ఐపీఎల్ పై కన్నేసిన దీపిక-రణవీర్.. పోటీకి సై?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ ప్రియులకు ఐపీఎల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడెప్పుడు ఐపీఎల్ ప్రారంభం అవుతుందా? అంటూ వారంతా ఎదురుచూస్తూ ఉంటారు. బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ కు ప్రపంచ వ్యాప్తంగా భలే క్రేజ్ ఏర్పడింది. కరోనా టైంలోనూ బీసీసీఐ ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ఐపీఎల్-2021ను నిర్వహించి విజయవంతం చేసింది. ప్రతీ ఎడిషన్ లోనూ సరికొత్త ఐడియాలతో ఐపీఎల్ నిర్వహకులు క్రికెట్ మ్యాచులను ప్లాన్ చేస్తుండటంతో ఎప్పటికప్పుడు వీక్షకుల సంఖ్య పెరిగిపోతూ పోతోంది. దీంతో ఐపీఎల్ జట్లను దక్కించుకున్న యజమానులకు కాసులవర్షం కురుస్తోంది.
ప్రస్తుతం ఐపీఎల్ లో ఎనిమిది జట్లు ఉన్నాయి. అయితే 2022 సంవత్సరం నుంచి జరిగే 15వ ఎడిషన్ నుంచి మరో రెండు జట్లు అదనంగా రానున్నాయి. మొత్తం 10జట్లతో ఐపీఎల్-2022ను నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలను రచిస్తోంది. దీనిలో భాగంగా రెండు కొత్త జట్లకు సంబంధించిన బిడ్లను దాఖలు చేయడానికి అక్టోబర్ 25 వరకు అవకాశం కల్పించింది. ఇప్పటికే పలు ప్రముఖ సంస్థలు, వ్యక్తులు బిడ్లను దాఖలు చేసినట్లు సమాచారం. వీరిలో నాలుగు సంస్థల పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి.
Also Read
- Rohit Sharma Retirement: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు రంగం సిద్ధం..? చివరి వన్డే ఇదేనా..!
- England vs India 2nd ODI: భారత్ విజయాన్ని అడ్డుకున్న జో రూట్...! కోహ్లీ, అయ్యర్ పోరాటం వృథా..
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
- Rohit Sharma: చేసిన పరుగులు 26.. అయినా అరుదైన రికార్డ్ సాధించిన రోహిత్ శర్మ..
ప్రముఖ వ్యాపార దిగ్గజలైన అదానీ గ్రూప్, ఆర్పీ సంజయ్ గోయాంకలు బిడ్లను దాఖలు చేశారు. అలాగే ఇంగ్లీష్ ఫుల్ బాట్ టీం మాంచెస్టర్ యూనైటెడ్ సైతం ఐపీఎల్ కొత్త టీంపై కన్నేసింది. ఈమేరకు ఈ సంస్థ కూడా బిడ్ ను దాఖలు చేసింది. వీరితోపాటు ప్రముఖ బాలీవుడ్ కపుల్స్ దీపిక పదుకోన్, రణ్వీర్ సింగ్ లు ఐపీఎల్ టీం కోసం బిడ్లను దాఖలు చేయడం ఆసక్తిని రేపుతోంది. దీపిక-రణ్వీర్ లకు క్రీడలు కొత్తమే కాదు. దీపిక తండ్రి ప్రకాశ్ పదుకోన్ మాజీ ప్రపంచ బ్యాడ్మింటన్ ప్లేయర్. దీంతో సహజంగానే ఆమె సైతం క్రీడలపై మక్కువ పెంచుకుంది.
ఇండియాలో క్రికెట్ కు ఎంత క్రేజ్ ఉందో సినిమాలకు అంతే క్రేజ్ ఉంది. ఈ రెండింటిని ఐపీఎల్ కలిపిందనే చెప్పొచ్చు. ఐపీఎల్ ప్రతీ సీజన్లోనూ బాలీవుడ్ స్టార్స్ సందడి కన్పిస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, ప్రముఖ హీరోయిన్ ప్రీతీజింటాలు రెండు ఐపీఎల్ టీంలకు ఓనర్లుగా ఉన్నారు. తాజాగా దీపిక పదుకోన్, రణ్వీర్ జంట కూడా ఐపీఎల్ టీంను దక్కించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుండటం సినీ, క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ జంట సైతం ఐపీఎల్ టీమును దక్కించుకుంటే ఈసారి టోర్ని మరింత కలర్ ఫుల్ గా సాగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరీ వీళ్లు ఐపీల్ టీంను దక్కంచుకుంటారో లేదో వేచిచూడాల్సిందే..!
తాజావార్తలు
-
Astrology: జాతకంలో శని శుభప్రదంగా ఉన్నప్పుడు.. జీవితంలో అద్భుతమైన మార్పులు.. ఇవే ఆ సంకేతాలు!
-
Prabhas Movies : డిసెంబర్ 3న ‘ఫౌజీ’ విడుదల.. ప్రభాస్ను నమ్మొచ్చా.. కన్ఫర్మ్గా వస్తాడా?
-
COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ను చంపిన వారికి 10 మిలియన్ డాలర్ల బహుమతి?.. ఇరాక్ సాయుధ గ్రూప్ సంచలన ప్రకటన
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!