క్షణికావేశం, అర్థం పర్థం లేని వ్యవహారాలతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతోంది. సికింద్రాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ వివాహిత తనతో మాట్లాడటం లేదని అత్మహత్యకి పాల్పడ్డాడో యువకుడు. ఎలక్ట్రీషియన్ గా పని చేస్తున్న దుర్గేష్ బోయిన్ పల్లిలో ఒక ఇంట్లో పని చేయడానికి వెళ్లి మహిళ తో పరిచయం పెంచుకున్నాడు. రెండేళ్ళుగా ఇద్దరూ తరచూ మాట్లాడుకుంటున్నారు. అనుకోకుండా కొంతకాలంగా మాట్లాడడం మానేసిందా మహిళ. మనస్థాపంతో మహిళ ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు దుర్గేష్.…
సికింద్రాబాద్ లోని రసూల్పుర,పికెట్ లోని వ్యాక్సినేషన్ సెంటర్లను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పించిన ఈ అవకా శాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజ లు తమంతట తాముగా రెండో డోసు వ్యాక్సిన్ వేయించుకోవాలని, అధికా రులు ప్రజలు వాక్సిన్ వేయించుకునేలా వంద శాతం వాక్సినేటెడ్ నగరంగా హైదరాబాద్ను తయారు చేయాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాంతంలో అధికారులు ఇంటింటి సర్వేను పూర్తి చేశామని వ్యాక్సిన్…
సికింద్రాబాద్-విశాఖ మధ్య ప్రత్యేకరైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. ఈ నెల 17, 24 తేదీల్లో స్పెషల్ రైళ్లు తిరగనున్నాయి. ఆయా తేదీల్లో రాత్రి 9:05 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరనున్న రైలు.. తర్వాతి రోజు ఉదయం 9:50 గంటలకు విశాఖ చేరుతుంది. అలాగే విశాఖలో ఈ నెల 16, 23 తేదీల్లో సాయంత్రం 5:35 గంటలకు బయల్దేరనున్న రైలు.. తర్వాతి రోజు ఉదయం 7:10 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. స్పెషల్ రైళ్లకు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి,…
సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా స్టువర్టుపురం-ఈపూరుపాలెం మధ్య చెన్నై వెళ్తున్న మార్గంలో రైలు పట్టా విరిగింది. రైలు పట్టా విరగడాన్ని గమనించిన రైల్వే గస్తీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే ఈ సమాచారాన్ని అధికారులకు చేరవేశారు. దీంతో చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలును రైల్వే అధికారులు స్టువర్టుపురం స్టేషన్లోనే నిలిపివేశారు. దీంతో మంగళవారం అర్ధరాత్రి 1:30 గంటల నుంచి 3:30 గంటల వరకు రైలు స్టువర్టుపురం స్టేషన్లోనే…
ప్రస్తుతం భారత్ , కివీస్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకం. ఎవరు విజయం సాధిస్తే వారికీ సెమీ ఫైనల్స్ కు వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే సికింద్రాబాద్ లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్ చేసారు. ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ లను బెట్టింగ్ చేస్తుంది ఓ ముఠా. ముగ్గురు సభ్యుల ముఠా అరెస్ట్ చేసారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. బెట్టింగ్ లకు పాల్పడుతున్న అంకిత్. మోహిత్. కనక్ లను అరెస్ట్. చేసారు.…
తన ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది తెలంగాణ ఆర్టీసీ.. ప్రయాణికులకు అందిస్తున్న సేవలలో మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.. ఇప్పటి వరకు నగదు చెల్లింపుల ద్వారానే ఆర్టీసీ లావాదేవీలు నిర్వహిస్తుండగా.. క్రమంగా డిజిటలైజేషన్కు ప్రాధాన్యత ఏర్పడిన సమయంలో.. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. యూపీఐ/క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులను స్వీకరించడానికి ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది ఆర్టీసీ.. మొదటగా.. మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో టికెట్ రిజర్వేషన్ కౌంటర్, పార్సెల్, కార్గో సెంటర్ అలాగే రేథిఫైల్ బస్ స్టేషన్ (సికింద్రాబాద్)…
తరచూ రైళ్లలో ప్రయాణించేవారు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది.. ఎందుకంటే.. రైళ్ల రాకపోకలకు సంబంధించి పలు కీలక మార్పులు చేసింది దక్షిణ మధ్య రైల్వే.. కొత్తగా తీసుకున్న నిర్ణయాలు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయని ప్రకటన విడుదల చేసింది. కొత్త రైళ్లను అందుబాటులోకి తేవడమే కాకుండా కొన్ని మెయిల్/ఎక్స్ప్రెస్ రైళ్లను సూపర్ పాస్ట్ ఎక్స్ప్రెస్లుగా, కొన్ని ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్ రైళ్లుగా మార్చింది. అంతేకాదు పలు రైళ్లను దారి…
ఎప్పుడూ వేల మంది రోగులు, అటెండర్లతో రద్దీగా ఉండే సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో గ్యాంగ్ రేప్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది… బాధితురాలికి మత్తుమందు ఇచ్చి తన పశువాంఛను తీర్చుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.. అయితే, మరో బాధితురాలి ఇంకా లేకపోవడంతో ఆందోళన మొదలైంది.. అసలు గాంధీ ఆస్పత్రిలో ఏం జరిగింది.. అత్యాచార ఘటనలో బాధితురాలి ఫిర్యాదులో ఏం పేర్కొన్నారు అనే అంశాలను పరిశీలిస్తే.. ఈ నెల 5వ తేదీన తన అక్క భర్తను గాంధీలో అడ్మిట్ చేసిన…
హైదరాబాద్లో అంతర్భాగంగా ఉన్న ఆ ప్రాంతంలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్నాయి పార్టీలు. ఇదే టైమ్ అనుకున్నాయో ఏమో కరోనా టీకాలతో రాజకీయ ఎత్తుగడలకు తెరతీశాయి. కానీ.. అనుకున్నదొక్కటి…అయ్యిందొక్కటి. పొలిటికల్ వ్యాక్సిన్ వికటించి టెన్షన్ పడుతున్నారట. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఓట్ల కోసం కరోనా టీకా సెంటర్లు ఏర్పాటు! ఎన్నికల సమయంలో వరదలు వస్తే.. బాధితులకు సాయం చేయడానికి పార్టీలు పోటీపడతాయి. ఓట్లు రాబట్టుకోవాలని చూస్తాయి. ఆ సమయంలో జనాలకు ఇంకేదైనా…
రైల్వే ప్రయాణికులతో పాటు స్టేషన్కు వెళ్లేవారికి.. రైళ్లలో వచ్చేవారిని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కు వెళ్లేవారికి గుడ్న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే.. తాత్కాలికంగా పెంచిన ప్లాట్ఫారమ్ టికెట్ ధరను సికింద్రాబాద్ డివిజన్లోని అన్ని రైల్వే స్టేషన్లలో తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.. కరోనా మహమ్మారి కారణంగా గతంలో నిలిపేసిన ప్లాట్ఫారమ్ టికెట్ల జారీ మళ్లీ పునరుద్ధరించారు అధికారులు… జోన్ నెట్వర్క్లో అన్రిజర్వ్డ్ ఎక్స్ప్రెస్ రైళ్లు పునరుద్ధరించిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.. సికింద్రాబాద్ డివిజన్లోని అన్ని రైల్వే స్టేషన్లలో…