Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road accident in Karnataka.. 9 people died: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక ఆర్టీసీ, పాల ట్యాంకర్, టెంపో ట్రావెలర్ వాహనాలు ఢీకొన్నాయి. మూడు వాహనాలు ఢీకొనడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. టెంపో వాహనంలో ప్రయాణాస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మరణించారు. ఈ ఘటన శనివరాం రాత్రి 11 గంటలకు హసన్ జిల్లా బాణావర పోలీస్ స్టేషన్ పరిధిలో చెలువనహళ్లి ప్రాంతంలో జరిగింది. బస్సు, పాల ట్యాంకర్ మధ్య టెంపో వాహనం నలిగిపోవడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది.
మృతులు అంతా ధర్మస్థల, సుబ్రమణ్య, హసనాంబ ఆలయాలను సందర్శించి ఇంటికి తిరిగి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. శివమొగ్గ నుంచి వెళ్తున్న కేఎస్ఆర్టీసీ బస్సు, ముందున్న టెంపో వాహనాన్ని ఢీకొట్టంది. దీంతో టెంపో వాహనం నియంత్రణ తప్పి ఎదురుగా వస్తున్న పాల ట్యాంకర్ ను ఢీకొట్టింది. దీంతో టెంపో వాహనం నుజ్జునుజ్జు అయింది. రెండు వాహనాల మధ్య టెంపో చిక్కుకుపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో ప్రయాణికులు అంతా నిద్రలో ఉన్నారు. దీంతో ప్రమాదం జరిగిన వెంటనే తేరుకునే లోపే అందులో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు పిల్లలు కూడా ఉన్నట్లు ఎస్పీ హరిరామ్ శంకర్ వెల్లడించారు.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
Read Also: Ebola outbreak: ఉగాండాలో “ఎబోలా” కల్లోలం.. లాక్డౌన్ విధింపు
ప్రమాదంతో ఆర్టీసీ బస్సులోని 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వీరందరిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. టెంపోలో మొత్తం 14 మంది ఉంటే 9 మంది మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మరణించడంతో వారి స్వస్థలాల్లో విషాదం నెలకొంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?