North Korea: కిమ్ పర్యవేక్షణలో క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
North Korea: కొరియా ద్వీపకల్పంలో వాతావరణం కాస్త ఉద్రిక్తంగా మారింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్-ఉన్ వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి ప్రయోగాత్మక పరీక్షను పర్యవేక్షించారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అదే సమయంలో యూఎస్, దక్షిణ కొరియా సైన్యాలు తమ వార్షిక సైనిక వ్యాయామాన్ని ప్రారంభించాయి. ఇది దాడికి రిహార్సల్గా ఉత్తర కొరియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ల అధినేతలు తమ తొలి త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం జరిగిన మూడు రోజుల తర్వాత ఉత్తర కొరియా క్షిపణి పరీక్షల గురించి వార్తలు వచ్చాయి.
Read Also: Sonia Gandhi: రాజీవ్ గాంధీ జీవితం దారుణంగా ముగిసింది.. తక్కువ సమయంలో ఎన్నో మైలు రాళ్లను సాధించారు
Also Read
- Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
- West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
- Bengaluru: ఎయిరిండియాకు తప్పిన పెను ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో ఏం జరిగిందంటే..!
- RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
శిఖరాగ్ర సమావేశంలో ఉత్తర కొరియా నుంచి పెరుగుతున్న అణు, క్షిపణి బెదిరింపులను ఎదుర్కోవడానికి బాలిస్టిక్ క్షిపణి రక్షణపై సహకారాన్ని పెంచుకోవాలని మూడు దేశాలు అంగీకరించాయి. ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ నౌకాదళ విభాగాన్ని సందర్శించి వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి పరీక్షను పర్యవేక్షించినట్లు రాష్ట్ర మీడియా సోమవారం నివేదించింది. జపాన్ సముద్రం అని కూడా పిలవబడే తూర్పు సముద్రంలో కిమ్ తన నౌకాదళంలో యుద్ధనౌకను ఒకదానిని పరిశీలించారు. వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించే డ్రిల్ను ప్రదర్శించడాన్ని వీక్షించారు.
Read Also: EPFO: జూన్లో ఈపీఎఫ్వోలో చేరిన 17.89 లక్షల మంది సభ్యులు..
కేసీఎన్ఏ ప్రకారం, క్షిపణులు ఉద్దేశించిన లక్ష్యాలను లోపం లేకుండా చేధించాయి. ఉత్తర కొరియా నావికాదళం కోసం మరింత శక్తివంతమైన యుద్ధనౌకలను తయారు చేసేందుకు, షిప్బోర్డ్, నీటి అడుగున ఆయుధ వ్యవస్థలను ఆధునీకరించే ప్రయత్నాలను ప్రోత్సహిస్తానని కిమ్ చెప్పారు. క్రూయిజ్ క్షిపణి పరీక్షలపై ఉత్తర కొరియా చేసిన నివేదికలు వాస్తవాలకు అనుగుణంగా లేవని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఒక ప్రకటనలో తెలిపారు.2022 సంవత్సరం ప్రారంభం నుంచి ఉత్తర కొరియా 100 కంటే ఎక్కువ ఆయుధ పరీక్షలను నిర్వహించింది. వీటిలో కొన్ని యూఎస్ ప్రధాన భూభాగం, దాని మిత్రదేశాలైన దక్షిణ కొరియా, జపాన్లపై దాడి చేయడానికి రూపొందించిన అణు క్షిపణులు ఉన్నాయి. యూఎస్, దక్షిణ కొరియా ప్రతిస్పందనగా వారి సాధారణ శిక్షణా వ్యాయామాలను విస్తరించాయి.
తాజావార్తలు
-
Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
-
IPL Tickets Block: 39 వేల టికెట్లు.. నిమిషాల్లో మాయం.! ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ వెనుక పెద్ద దందా.?
-
Fire Accident : NH-44 పై భారీ ప్రమాదం.. 8 కొత్త కార్లు పూర్తిగా దగ్ధం..!
-
West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
-
Bengaluru: ఎయిరిండియాకు తప్పిన పెను ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో ఏం జరిగిందంటే..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!