అనారోగ్య సమస్యలతో పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయీద్ అహ్మద్ (86) కన్నుమూశారు. అహ్మద్ 1958-73 మధ్య పాక్ తరఫున 41 టెస్టులు ఆడారు. అందులో 5 సెంచరీలు, 16 అర్ధ శతకాలతో 2991 పరుగులు చేశారు. అంతేకాకుండా.. అహ్మద్ రైట్ ఆర్మ్ స్పిన్నర్ కాగా.. 22 వికెట్లు కూడా తీశారు. ఇదిలా ఉంటే.. అహ్మద్ చేసిన 5 శతకాలలో మూడు ఇండియాపైనే నమోదు చేశారు.
న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ గెలిచి ఆస్ట్రేలియా జట్టు మంచి ఊపు మీదుంది. ఆ తర్వాత.. ఆఫ్ఘనిస్తాన్ తో టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. కాగా.. మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్.. ఆగష్ట్ లో షెడ్యూల్ అయింది. అయితే.. ఆ సిరీస్ ను వాయిదా వేస్తున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ ప్రకటించింది. అయితే ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల రాజ్యం రాగానే మహిళల క్రికెట్ జట్టుపై అక్కడి ప్రభుత్వం బ్యాన్ వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇస్లాం మత సంప్రదాయం…
దాదాపు రెండు నెలల తర్వాత టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఐపీఎల్ 2024తో ఎంట్రీ ఇవ్వనున్నాడు. మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్సీబీ జట్టుతో కలిసి.. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ప్రతి ఐపీఎల్ కు ఎవరో ఒక ఆటగాడు వినూత్నమైన స్టైల్ లో ఆకట్టుకోవడం మన చూశాం. తాజాగా.. కింగ్ కోహ్లీ ఈ ఐపీఎల్ లో ఆకట్టుకోవడానికి కొత్త లుక్ లో వస్తున్నాడు.
విమెన్స్ ప్రీమియర్ లీగ్లో బెంగళూరు జట్టు ఫైనల్లో ఘన విజయం సాధించింది. ఢిల్లీపై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ 113 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి మందన సేన అలవోకగా విజయం సాధించింది.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2024) రెండో ఎడిషన్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. అనూహ్యంగా ఫైనల్కు చేరిన బెంగళూరు టీమ్ ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ను 113 పరుగులకే ఆలౌట్ చేసింది.
నెల్లూరులో క్రీడాకారులకు క్రికెట్ కిట్లను వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావుతో పాటు జెడ్పీ చైర్మన్ అరుణమ్మ, మేయర్ స్రవంతి, జిల్లా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
ఐపీఎల్ 2024 మార్చి 22న ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికొస్తే, కొత్త ప్లేయర్స్ తో బలంగా ఉంది. ఇప్పటికే ఐడెన్ మార్క్రమ్ ను కెప్టెన్ గా తొలగించి, ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ప్యాట్ కమిన్స్ కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. జట్టులోనూ భారీగా మార్పులు చేపట్టింది. మరోవైపు.. ఈరోజు కొత్త జెర్సీని కూడా విడుదల చేసింది.
భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సిరీస్ లో ఐదో మ్యాచ్ ధర్మశాల వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్ టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు ఎంతో ప్రత్యేకం. తన వందో టెస్టుపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రయాణం తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పుకొచ్చాడు. గమ్యం కంటే ఎక్కువ అని అశ్విన్ అన్నాడు.
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో భాగంగా సోమవారం పెషావర్ జెల్మీ, ఇస్లామాబాద్ యునైటెడ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇస్లామాబాద్ ఆటగాడు కోలిన్ మున్రో బాల్ బాయ్ ను ఎత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నప్పటికీ ప్లే ఆఫ్కు చేరకముందే నిష్క్రమిస్తుంది. ఇలాంటి క్రమంలో ఈసారి జరిగిన వేలంలో యాజమాన్యం ఆచితూచి మంచి ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్, ట్రేవిస్ హెడ్, హసరంగా వంటి విదేశీ ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. దీంతో ఈసారి సన్ రైజర్స్ జట్టు బలంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తమ జట్టుకు కొత్త సారథిని నియమించింది.…