టీడీపీ అధికార ప్రతినిధి, సినీనటి దివ్యవాణి రాజీనామా అంశంలో పార్టీలో ఆసక్తికర పరిణామాలు జరిగాయి. ఆమె మూడు నాలుగేళ్ల క్రితమే పసుపు కండువా కప్పుకొన్నా.. దివ్యవాణికి ఉన్న సినీ గ్లామరుతో పార్టీలో.. ప్రజల్లో ఇమేజ్ సంపాదించారు. ఆమెకు టీడీపీ ప్రాధాన్యం ఇచ్చింది. ఈ క్రమంలో వైసీపీపైనా.. మంత్రులపైనా ఘాటైన విమర్శలు చేశారు దివ్యవాణి. అయితే మహానాడులో దివ్యవాణికి మాట్లాడే అవకాశం దక్కలేదు. దీంతో ఆమె అలకబూనారు. కావాలనే తనను పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారని కామెంట్స్ చేశారు.…
సోషల్ మీడియా పెరిగిన తర్వాత రోజూ పలు రకాల గాసిప్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఇక టాలీవుడ్ లో రకరకాల కాంబినేషన్స్ లో సినిమా అంటూ రూమర్స్ వింటూనే ఉన్నాం. అయితే వాటిలో కొన్ని కార్యరూపం దాల్చిన సందర్భాలు లేకపోలేదు. ఎక్కువగా ఈ రూమర్స్ చెవులను తాకి వెళ్ళిపోతుంటాయి. అలాంటి రూమర్ ఒకటి ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ రాజమౌళి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలయికలో సినిమా అన్నదే ఆ…
ఏపీలో జగనన్న అమ్మఒడి, వాహన మిత్ర పథకాలు రద్దు అయినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ రెండు పథకాలను రద్దు చేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది. దయచేసి ఇలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని ఫ్యాక్ట్చెక్ టీం విజ్ఞప్తి చేసింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల 2022 ఏడాదికి గాను ఈ రెండు పథకాలు రద్దు చేసినట్లు కొందరు ఫేక్ ప్రెస్నోట్ సృష్టించారని తెలిపింది. వాళ్లను గుర్తించామని, చట్టప్రకారం చర్యలు…
మీరు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారా..? అయితే నిహారిక ఎన్ ఎమ్(Niharika NM) గురించి తెలియకుండా ఉండదు.. ఒక్కసారైనా ఆమె వీడియోను చూడలేదు అన్నా, లేక మీ ఫ్రెండ్స్ కు పంపలేదు అన్నా మీరు ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయడం లేదనే అర్ధం.. తన కామెడీ రీల్స్ తో నిహారిక చేసే వినోదం అంతా ఇంతా కాదు. ఒకప్పుడు ఆమె యూట్యూబ్ లో చిన్న చిన్న వీడియోలు చేస్తూ ఉండేది. యాదృచ్ఛిక భారతీయ అమ్మలు, కఠినమైన భారతీయ తల్లిదండ్రులు మరియు…
రీసెంట్గా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకోవడంతో.. హాట్ బ్యూటీ రష్మిక క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం క్రేజీ ఆఫర్స్తో దూసుకుపోతున్న ఈ అమ్మడు.. మరింతగా అట్రాక్ట్ చేసేందుకు ట్రై చేస్తోంది. దాంతో కొంచెం హాట్గా కనిపించి ఔరా అనిపించింది. అయితే హాట్గా కనిపించడానికి నానా తంటాలు పడింది. దాంతో నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. మరి రష్మిక టార్గెట్ ఏంటి.. ఏ విషయంలో ఇబ్బంది పడింది..? తెలుగులో టాప్ హీరోయిన్గా రాణిస్తున్న…
ప్రస్తుతం సమంత చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అందులో కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికే అక్కడ ఒకటి, అరా సినిమాలకు, వెబ్ సిరీస్కు సైన్ చేసింది. అలానే ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా ఓకే చేసింది. అయితే ఇవన్నీ కూడా ముంబైలో ఉంటూ ఆపరేట్ చేస్తోంది సమంత. ఈ నేపథ్యంలో సామ్ ముంబైకి మకాం మార్చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ టాప్ సెలబ్రిటీ కాలనీలో సమంత ఓ ఖరీదైన ప్లాట్ తీసుకుందని వార్తలొచ్చాయి.…
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు విగ్రహా రూపాల కంటే.. వాళ్ల రూపం అచ్చం ఇలాగే ఉంటుందేమోనని అనిపించేలా.. ఇప్పటికీ, ఎప్పటికీ.. తెలుగువారికి గుర్తుకొచ్చే రూపం ఆయనదే. నటుడిగా తెలుగు ప్రేక్షకుడి గుండెల్లో.. నాయకుడిగా తెలుగు వారి హృదయాల్లో ఆయన వేసిన ముద్ర శాశ్వతం. తెలుగు ప్రజల కీర్తిని ఖండాంతరాలకు చాటి చెప్పిన శక పురుషుని శత జయంతి సంవత్సరం ఇది. సినీనేత.. జననేత.. తిరుగులేని కథానాయకుడు.. ఎదురులేని మహానాయకుడు… విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 100వ జయంతి…
చాలాకాలం క్రితమే వాట్సప్ ‘డిజప్పియరింగ్ మెసేజెస్’ (Disappearing Messages) ఫీచర్ని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే! ఈ ఫీచర్ని ఎనేబుల్ చేస్తే.. పరిమిత కాలంలో ఆటోమెటిక్గా మెసేజెస్ డిలీట్ అయిపోతాయి. 24 గంటలు, 7 రోజులు, 90 రోజులు అంటూ గడువు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ మూడింటిలో ఏదైనా ఒక సమయం సెలెక్ట్ చేస్తే.. సరిగ్గా ఆ గడువు ప్రకారం సింగిల్ చాట్స్లో గానీ, గ్రూప్స్లో గానీ మెసేజెస్ డిలీట్ అవుతాయి. కాకపోతే.. దీని వల్ల ఒక…
ఆన్లైన్ షాపింగ్ అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరూ ఏ చిన్న వస్తువు అయినా ఆన్లైన్లోనే కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్, అమెజాన్, పేటీఎం వంటి ఈ కామర్స్ సంస్థలు ఆన్లైన్ షాపింగ్ విషయంలో రాజ్యమేలుతున్నాయి. అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్లో ఓ నీటి బక్కెట్ ధర చూసి వినియోగదారులు షాక్కు గురవుతున్నారు. దీంతో సదరు బక్కెట్ ధర గురించి అమెజాన్ను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. బాత్రూమ్లో వాడుకునే సాధారణ నీటి బకెట్…
ఏపీలో వైసీపీ పాలనపై వ్యతిరేకత పెరుగుతోందని ఒకవైపు విపక్ష టీడీపీ విమర్శలు చేస్తోంది. మరోవైపు వైసీపీ పాలన బాగాలేదని ఎవరైనా సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తే ఆ పార్టీనేతలు దాడులు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా వెంకాయమ్మ ఘటన ఏపీలో సంచలనం కలిగిస్తోంది. ప్రభుత్వ పనితీరు బాగోలేదని చెప్పినందుకు తన ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేశారంటూ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు వచ్చింది ఎస్సీ మహిళ వెంకాయమ్మ. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన…