చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించే అవకాశాన్ని కోల్పోయింది. చైనాతో జరిగిన స్వర్ణ పతక పోరులో భారత్ ఓటమి పాలైంది.
ఆసియా క్రీడల్లో భారత్ పసిడి పంట పండిస్తుంది. తాజాగా భారత్ ఖాతాలో మరో రెండు గోల్డ్ మెడల్స్ చేరాయి. 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్, షాట్ఫుట్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్ వచ్చాయి.
భారత బాక్సర్ నిఖత్ జరీన్ సెమీ ఫైనల్లో ఓడిపోయింది. బాక్సింగ్లో స్వర్ణ పతకం సాధించాలన్న భారత్ ఆశలు ఆవిరయ్యాయి. 50 కేజీల విభాగంలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో నిఖత్ జరీన్ థాయ్లాండ్ బాక్సర్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో భారత వెటరన్ నిఖత్ జరీన్ 2-3 తేడాతో ఓటమి పాలైంది.
ICC వరల్డ్ కప్ 2023కి ముందు స్టార్ పాకిస్థాన్ ఆల్-రౌండర్ షాదాబ్ ఖాన్ తన పేలవమైన ఫామ్ను అంగీకరించాడు. షాదాబ్ ఖాన్ తన అధ్వాన్నమైన బౌలింగ్ ప్రదర్శనలు అతని మానసిక స్థితిపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయని చెప్పాడు. షాదాబ్ ఖాన్ బ్యాట్, బాల్ రెండింటిలోనూ రానించగల సత్తా ఉంది. అయితే ఈ ఆల్ రౌండర్ 2023 ఆసియా కప్లో 4.33 సగటుతో 13 పరుగులు మాత్రమే చేశాడు. 40.83 సగటుతో కేవలం ఆరు వికెట్లు తీశాడు.
న్యూజిలాండ్ తో వార్మప్ మ్యాచ్ లో ఓటమి చెందిన తర్వాత పాక్ జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా.. జట్టు ఓటమిపై పాక్ మాజీ ఆటగాడు రమీజ్ రాజా ఆగ్రహం వ్యక్తం చేశాడు.
చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు అద్భుత ప్రదర్శన చూపించింది. దక్షిణ కొరియా మహిళల జట్టుతో జరిగిన కీలకమైన మ్యాచ్లో.. భారత జట్టు మ్యాచ్ను 1-1తో డ్రాగా ముగించింది. దీంతో భారత మహిళల జట్టు సెమీఫైనల్లో చోటు ఖాయం చేసుకుంది.
ఆసియా క్రీడలు 2023లో పాకిస్థాన్తో జరిగిన పూల్-ఎ మ్యాచ్లో భారత హాకీ జట్టు చారిత్రాత్మక ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్లో భారత్ 10-2 తేడాతో విజయం సాధించింది.
ఆసియా క్రీడల్లో భారత్ మరో బంగారు పతకాన్ని కైవసం చేసుకుని రికార్డ్ సృష్టించింది. స్క్వాష్లో పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందింది. 2014 ఆసియా క్రీడల తర్వాత తొలిసారిగా స్క్వాష్లో భారత్ పతకం సాధించింది. ఫైనల్ మ్యాచ్లో భారత్కు చెందిన అభయ్సింగ్ పాకిస్థాన్కు చెందిన జమాన్ నూర్పై ఉత్కంఠ విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
ప్రపంచ కప్కు ముందు ఇండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ పై దక్షిణాఫ్రికా వెటరన్ క్రికెటర్ డేల్ స్టెయిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచ కప్ 2023లో సిరాజ్ ఆటతీరు చూడదగినదని స్టెయిన్ చెప్పాడు. ప్రపంచకప్లో అందరి దృష్టి ఫాస్ట్ బౌలర్లపైనే ఉంటుందని స్టెయిన్ అన్నాడు. అందులో మహ్మద్ సిరాజ్.. టీమిండియాకు కీలకమని నిరూపించుకుంటాడని తెలిపాడు.
ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. ఈసారి టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లో రోహన్ బోపన్న, రుతుజా భోసలే జోడీ స్వర్ణం సాధించింది. ఫైనల్లో భారత్ జోడీ 2-6, 6-3, 10-4తో తైపీ జోడీని ఓడించింది.