Ramagundam Pollution:కాలుష్య సుడిగుండం.. ప్రజలకు శాపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాలుష్యం పెరిగి కొద్దీ అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం కాలుష్య సుడిగుండంలా మారుతోంది. పారిశ్రామిక అభివృద్ధి ఈ ప్రాంతానికి శాపంలా మారింది. రామగుండంలో భూగర్భం ఉపరితలం అంతా విషతుల్యంగా తయారైంది. ఏ విష వాయువు ఎప్పుడు వ్యాపిస్తుందో తెలియక తాగే నీరు కలుషితంతో అనారోగ్యాల బారిన పడుతూ జనం ఆందోళన చెందుతున్నారు. రామగుండం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. నియోజకవర్గ వ్యాప్తంగా జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఆర్ ఎఫ్ సి ఎల్, జెన్ కో సింగరేణిల కాలుష్యం బూడిద చెరువుల గుట్టలతో నింగి నేల నీరు జనాలను దెబ్బతిస్తున్నాయి.
ఆర్ ఎఫ్ సి ఎల్ నుండి ఆమోనియా వ్యర్ధాలు ఎలాంటి ట్రీట్ మెంట్ లేకుండా గోదావరిని కాలుష్య గరళంగా మారుస్తున్నాయి. మరోవైవు ఫ్యాక్టరీ నుండి వెలువడే ఆమోనియా విష వాయువు రామగుండం వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మరోవైపు ఎన్టీపీసీ లో బొగ్గు కాల్చగా వెలువడే యాష్ కందనపల్లి గ్రామంలోని యాష్ చెరువుకు తరలిస్తారు అక్కడ నుండి వందల లారీల్లో రవాణా నేపథ్యంలో అనేక గ్రామాలు బూడిద మయంగా మారుతున్నాయి. ఇటు సింగరేణి కాలనీల నుండి వెలువడే వ్యర్థ జలాలు జనగామ చెరువు వద్ద గోదావరిలో కలుస్తాయి. అదే గోదావరి నుండి సింగరేణి కాలనీ లకు,పట్టణానికి త్రాగు నీరుగా అందిస్తున్నారు. కోల్డ్ బెల్ట్ ఏరియాలో ఓపెన్ కాస్టుల్లో బాంబుల మోత దుమ్ము ధూళి అంతా కలిసి రామగుండం ఏరియా కాలుష్య కోరల్లో చిక్కుకుంది.
Also Read
- Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
ఇంకోవైపు ఈ ప్రాంతాలలో నివసించే మనుషులు జీవిత కాలం కనీసం పదేళ్లు తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. శ్వాసకోశ వ్యాధులు, చర్మ ఎముకల జబ్బులు, గుండె సంబంధిత రోగాలు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు సూచిస్తున్నారు. ప్రభుత్వాలు, పరిశ్రమలు కాలుష్య నియంత్రణ మండలి పట్టించుకోకుండా ఉండటం వల్లనే జల వాయు శబ్ద కాలుష్య నియంత్రణ చేయలేని స్థితికి రామగుండం చేరిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. రామగుండం ప్రాంతంలో మానవ మునుగడప్రశ్నర్థకంగా మారిందని అంటున్నారు. రామగుండంలో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
తాజావార్తలు
-
LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?
-
Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!