శంకర్ జోరు చూపిస్తున్నాడు. ఓ వైపు చరణ్ తో సినిమా పనులు కానిస్తూనే అప్పుడెపుడో తీసిన ‘అన్నియన్’ ని బాలీవుడ్ లో రణ్ వీర్ రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ విషయమై నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ చేసిన హెచ్చరికకు ప్రతిగా సవాల్ చేసిన శంకర్ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ ‘అపరిచితుడు’కి హీరోయిన్ ని కూడా సెట్ చేశాడట. ‘భరత్ అనే నేను’లో మహేశ్ కి జోడీగా నటించిన కియారా అద్వానినీని రణ్ వీర్ కి జోడీగా ఎంచుకున్నాడట.…
ఇండియన్ ఐకానిక్ డైరెక్టర్ శంకర్ ‘అపరిచితుడు’ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్వీర్ సింగ్ ‘అపరిచితుడు’ రీమేక్ లో హీరోగా నటించనున్నారు. పెన్ మూవీస్ బ్యానర్ పై జయంతిలాల్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా నిర్మించనున్నారు. తమిళంలో ‘అన్నియన్’గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ‘అపరిచితుడు’ పేరుతో విడుదలైంది. 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సృష్టించిన సునామీ అంతా…