కష్టాల్లో కపిల్ దేవ్ బయోపిక్ … కేసు నమోదు
ప్రపంచ వ్యాప్తంగా సినీ, క్రీడా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్. ఈ బయోపిక్ లో కపిల్ దేవ్ పాత్రలో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటిస్తుండగా ఆయన భార్య పాత్రలో దీపికా పదుకొనె సందడి చేయనుంది. 1983 క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యంలో రూపొందుతున్న”83″ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. నవంబర్ 30న ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా… దానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. డిసెంబర్ 24 దేశ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా, తాజాగా ఈ సినిమా చిక్కుల్లో పడింది.
Read Also : సెన్సార్ పూర్తి చేసుకున్న “పుష్ప”రాజ్… ఇక మిగిలింది ఇదే!
Also Read
- Toxic : టాక్సిక్ డీల్.. నిర్మాతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న OTTలు!
- Gayapadda Simham: స్టార్ హీరోల ఫాన్స్ గెట్ రెడీ ఫర్ బ్లాస్టింగ్ స్పూఫ్స్!
- Peddi: రామ్ చరణ్ 'పెద్ది' నుండి బ్లాస్టింగ్ సాంగ్ దిగుతోంది!
- Sandeep Virk: క్యాస్టింగ్ కౌచ్పై నటి షాకింగ్ కామెంట్స్.. "రాత్రి 12 గంటలకు నా రూమ్లోకి వచ్చి .. ఆ పని చేయమన్నాడు!"
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) ఫైనాన్షియర్ కంపెనీ ఇక్కడి మేజిస్ట్రేట్ కోర్టులో ’83’ నిర్మాతలపై చీటింగ్ ఫిర్యాదును దాఖలు చేసింది. ఈ మేరకు ఫ్యూచర్ రిసోర్సెస్ FZE అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది. సమాచారం ప్రకారం ఫ్యూచర్ రిసోర్సెస్ ఎఫ్జెడ్ఇ ప్రతినిధులు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టే ఆలోచనతో విబ్రి మీడియాను కలిశారు. విబ్రి సంస్థ వారిని సినిమా హక్కుల పేరుతో నమ్మబలికి ఎఫ్జెడ్ఇని విబ్రితో కలిసి రూ.15.90 కోట్లు ఖర్చు చేసేందుకు ఒప్పించారని ఫిర్యాదులో ఆరోపించారు. తీరా ఇప్పుడు చూస్తే సినిమా హక్కుల విషయంలో తాను మోసపోయానని ఫిర్యాదుదారు తెలిపారు.
Read Also : బాలయ్యకు హీరోయిన్ సాష్టాంగ నమస్కారం
విబ్రి మీడియా డైరెక్టర్ పై భారతీయ శిక్షాస్మృతిలోని 406, 420, 120బి సెక్షన్ల కింద చిత్ర నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాది రిజ్వాన్ సిద్ధికీ ద్వారా దాఖలు చేసిన ఈ ఫిర్యాదులో నిందితులు “83” చిత్రాన్ని నిర్మించారని, చిత్రం హక్కుల విషయంలో ఫిర్యాదుదారుని మోసం చేయడానికి ప్లాన్ చేశారని ఆరోపించారు. విబ్రి మీడియా డైరెక్టర్లు ఏప్రిల్ 2012 నుండి మార్చి 2020 వరకు సినిమా వ్యాపార ప్రణాళికలు, లాభ నష్టాల అంచనాలను సమర్పించారని, ఫిర్యాదుదారు కంపెనీని ఇందులో రూ. 15.90 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టేలా ప్రేరేపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!
-
GPO Promotions : గ్రామ పంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
-
Toxic : టాక్సిక్ డీల్.. నిర్మాతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న OTTలు!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో