Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. ఫైనల్స్కు చేరిన హాకీ జట్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asian Games 2023: 2018లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు.. సెమీ ఫైనల్ లోనే ఓటిమిని చవిచూడల్సి వచ్చింది. కానీ ఈసారి ఆసియా గేమ్స్ లో భారత పురుషుల జట్టు ఫైనల్ కు చేరుకుంది. సెమీఫైనల్లో దక్షిణ కొరియాను 5-3తో ఓడించింది. దీంతో.. భారత జట్టు ఫైనల్స్కు చేరుకుంది. ఈ మ్యాచ్ లో ఐదో నిమిషంలో భారత జట్టు తొలి గోల్ చేసింది. అనంతరం 11వ నిమిషంలో మరో గోల్ చేసింది. దీంతో ఈ మ్యాచ్లో భారత జట్టు 2-0తో ముందుకు దూసుకెళ్లింది.
Read Also: Union Cabinet: కీలక నిర్ణయాలు.. గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ, పసుపు బోర్డుకు ఆమోదం
Also Read
ఈ మ్యాచ్ 15వ నిమిషంలో భారత్ మూడో గోల్ చేయగా.. 17వ నిమిషంలో దక్షిణ కొరియా తొలి గోల్ చేసింది. ఆ తర్వాత 20వ నిమిషంలో దక్షిణ కొరియా రెండో గోల్ చేసింది. అయితే ఈ సమయంలో టీమిండియా 3-2తో ముందంజలో ఉంది. ఆ తర్వాత భారత ఆటగాళ్లు దూకుడుగా ఆడి మంచి ప్రదర్శనను చూపించారు.
Read Also: David Warner: డేవిడ్ భాయ్ బౌలింగ్ చూశారా.. మాములుగా లేదు..! పరుగుల సమర్పయామి
24వ నిమిషంలో భారత్కు నాలుగో గోల్ వచ్చింది. దీంతో భారత జట్టు 4-2తో ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత దక్షిణ కొరియా మరోసారి ఎదురుదాడికి దిగింది. 42వ నిమిషంలో దక్షిణ కొరియా గోల్ చేసింది. దీంతో స్కోరు 4-3గా మారింది. భారత జట్టు ఆధిక్యం చెక్కుచెదరలేదు. అంతేకాకుండా.. 54వ నిమిషంలో భారత్ ఐదో గోల్ చేసింది. దీంతో మ్యాచ్లో భారత జట్టు 5-3తో ముందంజ వేసింది. చివర్లో టీమ్ ఇండియా దక్షిణ కొరియా ఆటగాళ్లకు గోల్స్ చేసే అవకాశం ఇవ్వకుండా.. మంచి ప్రదర్శన చూపించారు. దీంతో భారత జట్టు 5-3తో దక్షిణ కొరియాను ఓడించి ఫైనల్కు చేరుకుంది.
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?