సింగరేణి ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ఆ సంస్థ. సింగరేణిలో పెండింగ్లో ఉన్న వారసులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సింగరేణి సంస్థ. 2014 సంవత్సరం జూన్ మాసం ఒకటో తేదీ నుంచి.. 2022 నెల 19వ తేదీ వరకు పెండింగ్లో ఉన్న వారికి ఉద్యోగాలు ఇస్తామని అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది సింగరేణి సంస్థ. ఇటీవల ఆర్ ఎల్ సి సమక్షంలో జరిగిన చర్చల్లో సింగరేణి సంస్థ వన్టైమ్ సెటిల్మెంట్ కింద వారసులకు ఉద్యోగాలు ఇస్తామని…
కాలుష్యం పెరిగి కొద్దీ అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం కాలుష్య సుడిగుండంలా మారుతోంది. పారిశ్రామిక అభివృద్ధి ఈ ప్రాంతానికి శాపంలా మారింది. రామగుండంలో భూగర్భం ఉపరితలం అంతా విషతుల్యంగా తయారైంది. ఏ విష వాయువు ఎప్పుడు వ్యాపిస్తుందో తెలియక తాగే నీరు కలుషితంతో అనారోగ్యాల బారిన పడుతూ జనం ఆందోళన చెందుతున్నారు. రామగుండం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. నియోజకవర్గ వ్యాప్తంగా జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఆర్ ఎఫ్ సి ఎల్, జెన్…
Telangana BJP Chief Bandi Sanjay Clarify About Singareni Privatization. సింగరేణిని ప్రైవేటీకరిస్తున్నట్లు టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యాలపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరించడం లేదని, అది రాష్ట్ర ప్రభుత్వం చేతులో ఉందని బండి సంజయ్ ఉద్ఘాటించారు. అంతేకాకుండా సింగరేణి ఎన్నికలు వస్తుండటంతో కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు ఆడే అబద్దాలకు అంతూపొంతు లేకుండా పోయిందని ఆయన మండిపడ్డారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు…అన్నట్లుగా సిగ్గులేకుండా పచ్చి అబద్దాలు…
సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సింగరేణి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు ఈనెల 28,29 తేదీల్లో సార్వత్రిక సమ్మె చేపట్టనున్నారు. దీనికి సంబంధించి కార్మిక సంఘాలు సోమవారం ఉదయం సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందించారు. ఈ మేరకు ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్,ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్ కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు సమర్పించాయి. సింగరేణిలో నాలుగు బ్లాకులు కళ్యాణిఖని బ్లాక్ 6, కొయ్యగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణి పల్లి…
దేశానికి వెలుగును అందిస్తున్న రామగుండం పారిశ్రామిక ప్రాంతం నిరాదరణకు లోనవుతోందని మండిపడ్డారు రామగుండం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఇతర ప్రాంతాల్లో విద్యుత్ పరిశ్రమలు నెలకొల్పేందుకు రామగుండం సింగరేణి దోహదపడింది. ఎన్ని ప్రభుత్వాలు మారిన రామగుండం లో బిపిఎల్ రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రామగుండం ను చీకటి మాయం చేయాలని చూస్తున్నారు.రామగుండం ప్రాంతంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం వహిస్తున్నారు. రామగుండం లో జరుగుతున్న బుడిద మాఫియా పై విజిలెన్ విచారణ…
పెద్దపల్లి జిల్లా రామగుండం డివిజన్లోని సింగరేణి అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో బొగ్గు గని పైకప్పు కూలిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు. బొగ్గు గని శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురి మృతదేహాలను రెస్క్యూ టీం ఈరోజు వెలికితీసింది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో డిప్యూటీ మేనేజర్ తేజావత్ చైతన్య మృతదేహాన్ని సహాయక సిబ్బంది బయటకు రాగా… బుధవారం ఉదయం ఏరియా సేఫ్టీ ఆఫీసర్ ఎస్ జయరాజు, కాంట్రాక్ట్ కార్మికుడు తోట శ్రీకాంత్ మృతదేహాలను వెలికితీశారు. వారి మృతదేహాలను…
సింగరేణిలో ప్రయోగాత్మకంగా చేపట్టిన బొగ్గు వెలికితీతలో ప్రమాదం జరిగిందని కాంగ్రెస ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. నలుగురు కార్మికులు గల్లంతు కావడం బాధాకరమని, 20రోజుల క్రితమే గని పైకప్పు లీకేజ్ అయ్యిందని ఆయన వెల్లడించారు. నీటి గుంత తీయడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అర్ధమవుతుందని, యాజమాన్యం నిర్లక్ష్యం అని తెలుస్తుందని ఆయన ఆరోపించారు. పై కప్పు డామేజ్ ఐనా.. కార్మికులను పంపి బొగ్గు తీయడం దారుణమని, రీసెంట్ గా.. శ్రీరామ్ పూర్ మైన్ లో నలుగురు,…
దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది సింగరేణి కాలరీస్ సంస్థ. ఏటా ఉద్యోగుల విషయంలో తీసుకునే శ్రద్ధతో పాటు సామాజిక బాధ్యతలోనూ సింగరేణి ముందుంది. తాజాగా సింగరేణి సిగలో మరో పురస్కారం వచ్చి చేరింది. సింగరేణి సంస్థను మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. అంతర్జాతీయ సంస్థ.. ఎనర్జీ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్ ద్వారా ప్లాటినం కేటగిరిలో అత్యుత్తమ సీఎస్ఆర్ సేవలందిస్తున్నందుకు గుర్తింపుగా గ్లోబల్ సీఎస్ఆర్ అవార్డు లభించింది. పర్యావరణ పరిరక్షణకు సింగరేణి సంస్థ అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోంది. అందులో భాగంగా సోలార్…
బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఉద్యమిస్తున్నారు. రీజినల్ లేబర్ కమిషనర్ తో ముగిసిన సింగరేణి కార్మిక సంఘాల చర్చలు జరిగాయి. అయితే, సింగరేణి కార్మిక సంఘాల చర్చలు కొలిక్కిరాలేదని తెలుస్తోంది. ఈనెల 21న మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంబంధించి 4 బ్లాకు లు ప్రైవేటుకు అమ్ముతాం అని చెప్పడం తో నవంబర్ లో సమ్మె నోటీస్ ఇచ్చామన్నాయి కార్మిక సంఘాలు. అప్పుడు మూడు రోజులు సమ్మె చేశామని ఆసమ్మె ఫలప్రదం…
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ లాగే.. సింగరేణిపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్ర చేస్తోందని మండిపడ్డారు తెలంగాణ ప్రభుత్వ విప్ బాల్క సుమన్… సింగరేణి కార్మికులు సమ్మె చేసినా ప్రైవేట్ పరం చేసే కుట్ర మోడీ చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. ఈ పరిణామాలన్నీ తెలంగాణపై బీజేపీ కక్ష కట్టడమే తప్పితే ఇంకోటి కాదన్నారు.. విశాఖ ఉక్కుకి గనులు కేటాయించాలని రిక్వెస్ట్ ఉన్నా… నష్టాలు వచ్చేలా చేసి అమ్మే కుట్ర చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. విశాఖ ఉక్కు…