మోడల్ స్కూళ్లు, కేజీబీవీ విద్యార్థులకు అందజేసే భోజనం విషయంలో రాజీ పడబోమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం ఎన్నో కోట్లు ఖర్చు పెడుతుందని ఏ విషయంలోనూ రాజీపడొద్దని అధికారులకు సూచించారు. ఎక్కడైనా మెనూ సరిగా అమలు కావడం లేదని ఫిర్యాదు వస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా దర్శి, కడప జిల్లా ఖాజీపేట పాఠశాలల్లో వచ్చిన ఫిర్యాదులపై అధికారులు ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
కాగా జగన్ ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమం కింద విద్యార్థులకు పాఠశాలల్లో అన్ని సౌకర్యాలను కల్పించింది. ఇదే కాకుండా జగనన్న విద్యాదీవెన పేరుతో పేద విద్యార్థులకు నగదును సైతం అందజేస్తుంది. నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా జగన్ సర్కార్ ముందుకు వెళ్తుంది. నాడు నేడుకు ప్రత్యేకంగా ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని క్యాబినేట్ హోదా కల్పించి జగన్ సర్కార్ నియమించింది. పాఠశాల స్థాయి విద్యావ్యవస్థలో ఎక్కడ రాజీ పడబోమని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.