Uttarpradesh: లఖింపూర్ ఖేరీలో ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం
Uttarpradesh: ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లఖింపూర్ ఖేరీలో లక్నోతో వెళ్తున్న ట్రక్కు, ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 25 మందికి పైగా గాయపడ్డారు. బస్సు ధౌరేహ్రా నుంచి లక్నో వెళుతుండగా ఇసానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎరా వంతెన సమీపంలో ప్రమాదం జరిగింది. గాయపడిన వారందరినీ జిల్లా ఆసుపత్రికి తరలించగా, మరికొందరిని లక్నోకు రిఫర్ చేసినట్లు లఖింపూర్ ఖేరీ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ADM) సంజయ్ కుమార్ తెలిపారు. సమాచారం అందుకున్న ఏడీఎం, సర్కిల్ అధికారి(సీఓ) జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు.
Delhi Excise Policy Case: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మరొకరు అరెస్ట్
Also Read
ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆకాంక్షించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!