ప్రముఖ దర్శకుడు శంకర్ – మెగా పవర్ స్టార్ రాంచరణ్ సినిమా సెప్టెంబర్ 8న భారీ ఎత్తున లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ను ప్రత్యేక అతిథిగా రానున్నట్లు సమాచారం. కాగా, శంకర్- రణ్వీర్ సింగ్ కాంబోలో ‘అపరిచితుడు 2’ పాన్ ఇండియా సినిమాగా రానున్న విషయం తెలిసిందే. ఇక చరణ్ కెరీర్లో 15వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాని నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్తో రూపొందనున్నారు. స్టార్ హీరోయిన్ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. తమన్ సంగీతాన్ని అందించనున్నారు. ఇక ఈ సినిమాలో చరణ్ పాత్రపై రకరకాల ఊహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే.. పక్క పొలిటికల్ నేపథ్యంలో వస్తున్న సినిమా అని కొందరు అంటుంటే.. మరొకొందరు మాత్రం చరణ్ స్టూడెంట్ లీడర్ పాత్ర పోషించనున్నాడని అంటున్నారు.
ప్రస్తుతం చరణ్ ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాల షూటింగ్స్ పూర్తి చేసుకొని వున్నారు. త్వరలోనే ఈ సినిమాల విడుదల తేదీలు ప్రకటించనున్నారు. మరోవైపు శంకర్ భారతీయుడు 2 సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ మొదటి నుంచి వివిధ కారణాలు, వివాదాలతోనే వార్తల్లో నిలుస్తోంది. అయితే తాజా సమాచారం మేరకు చరణ్ సినిమాని అక్టోబర్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని శంకర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పనులన్నీ ఇప్పటికే దిల్ రాజు ప్లాన్ చేసుకొని రెడీగా వున్నారు.