పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ (89) నేడు(మార్చి 23) లాహోర్లో కన్నుమూశారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఓ పత్రికా ప్రకటన ద్వారా ఈ సమాచారాన్ని తెలిపింది. షహర్యార్ ఖాన్ మరణం పాక్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీతో మ్యాచ్లో పంజాబ్ టాస్ నెగ్గింది. కెప్టెన్ శిఖర్ ధావన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ఐపీఎల్ సీజన్ 17 శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్ లో చెన్నై వర్సెస్ బెంగళూరు జట్ల చెపాక్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీపై చెన్నై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ ప్రారంభమైంది. ఐపీఎల్లో ట్రోఫీని అందుకోవడానికి 10 జట్ల మధ్య పోరాటం మొదలైంది. టోర్నీ ప్రారంభం కావడంతో అంచనాల పర్వం కూడా మొదలైంది. టోర్నీ ప్రారంభం కావడంతో పలువురు వెటరన్ క్రికెటర్లు కూడా అంచనాలు వేయడం ప్రారంభించారు.
గంటల కొద్దీ నిరీక్షణ ముగిసింది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024 ఓపెనింగ్ సెర్మనీ) 17వ సీజన్ ప్రారంభమైంది. సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ తొలి మ్యాచ్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య జరుగుతుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్లో అందరి దృష్టి ఆర్సీబీ స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీపైనే ఉంది.