ఐపీఎల్ పై కన్నేసిన దీపిక-రణవీర్.. పోటీకి సై?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ ప్రియులకు ఐపీఎల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడెప్పుడు ఐపీఎల్ ప్రారంభం అవుతుందా? అంటూ వారంతా ఎదురుచూస్తూ ఉంటారు. బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ కు ప్రపంచ వ్యాప్తంగా భలే క్రేజ్ ఏర్పడింది. కరోనా టైంలోనూ బీసీసీఐ ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ఐపీఎల్-2021ను నిర్వహించి విజయవంతం చేసింది. ప్రతీ ఎడిషన్ లోనూ సరికొత్త ఐడియాలతో ఐపీఎల్ నిర్వహకులు క్రికెట్ మ్యాచులను ప్లాన్ చేస్తుండటంతో ఎప్పటికప్పుడు వీక్షకుల సంఖ్య పెరిగిపోతూ పోతోంది. దీంతో ఐపీఎల్ జట్లను దక్కించుకున్న యజమానులకు కాసులవర్షం కురుస్తోంది.
ప్రస్తుతం ఐపీఎల్ లో ఎనిమిది జట్లు ఉన్నాయి. అయితే 2022 సంవత్సరం నుంచి జరిగే 15వ ఎడిషన్ నుంచి మరో రెండు జట్లు అదనంగా రానున్నాయి. మొత్తం 10జట్లతో ఐపీఎల్-2022ను నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలను రచిస్తోంది. దీనిలో భాగంగా రెండు కొత్త జట్లకు సంబంధించిన బిడ్లను దాఖలు చేయడానికి అక్టోబర్ 25 వరకు అవకాశం కల్పించింది. ఇప్పటికే పలు ప్రముఖ సంస్థలు, వ్యక్తులు బిడ్లను దాఖలు చేసినట్లు సమాచారం. వీరిలో నాలుగు సంస్థల పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. 300 బంతులు ఆడగలనని ప్రపంచానికి చూపించాలి!
- Shubman Gill Record: శుభ్మన్ గిల్ అరుదైన రికార్డు.. సచిన్, సెహ్వాగ్ తర్వాత..!
- Saransh Jain Debut: ఐపీఎల్ ఆడకుండానే టీమిండియా డెబ్యూ.. మూడో ఆటగాడిగా సారాంశ్ జైన్ అరుదైన రికార్డు!
- Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
ప్రముఖ వ్యాపార దిగ్గజలైన అదానీ గ్రూప్, ఆర్పీ సంజయ్ గోయాంకలు బిడ్లను దాఖలు చేశారు. అలాగే ఇంగ్లీష్ ఫుల్ బాట్ టీం మాంచెస్టర్ యూనైటెడ్ సైతం ఐపీఎల్ కొత్త టీంపై కన్నేసింది. ఈమేరకు ఈ సంస్థ కూడా బిడ్ ను దాఖలు చేసింది. వీరితోపాటు ప్రముఖ బాలీవుడ్ కపుల్స్ దీపిక పదుకోన్, రణ్వీర్ సింగ్ లు ఐపీఎల్ టీం కోసం బిడ్లను దాఖలు చేయడం ఆసక్తిని రేపుతోంది. దీపిక-రణ్వీర్ లకు క్రీడలు కొత్తమే కాదు. దీపిక తండ్రి ప్రకాశ్ పదుకోన్ మాజీ ప్రపంచ బ్యాడ్మింటన్ ప్లేయర్. దీంతో సహజంగానే ఆమె సైతం క్రీడలపై మక్కువ పెంచుకుంది.
ఇండియాలో క్రికెట్ కు ఎంత క్రేజ్ ఉందో సినిమాలకు అంతే క్రేజ్ ఉంది. ఈ రెండింటిని ఐపీఎల్ కలిపిందనే చెప్పొచ్చు. ఐపీఎల్ ప్రతీ సీజన్లోనూ బాలీవుడ్ స్టార్స్ సందడి కన్పిస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, ప్రముఖ హీరోయిన్ ప్రీతీజింటాలు రెండు ఐపీఎల్ టీంలకు ఓనర్లుగా ఉన్నారు. తాజాగా దీపిక పదుకోన్, రణ్వీర్ జంట కూడా ఐపీఎల్ టీంను దక్కించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుండటం సినీ, క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ జంట సైతం ఐపీఎల్ టీమును దక్కించుకుంటే ఈసారి టోర్ని మరింత కలర్ ఫుల్ గా సాగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరీ వీళ్లు ఐపీల్ టీంను దక్కంచుకుంటారో లేదో వేచిచూడాల్సిందే..!
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!