కొరియా ద్వీపకల్పంలో వాతావరణం కాస్త ఉద్రిక్తంగా మారింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్-ఉన్ వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి ప్రయోగాత్మక పరీక్షను పర్యవేక్షించారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
ఉత్తర కొరియా సైనిక జనరల్ను ఆయన తొలగించారు. అంతేకాదు, యుద్ధం వచ్చే ఛాన్స్ ఉందని, ఇందుకు రెడీ కావాలని సూచించినట్టు ఉత్తర కొరియా అధికారిక మీడియా తెలిపింది.
ఉత్తర కొరియా ఇవాళ (బుధవారం) తెల్లవారు జామున మళ్లీ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అమెరికా అణు జలాంతర్గామి దక్షిణ కొరియాకు వెళ్లిన నేపథ్యంలో నార్త్ కొరియా రెండు క్షిపణులను ప్రయోగించడం సంచలనం రేపుతుంది. ఉత్తర కొరియా ఇవాళ తెల్లవారు జామున ప్యోంగ్యాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని సైట్ నుంచి ఈ రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది.
ఉత్తర కొరియా నియంత్రిస్తున్న ప్రాంతం గగనతలంలోకి అమెరికా మిలిటరీ గూఢచారి విమానం ఎనిమిది సార్లు ప్రవేశించిందని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ తెలిపారు. తమ దేశానికి చెందిన యుద్ధ విమానాలు ఆ అమెరికా గూఢచారి విమానాన్ని తరిమికొట్టాయని అన్నారు.
కరీంనగర్ నగరం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది అని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టాక చెప్పిన మాటలు ప్రస్తుతం నిజం అవుతున్నాయని ఆయన వెల్లడించారు. నగరం రోడ్ల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.. రాష్ట్రంలో రెండవ నగరంగా కరీంనగర్ అభివృద్ధి చెందింది అని మంత్రి గంగులా అన్నారు.
South Korea: దక్షిణ కొరియా ప్రభుత్వం తమ పౌరుల వయసును లెక్కించేందుకు అంతర్జాతీయ విధాని్ని అనుసరించబోతోంది. బుధవారం నుంచి కొరియా ప్రభుత్వం ఈ విధానాన్ని పాటించనుంది. దీంతో అక్కడి పౌరుల వయసు ఒకటి నుంచి రెండుళ్లు తగ్గబోతోంది.
ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్లో వేలాది మంది కొరియన్లు వీధుల్లోకి వచ్చారు. వారాంతంలో ప్రజలు అమెరికన్ వ్యతిరేక మార్చ్ను చేపట్టారు. యునైటెడ్ స్టేట్స్ను నాశనం చేసినందుకు "ప్రతీకార యుద్ధం" అని ప్రతిజ్ఞ చేస్తూ నిరసన నినాదాలు చేశారు.
North Korea: ఇటీవల ఉత్తర కొరియా ప్రయోగించిన గూఢాచార శాటిలైట్ విఫలం అయింది. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఈ ప్రయోగాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించాడు. అయితే ఈ ప్రయోగం విఫలమై, రాకెట్ సముద్రంలో కుప్పకూలిపోయింది. తన మొదటి సైనిక గూఢచారి ఉపగ్రహాన్ని మే 31న కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి ప్రయత్నించింది. సరిహద్దు దేశాల అభ్యంతరాలను పట్టించుకోకుండా ఆ దేశం ప్రయోగాన్ని నిర్వహించింది.
ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది, ఈ సంవత్సరం ఇప్పటివరకు ప్యాంగ్యాంగ్ నిర్వహించిన నిషేధిత ఆయుధ పరీక్షల్లో తాజాది అని దక్షిణ కొరియా సైన్యం గురువారం తెలిపింది.
North Korea: ఉత్తర కొరియా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గూఢచారి ఉపగ్రహం సముద్రంలో కుప్పకూలింది. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని ఎంతో కీలకంగా భావించారు. జపార్, సౌత్ కొరియాల అభ్యంతరాలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఈ ప్రయోగం చేపట్టారు. అయితే శాటిలైట్ ప్రయోగ సమయంలో రాకెట్ లో సాంకేతిక లోపం సంభవించింది. దీంతో సముద్రంలో కుప్పకూలిపోయినట్లు ఆదే మీడియా వెల్లడించింది.