Ramagundam Pollution:కాలుష్య సుడిగుండం.. ప్రజలకు శాపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాలుష్యం పెరిగి కొద్దీ అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం కాలుష్య సుడిగుండంలా మారుతోంది. పారిశ్రామిక అభివృద్ధి ఈ ప్రాంతానికి శాపంలా మారింది. రామగుండంలో భూగర్భం ఉపరితలం అంతా విషతుల్యంగా తయారైంది. ఏ విష వాయువు ఎప్పుడు వ్యాపిస్తుందో తెలియక తాగే నీరు కలుషితంతో అనారోగ్యాల బారిన పడుతూ జనం ఆందోళన చెందుతున్నారు. రామగుండం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. నియోజకవర్గ వ్యాప్తంగా జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఆర్ ఎఫ్ సి ఎల్, జెన్ కో సింగరేణిల కాలుష్యం బూడిద చెరువుల గుట్టలతో నింగి నేల నీరు జనాలను దెబ్బతిస్తున్నాయి.
ఆర్ ఎఫ్ సి ఎల్ నుండి ఆమోనియా వ్యర్ధాలు ఎలాంటి ట్రీట్ మెంట్ లేకుండా గోదావరిని కాలుష్య గరళంగా మారుస్తున్నాయి. మరోవైవు ఫ్యాక్టరీ నుండి వెలువడే ఆమోనియా విష వాయువు రామగుండం వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మరోవైపు ఎన్టీపీసీ లో బొగ్గు కాల్చగా వెలువడే యాష్ కందనపల్లి గ్రామంలోని యాష్ చెరువుకు తరలిస్తారు అక్కడ నుండి వందల లారీల్లో రవాణా నేపథ్యంలో అనేక గ్రామాలు బూడిద మయంగా మారుతున్నాయి. ఇటు సింగరేణి కాలనీల నుండి వెలువడే వ్యర్థ జలాలు జనగామ చెరువు వద్ద గోదావరిలో కలుస్తాయి. అదే గోదావరి నుండి సింగరేణి కాలనీ లకు,పట్టణానికి త్రాగు నీరుగా అందిస్తున్నారు. కోల్డ్ బెల్ట్ ఏరియాలో ఓపెన్ కాస్టుల్లో బాంబుల మోత దుమ్ము ధూళి అంతా కలిసి రామగుండం ఏరియా కాలుష్య కోరల్లో చిక్కుకుంది.
Also Read
- Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
- Harish Rao: జూన్ 30, 2025... తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
ఇంకోవైపు ఈ ప్రాంతాలలో నివసించే మనుషులు జీవిత కాలం కనీసం పదేళ్లు తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. శ్వాసకోశ వ్యాధులు, చర్మ ఎముకల జబ్బులు, గుండె సంబంధిత రోగాలు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు సూచిస్తున్నారు. ప్రభుత్వాలు, పరిశ్రమలు కాలుష్య నియంత్రణ మండలి పట్టించుకోకుండా ఉండటం వల్లనే జల వాయు శబ్ద కాలుష్య నియంత్రణ చేయలేని స్థితికి రామగుండం చేరిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. రామగుండం ప్రాంతంలో మానవ మునుగడప్రశ్నర్థకంగా మారిందని అంటున్నారు. రామగుండంలో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
తాజావార్తలు
-
Preity Mukhundhan: ఫైట్స్తో పవన్ ఫ్యాన్స్ను ఆకట్టుకున్న హీరోయిన్
-
Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
-
Andhra Pradesh Ranks No.1: మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే అగ్రస్థానం
-
Ginger Benefits: నెలరోజులు రోజూ అల్లం తింటే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!
-
Vaibhav Sooryavanshi: ఇంగ్లండ్ బౌలర్లకు ఏమీ తెలియదు.. తొలి టీ20లోనే వైభవ్ను ఆడించాలి!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!