World Cup: వరల్డ్ కప్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన మహిళా క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ..
- వరల్డ్ కప్ విజయం ఎఫెక్ట్..
- భారీగా పెరిగిన మహిళా క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ..
- స్మృతి మంధాన, జెమియా, హర్మన్ ప్రీత్ లకు క్రేజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Cup: భారత మహిళ క్రికెట్ జట్టు తొలిసారిగా వన్డే వరల్డ్ కప్ను సాధించింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి ఓడించింది. అయితే, ఈ విజయం ఎఫెక్ట్లో మహిళా క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం వస్తున్న రిపోర్టుల ప్రకారం, బ్రాండ్ ఎండార్స్మెంట్ ఫీజులు ఏకంగా 25 శాతం నుంచి 100 శాతానికి పెరిగినట్లు తెలుస్తోంది.
Read Also: Daggupati Prasad: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సవాల్.. ఒక్క సెంట్ భూమి అయినా చూపించండి..!
Also Read
- Axar Patel: టీ20ల్లో జీరో.. వన్డేల్లో హీరో.. మార్పుకు కారణం ఏంటో చెప్పిన అక్షర్ పటేల్..
- Shubman Gill: కోహ్లీ, రోహిత్ శర్మను వెనక్కి నెట్టేసిన శుభ్మన్ గిల్.. ఒక్క విజయంతో మరింత ముందుకు..
- Axar Patel Record: అక్షర్ పటేల్ అరుదైన ఘనత.. సచిన్, గంగూలీ సరసన చోటు!
- Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
జెమిమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన, హర్మన్ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, షఫాలి వర్మలతో పాటు మిగతా క్రికెటర్ల సోషల్ మీడియా అకౌంట్లలో ఫాలోవర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. వరల్డ్ కప్ విజయం తర్వాత కొంత మందికి ఫాలోవర్ల సంఖ్య డబుల్, త్రిపుల్ అయింది. దీంతో పాటే వారి ఫీజులు కూడా రెట్టింపు అయ్యాయి. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాపై 127 పరుగులు చేసి నాటౌట్గా నిలిచిన జెమిమా రోడ్రిగ్స్ ప్రస్తుతం బ్రాండ్ హాట్ ఫెవరెట్గా మారింది. జెమియా బ్రాండ్ను నిర్వహించే JSW స్పోర్ట్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ కరణ్ యాదవ్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా మ్యాచ్ ముగిసిన తర్వాత తమకు పెద్ద ఎత్తున రిక్వెస్ట్లు వచ్చాయని, మేము 10-12 విభాగాలలోని బ్రాండ్లతో సంభాషణ జరుపుతున్నట్లు చెప్పారు. నివేదికల ప్రకారం, జెమియా ఇప్పుడు బ్రాండ్ల లాంగివిటీ, డెలివరీలను బట్టి రూ. 75 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల వరకు ఫీజులు వసూలు చేస్తుంది.
దేశంలోనే అత్యధిక పారితోషికం పొందుతున్న మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, రెక్సోనా డియోడరెంట్, నైక్, హ్యుందాయ్, హెర్బాలైఫ్, ఎస్బీఐ, గల్ఫ్ ఆయిల్, పీఎన్బీ మెట్ లైఫ్ ఇన్సూరెన్స్ తో సహా 16 బ్రాండ్లకు ఎండార్స్మెంట్ చేస్తోంది. వీటి ద్వారా ఆమె రూ. 1.5 కోట్ల-2 కోట్లు సంపాదిస్తున్నట్లు సమచారం. హర్మన్ ప్రీత్ కైర్, దీప్తి శర్మ, రిచా ఘోష్ లను బ్రాండ్ వాల్యూ కూడా అమాంతం పెరిగింది.
తాజావార్తలు
-
Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
-
Income Tax Notice: ఇదెక్కడి పాపం.. రోజుకు రూ.400 సంపాదించే కూలీకి ఐటీ శాఖ షాక్! అసలు ట్విస్ట్ ఇదే
-
SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
-
IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇక వేగంగా తత్కాల్!
-
Mudragada Padmanabham: ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!