టెస్లా సీఈవో ఎలన్ మస్క్ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ను కొనుగోలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. అయితే ఎలన్ మస్క్ ట్విట్టర్ అకౌంట్కు సంబంధించి ఆసక్తికర అంశం వెల్లడైంది. మస్క్ ట్విటర్ ఫాలోవర్లలో సగానికి సగం మంది ఫేక్ అని వెల్లడైంది. ట్విటర్ ఆడిటింగ్ టూల్ స్పార్క్టోరో ప్రకారం రీసెర్చ్ ఆడిట్ సమయానికి మస్క్కు ఉన్న 8.79 కోట్ల ఫాలోవర్లలో 48 శాతం మంది ఫేక్ అని తేలినట్లు టైమ్ మ్యాగజైన్ పేర్కొంది. ఈ ఖాతాల్లో…
సెలబ్రిటీలంటే ఎవరికైనా క్రేజ్ ఉంటుంది. అవకాశం వస్తే ఫోటో దిగాలని ముచ్చట పడ్డం సహజం. ఇటువంటి సరదానే తీర్చుకున్నారు ఏపీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్. రాజకీయంగా తమకు ప్రత్యర్థి అయిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్తో ఓ ఫోటో దిగారు. అది ఏడేళ్ల కిందటి ముచ్చట. ప్రస్తుతం పవన్, వైసీపీ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. రాజకీయవైరం వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లింది. ఈ క్రమంలో పవన్ పై విరుచుకుపడుతున్నారు మంత్రి అమర్నాథ్. ఇటీవల కౌలురైతుల ఆత్మహత్యలపై…
మత్తెక్కించే చాట్ లు,,రెచ్చగొట్టే మగువల ఫోటోలు.. కాస్త ముగ్గులోకి దిగితే చాలు అంతే జేబుగుల్ల కావడం ఖాయం. ఇన్నాళ్ల పాటు పట్టణ ప్రాంతాలకు పరిమితం అయిన యవ్వారం ఇప్పుడు ఏకంగా ఏజెన్సీ ప్రాంతాల్లోకి పాకింది. సోషల్ మీడియా వేదికగా వలపు వలేసి…వయ్యారి భామల ఫోటోలతో పైసా వసూల్ చేస్తున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఏజెన్సీలో పెరుగుతున్న సైబర్ ఆగడాలు యువతను చిత్తుచేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా సైబర్ పంజా విసురుతున్నారు కేటుగాళ్లు. మరీ ముఖ్యంగా ఈమధ్య కాలంలో…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ ఫొటో ఇప్పుడు చర్చగా మారింది.. జనసేన అధినేత పవన్ కల్యాణ్, మంత్రి అమర్నాథ్ రెడ్డి కలిసి ఉన్న ఫొటో.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. అయితే, పవన్పై అమర్నాథ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే.. ఇది నెట్టింట్లో ప్రత్యక్షమై తెగ తిరిగేస్తోంది.. ఇక, మంత్రిపై అమర్నాథ్పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.. పవన్పై ఇంతలా విరుచుకుపడే నీవు.. ఆయనతో కలిసి ఫొటో ఎందుకు తీయించుకున్నావు అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు..…
టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సోషల్ మీడియా రంగంలోకి అడుగపెట్టారు. ఆయన తాజాగా ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్లో వాటాను కొనుగోలు చేశారు. ఈ మేరకు మార్చి 14 నాటికి 9.2 శాతం వాటాను ఎలన్ మస్క్ దక్కించుకున్నారు. ట్విట్టర్కు సంబంధించి మస్క్ 7,34,86,938 షేర్లు కొనుగోలు చేసినట్లు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ తెలిపింది. దీంతో ట్విట్టర్ షేర్ల విలువ 28 శాతం పెరిగింది. ట్విట్టర్ షేర్ల వాల్యూ ప్రస్తుతం…
ఐపీఎల్ మ్యాచ్లు నెమ్మదిగా రసపట్టును తలపిస్తున్నాయి. సీజన్ ఆరంభ మ్యాచ్ తేలిపోయినా.. సూపర్ సండేనాడు జరిగిన రెండు మ్యాచ్లు క్రికెట్ అభిమానులకు మంచి వినోదాన్ని అందించాయి. తొలుత ముంబై-ఢిల్లీ మ్యాచ్, అనంతరం బెంగళూరు-పంజాబ్ మ్యాచ్ ఉర్రూతలూగించాయి. ఈ రెండు మ్యాచ్లలో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే గెలిపించాయి. తొలి మ్యాచ్లో ఢిల్లీ ఓడిపోయేలా కనిపించగా.. లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ పోరాడి తమ జట్టును గెలిపించారు. ముఖ్యంగా లలిత్ యాదవ్ 48 పరుగులతో అజేయంగా నిలిచి ఢిల్లీ…
ఎన్నో ఆశలతో న్యూజిలాండ్ వెళ్లిన భారత మహిళా క్రికెట్ జట్టు రిక్త హస్తాలతో స్వదేశానికి వచ్చేస్తోంది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆదివారం నాడు దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలై.. తద్వారా వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో భారత మహిళా క్రికెట్ టీమ్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఓడినప్పటికీ చివరి వరకూ మన మహిళలు పోరాడిన తీరు అద్భుతమని రాహుల్ గాంధీ కొనియాడారు. ప్రపంచకప్…
సంతకం పెట్టడంలో ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. అయితే అందరూ సాధారణంగా వారి పూర్తి పేరును సంతకంగా పెట్టలేరు. అందుకే సంతకం చేసే సమయంలో తమ పేరును కుదిస్తారు. అయితే సంతకం అనేది సులువుగా ఉంటే సులువుగా కాపీ చేసే ప్రమాదం ఉంది. దీంతో సంతకం అర్థం కాకుండా పెట్టడం కూడా ఒక ఆర్ట్ అని చెప్పవచ్చు. ఈ విషయంలో కర్ణాటకలో పనిచేసే సబ్రిజిస్టర్ శాంతయ్య ప్రత్యేకంగా నిలిచారు. దీంతో ఆయన సంతకాన్ని ఏకంగా యునెస్కో అద్భుతమైన…
జనసేన అధినేత, పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆయన నటించిన భీమ్లానాయక్ సినిమాకు ఏపీలో పలు సమస్యలు ఎదురైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా టిక్కెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం, అభిమానుల మధ్య వార్ ఇంకా నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని మరోసారి ప్రస్తావిస్తూ పోస్ట్ చేశారని అభిమానులు భావిస్తున్నారు. ఒక మార్పు కోసం యుద్ధం చేయాల్సి వస్తే.. తొంభై…
జూలో ఉండాల్సిన జంతువులు రోడ్డుమీదకు వస్తే ఎలా ఉంటుంది. ఆ జంతువు ఏమీ చేయకపోయినా, దాని ఆకారం, దాని స్వభావంతో ప్రజలు భయపడి పరుగులు తీస్తారు. అమెరికా వంటి దేశాల్లో జూలో ఉండే మొసళ్లు వంటివి అప్పుడప్పుడూ రోడ్డు మీదకు వస్తుంటాయి. వాటిని చూసి ప్రజలు పెద్దగా ఆశ్చర్యపడకపోయినా వాటి నుంచి జాగ్రత్తగా తమను తాము రక్షించుకుంటూ ఉంటారు. అయితే, ఓ జూ నుంచి వ్యాన్లో మరో చోటకి మొసలిని తరలిస్తుండగా హఠాత్తుగా అ మొసలి వ్యాన్…