World Cup 2023: మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న క్రికెట్ సంగ్రామం.. వివరాలివే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Cup 2023: మరికొన్ని గంటల్లో ప్రపంచ కప్ మహా సంగ్రామం ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్లతో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. వన్డే ప్రపంచకప్లలో ఇది 13వ ఎడిషన్. భారత్లో నిర్వహిస్తున్న ఈ టోర్నీ వివిధ నగరాల్లోని 10 స్టేడియాల్లో జరగనుంది. ఈ ప్రపంచకప్కు సంబంధించిన A to Z వివరాలను తెలుసుకుందాం.
Sunil Gavaskar: కప్ గెలవడం ఎంత ముఖ్యమో.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంతే ముఖ్యం
Also Read
- CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
- Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
- TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
- Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
ప్రపంచ కప్లో పాల్గొనే జట్లు ఇవే..
ఈసారి ప్రపంచకప్లో 10 జట్లు పాల్గొంటున్నాయి. వాటిలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి.
ఎన్ని మ్యాచ్లు ఆడతారు.. ఫార్మాట్ ఏమిటి?
మొత్తం ప్రపంచకప్లో మొత్తం 48 మ్యాచ్లు జరగనున్నాయి. ముందుగా రౌండ్ రాబిన్ మ్యాచ్లు జరుగుతాయి. ఈ దశలో ఒక జట్టు మిగిలిన 9 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అత్యధిక పాయింట్లు సాధించిన నాలుగు జట్లు సెమీఫైనల్కు చేరుకుంటాయి. రెండు సెమీ ఫైనల్ మ్యాచ్ల తర్వాత ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
మ్యాచ్లు ఎప్పుడు, ఎన్నిరోజులు ఆడతారు?
ప్రపంచకప్ మ్యాచ్లు అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుండగా.. ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 19న జరుగనుంది. అంటే మొత్తం 46 రోజుల పాటు ఈ టోర్నీ కొనసాగనుంది. అన్ని మ్యాచ్లకు రెండు సమయాలను నిర్ణయించారు. డే మ్యాచ్లు ఉదయం 10.30 గంటలకు, డే-నైట్ మ్యాచ్లు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి.
మ్యాచ్లు జరిగే వేదికలు ఇవే..
భారతదేశంలోని 10 నగరాల్లో మ్యాచ్లు నిర్వహించబడతాయి. అందులో అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, లక్నో, పూణే, బెంగళూరు, హైదరాబాద్ మరియు ధర్మశాల ఉన్నాయి.
లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్ట్ ఎక్కడ చూడొచ్చంటే
ప్రపంచ కప్ 2023 మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారాన్ని Disney + Hotstarలో చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానెల్లలో టీవీలో మ్యాచ్లు లైవ్ చూడవచ్చు.
రిజర్వ్ రోజులు ఉన్నాయా..?
సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్లకు రిజర్వ్ డే ఉంచారు. రిజర్వ్ రోజులు షెడ్యూల్ చేయబడిన మ్యాచ్ తేదీ తర్వాత రోజు ఉంటుంది.
ఈసారి తేడా ఏమిటి?
గత ప్రపంచకప్ల కంటే ఈ ప్రపంచకప్లో జట్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మొదటి రెండు ప్రపంచకప్లు గెలిచిన వెస్టిండీస్ జట్టు ఈసారి ప్రపంచకప్లో భాగం కాకపోవడం అతిపెద్ద విషయం. విండీస్ జట్టు ఈసారి అర్హత సాధించలేకపోయింది.
సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్లు ఎక్కడ ఆడతారు?
అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సెమీ ఫైనల్ మ్యాచ్లు ముంబైలోని వాంఖడే స్టేడియం, కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగుతాయి.
భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ..
భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అక్టోబర్ 14 మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
ఈసారి హోస్ట్ చేయడంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి?
వన్డే ప్రపంచకప్కు భారత్ ఒంటరిగా ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. గతంలో 1987, 1996, 2011లో దక్షిణాసియా దేశాలతో కలిసి భారత్ సంయుక్తంగా ప్రపంచకప్ను నిర్వహించింది.
- Tags
- cricket
- details
- india
- Sports
- telugu news
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!