North Korea: కిమ్ పర్యవేక్షణలో క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
North Korea: కొరియా ద్వీపకల్పంలో వాతావరణం కాస్త ఉద్రిక్తంగా మారింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్-ఉన్ వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి ప్రయోగాత్మక పరీక్షను పర్యవేక్షించారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అదే సమయంలో యూఎస్, దక్షిణ కొరియా సైన్యాలు తమ వార్షిక సైనిక వ్యాయామాన్ని ప్రారంభించాయి. ఇది దాడికి రిహార్సల్గా ఉత్తర కొరియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ల అధినేతలు తమ తొలి త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం జరిగిన మూడు రోజుల తర్వాత ఉత్తర కొరియా క్షిపణి పరీక్షల గురించి వార్తలు వచ్చాయి.
Read Also: Sonia Gandhi: రాజీవ్ గాంధీ జీవితం దారుణంగా ముగిసింది.. తక్కువ సమయంలో ఎన్నో మైలు రాళ్లను సాధించారు
Also Read
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
- Mahua Moitra: మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి.. ఓ రెస్టారెంట్ దగ్గర ఘటన
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
శిఖరాగ్ర సమావేశంలో ఉత్తర కొరియా నుంచి పెరుగుతున్న అణు, క్షిపణి బెదిరింపులను ఎదుర్కోవడానికి బాలిస్టిక్ క్షిపణి రక్షణపై సహకారాన్ని పెంచుకోవాలని మూడు దేశాలు అంగీకరించాయి. ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ నౌకాదళ విభాగాన్ని సందర్శించి వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి పరీక్షను పర్యవేక్షించినట్లు రాష్ట్ర మీడియా సోమవారం నివేదించింది. జపాన్ సముద్రం అని కూడా పిలవబడే తూర్పు సముద్రంలో కిమ్ తన నౌకాదళంలో యుద్ధనౌకను ఒకదానిని పరిశీలించారు. వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించే డ్రిల్ను ప్రదర్శించడాన్ని వీక్షించారు.
Read Also: EPFO: జూన్లో ఈపీఎఫ్వోలో చేరిన 17.89 లక్షల మంది సభ్యులు..
కేసీఎన్ఏ ప్రకారం, క్షిపణులు ఉద్దేశించిన లక్ష్యాలను లోపం లేకుండా చేధించాయి. ఉత్తర కొరియా నావికాదళం కోసం మరింత శక్తివంతమైన యుద్ధనౌకలను తయారు చేసేందుకు, షిప్బోర్డ్, నీటి అడుగున ఆయుధ వ్యవస్థలను ఆధునీకరించే ప్రయత్నాలను ప్రోత్సహిస్తానని కిమ్ చెప్పారు. క్రూయిజ్ క్షిపణి పరీక్షలపై ఉత్తర కొరియా చేసిన నివేదికలు వాస్తవాలకు అనుగుణంగా లేవని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఒక ప్రకటనలో తెలిపారు.2022 సంవత్సరం ప్రారంభం నుంచి ఉత్తర కొరియా 100 కంటే ఎక్కువ ఆయుధ పరీక్షలను నిర్వహించింది. వీటిలో కొన్ని యూఎస్ ప్రధాన భూభాగం, దాని మిత్రదేశాలైన దక్షిణ కొరియా, జపాన్లపై దాడి చేయడానికి రూపొందించిన అణు క్షిపణులు ఉన్నాయి. యూఎస్, దక్షిణ కొరియా ప్రతిస్పందనగా వారి సాధారణ శిక్షణా వ్యాయామాలను విస్తరించాయి.
తాజావార్తలు
-
Nabha Natesh: పాములు మా ఇంట్లో కాపురం ఉంటాయి.. వాటిని చూస్తూ టిఫిన్ చేస్తా: నభా నటేష్ షాకింగ్ కామెంట్స్!
-
CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
-
Netanyahu: నెతన్యాహు పీఠం కదులుతోంది.. ఇజ్రాయెల్ ప్రధానిని గద్దె దించేందుకు రంగంలోకి దిగిన మాజీ సైన్యాధిపతి!
-
PKCW : పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేయాలనుకుంటున్నారా? ఆ క్రియేటివ్ వరల్డ్లోకి మీకూ ఎంట్రీ!
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!