Kim Yo Jong: ఉత్తర కొరియా గగనతలంలోకి అమెరికా గూఢచారి విమానం.. కిమ్ సోదరి వార్నింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kim Yo Jong: ఉత్తర కొరియా నియంత్రిస్తున్న ప్రాంతం గగనతలంలోకి అమెరికా మిలిటరీ గూఢచారి విమానం ఎనిమిది సార్లు ప్రవేశించిందని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ తెలిపారు. తమ దేశానికి చెందిన యుద్ధ విమానాలు ఆ అమెరికా గూఢచారి విమానాన్ని తరిమికొట్టాయని అన్నారు. ఆ ప్రాంతంలో అమెరికా నిఘా కార్యకలాపాలు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించారు.ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియాలో ప్రచురించిన కిమ్ సోదరి యో జోంగ్ వ్యాఖ్యలపై అమెరికా, దక్షిణ కొరియా మిలిటరీలు ఇంకా స్పందించలేదు.
Also Read: World Population Day 2023: నేడు ప్రపంచ జనాభా దినోత్సవం.. ప్రాముఖ్యత ఏంటో తెలుసా?
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
మరోవైపు ఉత్తర కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానిస్తూ.. గతంలో అమెరికా తమ గగనతలంలోకి గూఢచారి విమానాలను ఎగురవేస్తోందని ఆరోపించింది. వాటిని కూడా కూల్చివేస్తామని హెచ్చరించింది. ఉత్తర కొరియా భూభాగంలోకి అమెరికా గూఢచారి విమానాలను ఎగురవేయడాన్ని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఖండించారు. దక్షిణ కొరియా సైన్యంతో కలిసి అమెరికా ప్రామాణిక నిఘా కార్యకలాపాలు చేస్తోందని వారు తెలిపారు. ఆ మాటలపై స్పందించిన కిమ్ యో జోంగ్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ యూఎస్ మిలిటరీకి ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.అమెరికా తన నిఘా కార్యకలాపాలను ముమ్మరం చేస్తోందని, ఇది ఉత్తర కొరియా సార్వభౌమాధికారం, భద్రతకు తీవ్ర విఘాతం కలిగిస్తోందని ఆమె పేర్కొన్నారు.
Also Read: India: 2075 నాటికి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
ఉత్తర కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన తమ ప్రాదేశిక గగనతలంలోకి చొరబడడాన్ని సూచించగా, ఉత్తర కొరియాకు చెందిన ప్రత్యేక ఆర్థిక మండలంలోకి అమెరికా గూఢచారని విమానాన్ని పంపిందని కిమ్ యో జోంగ్ ఆరోపించారు.ఈ ప్రాంతంలోకి అమెరికా గూఢచారి విమానం ప్రవేశించిందని, అయితే ఉత్తర కొరియా యుద్ధ విమానాలు దానిని తరిమికొట్టాయని ఆమె చెప్పారు.ఆపై ఉత్తర కొరియా సైన్యం నుంచి బలమైన హెచ్చరిక వచ్చింది.ఉత్తర కొరియా తమ ప్రత్యేక ఆర్థిక జోన్పై నిఘా విమానాలను ఎగురవేయడాన్ని కొనసాగిస్తే ఉత్తర కొరియా నిర్ణయాత్మక చర్య తీసుకుంటుందని కిమ్ యో జోంగ్ హెచ్చరించారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!