఎఫెక్ట్..నిర్మాతల్లో పెరిగిన ఆందోళన
-
Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరల్లో ఇంత మార్పా?.. నేటి ధరలు ఇవే
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..