North Korea: కిమ్ పర్యవేక్షణలో క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
North Korea: కొరియా ద్వీపకల్పంలో వాతావరణం కాస్త ఉద్రిక్తంగా మారింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్-ఉన్ వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి ప్రయోగాత్మక పరీక్షను పర్యవేక్షించారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అదే సమయంలో యూఎస్, దక్షిణ కొరియా సైన్యాలు తమ వార్షిక సైనిక వ్యాయామాన్ని ప్రారంభించాయి. ఇది దాడికి రిహార్సల్గా ఉత్తర కొరియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ల అధినేతలు తమ తొలి త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం జరిగిన మూడు రోజుల తర్వాత ఉత్తర కొరియా క్షిపణి పరీక్షల గురించి వార్తలు వచ్చాయి.
Read Also: Sonia Gandhi: రాజీవ్ గాంధీ జీవితం దారుణంగా ముగిసింది.. తక్కువ సమయంలో ఎన్నో మైలు రాళ్లను సాధించారు
Also Read
- BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
శిఖరాగ్ర సమావేశంలో ఉత్తర కొరియా నుంచి పెరుగుతున్న అణు, క్షిపణి బెదిరింపులను ఎదుర్కోవడానికి బాలిస్టిక్ క్షిపణి రక్షణపై సహకారాన్ని పెంచుకోవాలని మూడు దేశాలు అంగీకరించాయి. ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ నౌకాదళ విభాగాన్ని సందర్శించి వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి పరీక్షను పర్యవేక్షించినట్లు రాష్ట్ర మీడియా సోమవారం నివేదించింది. జపాన్ సముద్రం అని కూడా పిలవబడే తూర్పు సముద్రంలో కిమ్ తన నౌకాదళంలో యుద్ధనౌకను ఒకదానిని పరిశీలించారు. వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించే డ్రిల్ను ప్రదర్శించడాన్ని వీక్షించారు.
Read Also: EPFO: జూన్లో ఈపీఎఫ్వోలో చేరిన 17.89 లక్షల మంది సభ్యులు..
కేసీఎన్ఏ ప్రకారం, క్షిపణులు ఉద్దేశించిన లక్ష్యాలను లోపం లేకుండా చేధించాయి. ఉత్తర కొరియా నావికాదళం కోసం మరింత శక్తివంతమైన యుద్ధనౌకలను తయారు చేసేందుకు, షిప్బోర్డ్, నీటి అడుగున ఆయుధ వ్యవస్థలను ఆధునీకరించే ప్రయత్నాలను ప్రోత్సహిస్తానని కిమ్ చెప్పారు. క్రూయిజ్ క్షిపణి పరీక్షలపై ఉత్తర కొరియా చేసిన నివేదికలు వాస్తవాలకు అనుగుణంగా లేవని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఒక ప్రకటనలో తెలిపారు.2022 సంవత్సరం ప్రారంభం నుంచి ఉత్తర కొరియా 100 కంటే ఎక్కువ ఆయుధ పరీక్షలను నిర్వహించింది. వీటిలో కొన్ని యూఎస్ ప్రధాన భూభాగం, దాని మిత్రదేశాలైన దక్షిణ కొరియా, జపాన్లపై దాడి చేయడానికి రూపొందించిన అణు క్షిపణులు ఉన్నాయి. యూఎస్, దక్షిణ కొరియా ప్రతిస్పందనగా వారి సాధారణ శిక్షణా వ్యాయామాలను విస్తరించాయి.
తాజావార్తలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!