Road accident in Karnataka.. 9 people died: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక ఆర్టీసీ, పాల ట్యాంకర్, టెంపో ట్రావెలర్ వాహనాలు ఢీకొన్నాయి. మూడు వాహనాలు ఢీకొనడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. టెంపో వాహనంలో ప్రయాణాస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మరణించారు. ఈ ఘటన శనివరాం రాత్రి 11 గంటలకు హసన్ జిల్లా బాణావర పోలీస్ స్టేషన్ పరిధిలో చెలువనహళ్లి ప్రాంతంలో జరిగింది. బస్సు, పాల ట్యాంకర్…
తెలంగాణ సీఐడీ చీఫ్ గోవింద్సింగ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.. రాజస్థాన్లో ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది.. ఈ ప్రమాదంలో గోవింద్సింగ్ భార్య అక్కడిక్కడే మృతిచెందగా.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు గోవింద్సింగ్.. ఇక, వారితో పాటు కారులో ప్రయాణం చేస్తున్న డ్రైవర్, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.. గోవింద్ సింగ్కు తీవ్రమైన ఫ్రాక్చర్తో ప్రాణాలతో బయటపడగా.. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది… జైసల్మేర్ జిల్లాలోని రామ్గఢ్-టానోట్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.. Read Also:…
కొన్ని ఊహించని ఘటనలు.. తమ కళ్ల ముందు జరిగిన ప్రమాదాలు కొందరి మనస్సును పూర్తిగా మార్చేస్తాయి.. ఎన్నిసార్లు చెప్పినా.. చాలా సార్లు దొరికిపోయినా.. ఎందరో హెచ్చరించినా మనసు మార్చుకోని ఓ బైక్ రేసర్.. ఓ ఘటనను చూసిన తర్వాత పూర్తిగా మారిపోయాడు.. మారడంటే.. తాను ఒక్కడే మారడం కాదు.. చాలా మందిని మార్చే ప్రయత్నం మొదలు పెట్టాడు.. ప్లకార్డులు పట్టుకొని రోడ్లపైకి వచ్చాడు.. సిగ్నల్స్ వద్ద ప్రచారం చేయడం మొదటు పెట్టాడు.. ఇంతలా మారిపోయిన ఆ బైక్…
మునుగోడు ఉప ఎన్నికలో TDP పోటీ చేయడంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, త్వరలో వెల్లడిస్తామని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ తరఫున అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నేతలకు చంద్రబాబు సూచించారు.
Bus falls into river in Nepal: నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటీవల కాలంలో వరసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గురువారం నేపాల్ లోని బారా జిల్లాలోని బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 16 మంది చనిపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. నేపాల్ లోని మాధేష్ ప్రావిన్సులో ఈ ఘటన జరిగింది. మరో 35 మంది గాయపడ్డారు. వీరిలో కూడా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఉత్తరాఖండ్లోని పౌడి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈప్రమాదంలో 25 మంది నీటిలో మునిగి చనిపోయారు. రిఖినికల్-బీరోఖల్ రహదారిపై వెళ్తున్న పెళ్లి బస్సు అదుపు తప్పి 500 మీటర్ల లోతున నదిలో పడిపోయింది.
మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ యువతి రోడ్డును క్రాస్ చేసి జాతీయ రహదారిపై అటు నుంచి ఇటు రోడ్డుపై దాటుతుండగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హిమాచల్ ప్రదేశ్లోని కులులో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కులు జిల్లాలోని బంజర్ లోయలోని ఘియాగి ప్రాంతంలో పర్యాటకులతో వెళ్తున్న ఓ వాహనం అదుపుతప్పి వాగులో పడింది.
Siddipet Car Accident: సిద్దిపేట జిల్లాలో జరిగిన కారు ప్రమాదం విషాదం మిగిల్చింది. కొండపాక మండలం జప్తి నాచారం శివారులో ఓ కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. బావిలో పడ్డ కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగా.. ఇద్దరు ప్రాణాలతో బయటపడగా మరొకరు కారులోనే ఇరుక్కుపోయి చనిపోయారు. బావిలో పడ్డ కారు, యాదగిరి కోసం ఆరుగంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. సిద్దిపేట జిల్లా సిరిసినగండ్లకు చెందిన వెంకటస్వామి తన బావలను ఇంటికి తీసుకురావడానికి కారు తీసుకుని కొండపాకకి బయలుదేరాడు.…