ఐపీఎల్ పై కన్నేసిన దీపిక-రణవీర్.. పోటీకి సై?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ ప్రియులకు ఐపీఎల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడెప్పుడు ఐపీఎల్ ప్రారంభం అవుతుందా? అంటూ వారంతా ఎదురుచూస్తూ ఉంటారు. బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ కు ప్రపంచ వ్యాప్తంగా భలే క్రేజ్ ఏర్పడింది. కరోనా టైంలోనూ బీసీసీఐ ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ఐపీఎల్-2021ను నిర్వహించి విజయవంతం చేసింది. ప్రతీ ఎడిషన్ లోనూ సరికొత్త ఐడియాలతో ఐపీఎల్ నిర్వహకులు క్రికెట్ మ్యాచులను ప్లాన్ చేస్తుండటంతో ఎప్పటికప్పుడు వీక్షకుల సంఖ్య పెరిగిపోతూ పోతోంది. దీంతో ఐపీఎల్ జట్లను దక్కించుకున్న యజమానులకు కాసులవర్షం కురుస్తోంది.
ప్రస్తుతం ఐపీఎల్ లో ఎనిమిది జట్లు ఉన్నాయి. అయితే 2022 సంవత్సరం నుంచి జరిగే 15వ ఎడిషన్ నుంచి మరో రెండు జట్లు అదనంగా రానున్నాయి. మొత్తం 10జట్లతో ఐపీఎల్-2022ను నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలను రచిస్తోంది. దీనిలో భాగంగా రెండు కొత్త జట్లకు సంబంధించిన బిడ్లను దాఖలు చేయడానికి అక్టోబర్ 25 వరకు అవకాశం కల్పించింది. ఇప్పటికే పలు ప్రముఖ సంస్థలు, వ్యక్తులు బిడ్లను దాఖలు చేసినట్లు సమాచారం. వీరిలో నాలుగు సంస్థల పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి.
Also Read
- Jos Buttler: "నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం".. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
- CSK-IPL 2027: చెన్నై సూపర్ కింగ్స్కు మరో షాక్.. స్టార్ కోచ్ కూడా గుడ్బై.. సీఎస్కే భవిష్యత్పై బెంగ!
- Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్గా రిషభ్ పంత్..
ప్రముఖ వ్యాపార దిగ్గజలైన అదానీ గ్రూప్, ఆర్పీ సంజయ్ గోయాంకలు బిడ్లను దాఖలు చేశారు. అలాగే ఇంగ్లీష్ ఫుల్ బాట్ టీం మాంచెస్టర్ యూనైటెడ్ సైతం ఐపీఎల్ కొత్త టీంపై కన్నేసింది. ఈమేరకు ఈ సంస్థ కూడా బిడ్ ను దాఖలు చేసింది. వీరితోపాటు ప్రముఖ బాలీవుడ్ కపుల్స్ దీపిక పదుకోన్, రణ్వీర్ సింగ్ లు ఐపీఎల్ టీం కోసం బిడ్లను దాఖలు చేయడం ఆసక్తిని రేపుతోంది. దీపిక-రణ్వీర్ లకు క్రీడలు కొత్తమే కాదు. దీపిక తండ్రి ప్రకాశ్ పదుకోన్ మాజీ ప్రపంచ బ్యాడ్మింటన్ ప్లేయర్. దీంతో సహజంగానే ఆమె సైతం క్రీడలపై మక్కువ పెంచుకుంది.
ఇండియాలో క్రికెట్ కు ఎంత క్రేజ్ ఉందో సినిమాలకు అంతే క్రేజ్ ఉంది. ఈ రెండింటిని ఐపీఎల్ కలిపిందనే చెప్పొచ్చు. ఐపీఎల్ ప్రతీ సీజన్లోనూ బాలీవుడ్ స్టార్స్ సందడి కన్పిస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, ప్రముఖ హీరోయిన్ ప్రీతీజింటాలు రెండు ఐపీఎల్ టీంలకు ఓనర్లుగా ఉన్నారు. తాజాగా దీపిక పదుకోన్, రణ్వీర్ జంట కూడా ఐపీఎల్ టీంను దక్కించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుండటం సినీ, క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ జంట సైతం ఐపీఎల్ టీమును దక్కించుకుంటే ఈసారి టోర్ని మరింత కలర్ ఫుల్ గా సాగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరీ వీళ్లు ఐపీల్ టీంను దక్కంచుకుంటారో లేదో వేచిచూడాల్సిందే..!
తాజావార్తలు
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
-
Mega Multistarrer : ఒకే స్క్రీన్పై వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
-
Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!