ఆసియా క్రీడల్లో భారత్ ఎప్పటికప్పుడు కొత్త చరిత్ర సృష్టిస్తూనే ఉంది. ఆసియా క్రీడల్లో 14వ రోజు కూడా భారత్ పతకాల పరంపరను కొనసాగించింది. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ పోటీల్లో భారత్కు చెందిన సాత్విక్సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టిలు దేశానికి తొలి బంగారు పతకాన్ని అందించి రికార్డు సృష్టించారు. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ పోటీల్లో భారత్ తొలిసారి స్వర్ణం సాధించింది. హాంగ్జౌలోని బింజియాంగ్ జిమ్నాసియం BDM కోర్ట్ 1లో జరిగిన పురుషుల డబుల్స్ పోటీలో భారత బ్యాడ్మింటన్ జోడీ 21-18, 21-16తో దక్షిణ కొరియాకు చెందిన చోయ్ సోల్గ్యు-కిమ్ వోన్హో జోడీని ఓడించింది.
Read Also: Team India: వరల్డ్ కప్ కు ముందు టీమిండియాకి షాకుల మీద షాకులు
పురుషుల డబుల్ బ్యాడ్మింటన్ ఫైనల్ మొదటి మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. ఇందులో సోల్గ్యు, వోన్హో విరామ సమయానికి 11-9 ఆధిక్యంలో ఉన్నారు. తొలి మ్యాచ్లో రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి 15-18 స్కోరుతో ఓటమి దిశగా పయనించినా.. ఆ తర్వాత అద్భుతంగా పునరాగమనం చేసి వరుసగా 6 పాయింట్లు సాధించి మ్యాచ్ను పూర్తిగా మలుపు తిప్పారు. ఈ భారత జోడీ మ్యాచ్ 29వ నిమిషంలో స్కోరును 15-18 నుంచి 21-18కి తీసుకెళ్లింది.
Read Also: Team India: వరల్డ్ కప్ కు ముందు టీమిండియాకి షాకుల మీద షాకులు
రెండో మ్యాచ్లోనూ తమ జోరు కొనసాగించిన భారత జోడీ.. రెండో మ్యాచ్ విరామ సమయానికి 11-7తో బలమైన ఆధిక్యంలో నిలిచింది. చివరి మ్యాచ్లో దక్షిణ కొరియా జోడీ చివరిసారిగా పునరాగమనం చేసేందుకు ప్రయత్నించింది. కానీ భారత జోడీ వారిని అడ్డుకోవడంలో సఫలమై 27వ నిమిషంలో 21-16తో రెండో గేమ్ను గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్లో వరుసగా రెండు గేమ్లు గెలవడం ద్వారా భారత జోడీ ఆసియా క్రీడలు 2023లో బ్యాడ్మింటన్లో బంగారు పతకాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించింది.