తూర్పుగోదావరి జిల్లాలో శ్రీగంధం చెట్లను అక్రమంగా కొట్టుకుపోయి విక్రయిస్తున్న ముఠాను తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మధ్యప్రదేశ్ కి చెందిన ముగ్గురు సంచార జీవనం గడిపే యువకులు ఈ అక్రమ రవాణా సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారు ముగ్గురినీ అరెస్టు చేశారు. రాజానగరం, కోరుకొండ మండలాల్లో మూడు చోట్ల శ్రీగంధం చెట్లను నరికి తరలిస్తుండగా.. పోలీసులకు అందిన సమాచారంతో రంగంలోకి దిగినట్లు రాజానగరం సీఐ ఎస్ ప్రసన్న వీరయ్య గౌడ్ తెలిపారు. ఎస్సై ప్రేమ్…
ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న స్మగ్లర్లు.. కొత్త వ్యాపారం మొదలు పెట్టారు. వన్యప్రాణుల చర్మం, దంతాలతో వ్యాపారం షురూ చేశారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉండడంతో వాటి స్మగ్లింగ్కు తెరతీశారు. తాజాగా ఏనుగు దంతాలతో వ్యాపారం చేస్తున్న వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్నాళ్లూ అడవిలోని ఎర్రచందనం చెట్ల వెంట పడ్డ స్మగ్లర్లు.. ఇప్పుడు అడవిలోని వన్యప్రాణులను కూడా వదిలి పెట్టడం లేదు. వాటిని వెంటాడి.. వేటాడి వాటి చర్మం, దంతాలతో స్మగ్లింగ్ వ్యాపారం…
ఏనుగు దంతాల రవాణాకు పాల్పడుతున్న ముఠాలను రాచకొండ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. మూడు కోట్ల రూపాయల విలువైన రెండు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు. ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. నిందితుడు ఏపీకి చెందిన రేకులకుంట ప్రసాద్ ని అరెస్ట్ చేశారు. ప్రసాద్ వద్ద నుంచి రెండు ఏనుగు దంతాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో రెండు ఏనుగు దంతాల విలువ రూ. 3 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.…
అల్లూరి సీతారామరాజు జిల్లా అటవీప్రాంతం సీలేరు నుండి గోకవరం వెళ్లే ఆర్టీసీ బస్సులో రోజ్ వుడ్ కలప మంచాలను పుష్ప సినిమా తరహాలో తరలిస్తున్నారు. పుష్ప సినిమా తరహాలో విలువైన కలపను తరలించారు స్మగ్లర్లు..
పుష్ప సినిమా టాలీవుడ్నే కాదు.. పాన్ ఇండియా లేవల్లో ఓ ఊపు ఊపింది.. అయితే, ఈ సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్కు దర్శకుడు ఉపయోగించిన ట్రిక్కులను.. చాలా సందర్భాల్లో దొంగలు ఉపయోగించిన ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. తాజాగా, కాకినాడ జిల్లా జగ్గంపేటలో పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను జగ్గంపేట, కిర్లంపూడి పోలీసులు టోల్గేట్ వద్ద అదుపులోనికి తీసుకున్నారు.
Vehicles Smuggling: వికారాబాద్ జిల్లా పరిగి నేషనల్ హైవే 163పై వాహనాల అక్రమ రవాణా చేస్తూ.. పక్క దేశాలకు ఎగుమతి చేయడం మనం చూడవచ్చు. వారం క్రితం ఓ బోర్ వెల్ వాహనాన్ని పట్టుకున్న పరిగి పోలీసులు.. వారం గడవకముందే మరో బోర్ వెల్ వాహనాన్ని పట్టుకున్నారు. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందని., ఆర్టిఏ రోడ్ ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టి అర్ధరాత్రి పూట రవాణా చేస్తున్నారని అధికారులు తెలిపారు. ఇక తాజాగా…
వికారాబాద్ జిల్లా పరిగి నేషనల్ హైవే 163పై అక్రమ రవాణా చాలా కాలంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బోర్ డ్రిల్లింగ్ లారీల అక్రమ రవాణా, పక్క దేశాలకు జరిగే ఎగుమతులు రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని కోల్పోవడానికి దారితీస్తున్నాయి. ఈ అక్రమ దందా యధేచ్ఛగా కొనసాగుతుండటం ప్రజల మనస్సులో ఆందోళన కలిగిస్తోంది. పరిగి ప్రాంతంలో బోర్ డ్రిల్లింగ్ లారీల అక్రమ రవాణా జరగడం అధికారికంగా నిర్ధారితమైంది. ఇటీవల, పోలీసులు వాహనాల తనిఖీల్లో అవాంఛనీయంగా పట్టుబడిన బోర్ బండి…
భార్య భర్తలుగా నటిస్తూ కారులో ప్రత్యేకంగా నిర్మించిన అరలలో గంజాయిని తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో దుండిగల్ పోలీసులు రాజేంద్రనగర్ sot పోలీసులు సంయుక్తంగా వల పన్ని ముఠా ను అరెస్టు చేసారు.. ఔటర్ రింగ్ రోడ్ మీదుగా గంజాయి తరలిస్తున్న ఈ ముఠా సభ్యులు 5 గురు సభ్యుల ముఠా ఒరిస్సా నుండి హైదారాబాద్ మీదుగా డిల్లీకి హోండా సిటీ కార్ లో తరలిస్తున్నట్లు గా గుర్తించారు.. పోలీసులు ఇద్దరిని అదుపు లో తీసుకొని వారి దగ్గర…
మాదాపూర్లో డ్రగ్స్ అమ్ముతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. బెంగళూరు నుంచి తీసుకువచ్చిన ఎండిఎంఏ డ్రగ్స్ ను స్వాధీన పరుచుకున్నారు అధికారులు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నప్పటికీ లాభాలు లేకపోవడంతో డ్రగ్స్ అమ్మకాలు మొదలుపెట్టినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. పెద్ద మొత్తంలో లాభాలు గడించాలని డ్రగ్స్ అమ్మకాలకు తెరలేపారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ఈ నేపథ్యంలోనే.. నిందితులు దత్తి లితిన్, పడాల అభిరామ్ నాయుడు, కొడాలి…