World Cup Team of the Tournament: భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ విజయం తర్వాత ఐసీసీ (ICC) ప్రకటించిన మహిళల క్రికెట్ ప్రపంచకప్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్లో భారత క్రీడాకారిణులు ఆధిపత్యం చెలాయించారు. టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్లో భారత త్రయం స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మలు స్థానం సంపాదించారు. ఈ ముగ్గురూ జట్టు తొలి ప్రపంచకప్ విజయంలో అద్భుతమైన పాత్ర పోషించారు. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో భారత్…
Richest Female Cricketers: నవీ ముంబై వేదికగా నవంబర్ 2న జరిగిన ప్రపంచకప్ విజయం ఒక చారిత్రక ఘట్టంగా నిలిచింది. దక్షిణాఫ్రికా మహిళల జట్టుపై హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు సాధించిన ఈ విజయం కేవలం భారత మహిళల క్రికెట్ చరిత్రలో ఒక క్రీడా మైలురాయిగా మాత్రమే కాకుండా.. అనేక సంవత్సరాల కఠోర శ్రమ, క్రమశిక్షణ, ఆశల మిళితంగా నిలిచింది. భారత్ ఈ ట్రోఫీని ఎత్తగానే దేశవ్యాప్తంగా కోట్లాది అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ విజయంతో…
Sportsmanship: క్రీడల్లో విజయంలో వినయం, ఓటమిలో సౌమ్యత ఉండాలనే నినాదాన్ని భారత మహిళల జట్టు ఆదివారం దక్షిణాఫ్రికాపై ప్రపంచకప్ ఫైనల్ గెలిచిన తర్వాత అద్భుతంగా ప్రదర్శించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలో తమ జట్టు తొలి ప్రపంచకప్ టైటిల్ను గెలిచిన ఆనందంలో భారత క్రీడాకారులు మునిగితేలుతుండగా.. ఓటమి బాధతో కన్నీరు పెట్టుకుంటున్న దక్షిణాఫ్రికా క్రీడాకారులను చూసి భారత ప్లేయర్లు మానవత్వాన్ని చాటుకున్నారు. విజయోత్సవ సంబరాలను పక్కన పెట్టి భారత క్రీడాకారిణులు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ సహా…
భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మహిళల వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్గా రికార్డుల్లో నిలిచింది. ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025లో భాగంగా గురువారం నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో నాలుగు సిక్స్లు బాదడంతో ప్రపంచ రికార్డు ఆమె ఖాతాలో చేరింది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా బ్యాటర్ లిజెల్లే లీ రికార్డును అధిగమించింది. అత్యధిక సిక్సర్ల రికార్డు: మహిళల వన్డేల్లో ఒక…
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీక రావల్ అదరగొట్టారు. స్మృతి మంధాన (109; 95 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీ చేసి పెవిలియన్ చేరింది. స్మృతి 88 బంతుల్లో సెంచరీ చేసింది. మరో ఓపెనర్ ప్రతీక 122 బంతుల్లో శతకం చేసి భారత జట్టుకు మంచి స్కోర్ అందిస్తోంది. స్మృతి, ప్రతీక కలిసి 212 పరుగుల…
Smriti Mandhana: మహిళల ప్రపంచ కప్ 2025లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా నాలుగు పరుగుల తేడాతో ఒదిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమికి బాధ్యత నాదే అంటూ టీమిండియా మహిళల వైస్ కెప్టెన్ స్మృతి మంధాన వహించింది. తన వికెట్ కోల్పోవడంతోనే బ్యాటింగ్ పతనం మొదలైందని, షాట్ ఎంపిక ఇంకా మెరుగ్గా ఉండాల్సిందని ఆమె అంగీకరించింది. 289 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్ స్మృతి మంధాన (88) అద్భుతంగా ఆడింది. కెప్టెన్ హర్మన్ప్రీత్…
టీమిండియా స్టార్ మహిళా ప్లేయర్ స్మృతి మంధాన గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మైదానంలోకి దిగిందంటే పరుగుల వరద పారిస్తుంటుంది. అలవోకగా మ్యాచ్ గమనాన్నే మార్చేస్తుంది. బ్యాటింగ్ నైపుణ్యం, అందంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. స్మృతి అందం, ఆటతీరు.. రెండింటికీ చాలా మంది అభిమానులు ఉన్నారు. అందుకే ఆమెను హీరోయిన్గా కూడా నటించమని ఫాన్స్ కామెంట్స్ చేస్తుంటారు. ప్రస్తుతం మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ఆడుతున్న స్మృతి గురించి.. సోషల్ మీడియాలో ఓ…
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన అరుదైన మైలురాయిని అందుకుంది. ఈ ఏడాది వన్డేల్లో వెయ్యి పరుగులను పూర్తి చేసింది. దాంతో మహిళల వన్డేల్లో ఒక క్యాలెండర్ ఏడాదిలో వెయ్యి పరుగులు చేసిన తొలి బ్యాటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా ఆదివారం విశాఖపట్నంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో స్మృతి ఈ రికార్డు నెలకొల్పింది. ఇంతకు ముందు మరే ఇతర మహిళా క్రీడాకారిణి ఈ ఘనత సాధించలేదు. గతంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్…
Ind vs Aus : విశాఖ వేదికగా జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ 2025 మ్యాచ్లో టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఆసీస్ మహిళల జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 331 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 49 ఓవర్లలోనే ఛేదించి విజయాన్ని అందుకుంది. ముందుగా టాస్ ఓడిన భారత్ బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లు స్మృతి మంధన (Smriti Mandhana), ప్రతిక…
Womens World Cup 2025 : భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తన కెరీర్లో మరో గొప్ప మైలురాయిని అందుకుంది. ఉమెన్ వరల్డ్కప్లో ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్లో మంధాన 5 వేల పరుగుల మైలురాయిని దాటింది. దీంతో భారత మహిళా క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను సాధించింది. ఇప్పటి వరకు ఈ రికార్డును సాధించిన భారత మహిళా ఆటగాళ్లలో మిథాలి రాజ్ మాత్రమే ఉండగా, ఇప్పుడు మంధాన ఆ జాబితాలో రెండో…