Ladnapur Village: సింగరేణి నిర్వాసిత గ్రామం లద్నాపూర్ వాసుల నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లోని సింగరేణి నిర్వాశిత గ్రామం లద్నాపూర్ గ్రామస్తులు నెల రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు..గ్రామంలో ఉన్న 283 మంది భూ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంతో నిర్వాసితులు నిరసన బాట పట్టారు. ఓసీపీ 2 విస్తరణలో భాగంగా గ్రామాన్ని బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తే ఉరుకోబోమని హెచ్చరిస్తున్నారు..
సింగరేణి భూనిర్వాసిత గ్రామం లద్నపూర్ లో నిర్వాసితులకు సింగరేణి అధికారులకు మధ్య గొడవ కంటిన్యూ అవుతుంది..సింగరేణి అధికారులు పోలీసుల సహాయంతో గ్రామంలోని ఇళ్లను కూల్చివేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం లద్నపూర్ గ్రామాన్ని ocp 2 విస్తరణలో భాగంగా సింగరేణి అధికారులు బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..దీంతో పెద్ద ఎత్తున గ్రామస్థులు ఓసీపీ2 గేట్ ముందు ధర్నా చేపట్టారు.
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
సింగరేణి ఉద్యోగులు మైన్ లోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు నిర్వాసితులు. గత రవారం రోజుల క్రితం భూనిర్వసితులు ఓసీపీ 2 క్వారీలోకి పరుగులు తీశారు. వీరిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులను తోచుకుంటూ వెళ్ళారు. ఈ క్రమంలో భూనిర్వాసితులకు, పోలీసులకు మధ్య తోపులాటలు జరిగి ఘర్షణ కూడా చోటుచేసుకుంది.
లద్నాపూర్ గ్రామానికి చెందిన 283 భూనిర్వాసిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి ప్యాకేజీ చెల్లించలేదని అవేమీ చేయకుండా గ్రామంలో పనులు మొదలుపెట్టడంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిర్వాశిత కుటుంబాలలో 18 సంవత్సరాల వయస్సు ఉన్న ప్రతీ ఒక్కరికి ప్యాకేజీ, ఇండ్ల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు నిర్వాసితులు. పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించే వరకు ఆందోళన చేస్తామని, ధర్నా విరమించేదే ప్రసక్తే లేదని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు సింగరేణి నిర్వాసితులకు అండగా పలువురు రాజకీయ నిలబడ్డాడు. గ్రామస్తులకు ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వకుండా ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఓసిపి 2 లో భూములు ఇళ్ళు కోల్పోయిన వారు అందరికీ పరిహారం అందించామని సింగరేణి అధికారులు చెబుతున్నారు..గత కొంతకాలంగా సింగరేణి అధికారులకు భూ నిర్వాసితులకు మధ్య చర్చలు జరుగుతున్నాయి.
Manda Krishna Madiga: జూలై 2,3 సడక్ బంద్.. బీజేపీ కి డెడ్ లైన్ ..
తాజావార్తలు
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
Sonam Wangchuk: దీక్ష భగ్నం.. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలింపు..
-
Andy Flower: ఇంగ్లండ్ కోచ్ పదవి వద్దు.. ఆర్సీబీనే ముద్దు!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
Bhagyashri Borse: వరుస ఫ్లాప్లు ఆపలేకపోయాయి.. ‘లెనిన్’ హిట్తో భాగ్యశ్రీ బోర్సే భారీ రెమ్యునరేషన్ డిమాండ్
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?