Rachakonda CP: ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తి అరెస్ట్.. రూ. 3 కోట్ల విలువ గల ఏనుగు దంతాలు సీజ్
- ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తి అరెస్ట్
- రూ. 3 కోట్ల విలువ గల ఏనుగు దంతాలు సీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏనుగు దంతాల రవాణాకు పాల్పడుతున్న ముఠాలను రాచకొండ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. మూడు కోట్ల రూపాయల విలువైన రెండు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు. ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. నిందితుడు ఏపీకి చెందిన రేకులకుంట ప్రసాద్ ని అరెస్ట్ చేశారు. ప్రసాద్ వద్ద నుంచి రెండు ఏనుగు దంతాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో రెండు ఏనుగు దంతాల విలువ రూ. 3 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. రాచకొండ ఎస్ఓటి పోలీసులతో పాటు ఫారెస్ట్ అధికారులు జాయింట్ ఆపరేషన్ తో ముఠాను పట్టుకున్నారు. ప్రసాద్ తిరుపతి జిల్లాలోని శేషాచలం ఫారెస్ట్ నుంచి ఏనుగు దంతాలు తీసుకువచ్చాడని తెలిపారు.
Also Read
రాచకొండ సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ.. “ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్నాము.. రెండు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నాము.. ఇవి ఒరిజినల్ హా, కాదా అని ఫారెస్ట్ వాళ్ళతో చెక్ చేయించాము.. నిజమైనవి అని తేలిందని తెలిపారు.. వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972ప్రకారం ఇది చట్టరీత్య నేరము.. ఏనుగు నుంచి ఇవి కట్ చేసి సేకరించారు.. ఈ కేసులోని ప్రకాష్ , లోకేశ్వర్ రెడ్డి ఈ దందా కొనసాగిస్తున్నారు.. శేషాచలం అడవులలోని ఏనుగుల నుంచి ఇవి సేకరించారు.. రాచకొండ పోలీసులు ఇల్లీగల్ యాక్టివిటిపై దృష్టి సారించారని తెలిపారు.. బస్సుల్లో తీసుకొచ్చి అమ్మకాలు సాగిస్తున్నారు.. బస్సులో ఒక పెట్టలో పెట్టి తీసుకొచ్చారు..
Also Read:Mahavaatar: ఏకంగా 7 సినిమాలతో సినిమాటిక్ యూనివర్స్ అనౌన్స్ చేసిన హోంబాలే
అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నాం.. ఏనుగు దంతాల స్మగ్లింగ్ కేసులో దర్యాప్తు చేస్తున్నాం.. పట్టుబడ్డ ఏనుగు దంతాలు 5.62కేజీలు ఉంటుంది.. నిందితులు ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్నారు.. రూ. 3కోట్లు విలువ గల ఏనుగు దంతలు సీజ్ చేసాం.. కేజీ ఏనుగు దంతాలు 50 నుంచి 60 లక్షల వరకు మార్కెట్లో అమ్మకాలు సాగిస్తున్నారు.. నిందితుడు ప్రసాద్ మాత్రమే పట్టుబడ్డాడు.. లోకేశ్వర్ రెడ్డి పరారీలో ఉన్నాడు.. ప్రసాద్, లోకేశ్వర్ ఇద్దరు గతంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో పట్టుబడి జైల్లో ఉన్నారు.. ఇద్దరికి జైళ్ళో పరిచయం ఉంది.. ఇప్పుడు ఏనుగు దంతాల స్మగ్లింగ్ కి పాల్పడ్డారని” తెలిపారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!