Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road accident in Karnataka.. 9 people died: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటక ఆర్టీసీ, పాల ట్యాంకర్, టెంపో ట్రావెలర్ వాహనాలు ఢీకొన్నాయి. మూడు వాహనాలు ఢీకొనడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. టెంపో వాహనంలో ప్రయాణాస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మరణించారు. ఈ ఘటన శనివరాం రాత్రి 11 గంటలకు హసన్ జిల్లా బాణావర పోలీస్ స్టేషన్ పరిధిలో చెలువనహళ్లి ప్రాంతంలో జరిగింది. బస్సు, పాల ట్యాంకర్ మధ్య టెంపో వాహనం నలిగిపోవడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది.
మృతులు అంతా ధర్మస్థల, సుబ్రమణ్య, హసనాంబ ఆలయాలను సందర్శించి ఇంటికి తిరిగి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. శివమొగ్గ నుంచి వెళ్తున్న కేఎస్ఆర్టీసీ బస్సు, ముందున్న టెంపో వాహనాన్ని ఢీకొట్టంది. దీంతో టెంపో వాహనం నియంత్రణ తప్పి ఎదురుగా వస్తున్న పాల ట్యాంకర్ ను ఢీకొట్టింది. దీంతో టెంపో వాహనం నుజ్జునుజ్జు అయింది. రెండు వాహనాల మధ్య టెంపో చిక్కుకుపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో ప్రయాణికులు అంతా నిద్రలో ఉన్నారు. దీంతో ప్రమాదం జరిగిన వెంటనే తేరుకునే లోపే అందులో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు పిల్లలు కూడా ఉన్నట్లు ఎస్పీ హరిరామ్ శంకర్ వెల్లడించారు.
Also Read
- TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
- Mohan Bhagwat: ప్రవర్తనతో భారతీయ కుటుంబాలు ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి
- India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
- US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
Read Also: Ebola outbreak: ఉగాండాలో “ఎబోలా” కల్లోలం.. లాక్డౌన్ విధింపు
ప్రమాదంతో ఆర్టీసీ బస్సులోని 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వీరందరిని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. టెంపోలో మొత్తం 14 మంది ఉంటే 9 మంది మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మరణించడంతో వారి స్వస్థలాల్లో విషాదం నెలకొంది.
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!