Ayodhya Ram Mandir: అయోధ్యకు 1000 కిలోమీటర్ల దూరంలో.. మరో రామ మందిరం ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Ram Mandir: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి అశేష జనవాహిని హాజరైంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరవ్వగా.. సినీ, రాజకీయ, స్పోర్ట్స్, వ్యాపార ప్రముఖులు అతిథులుగా వచ్చారు. శతాబ్ధాల హిందువుల కల నేటితో నిజమైంది.
Read Also: Yogi Adityanath: అయోధ్యలో ఇకపై బుల్లెట్ల మోతలు, కర్ఫ్యూలు ఉండవు..ములాయం సింగ్పై విమర్శలు..
Also Read
- Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
- Vijay-Governor: విజయ్కు మళ్లీ బిగ్ షాక్.. చిన్న పార్టీల లేఖలపై ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్
- China-Pakistan: ఆపరేషన్ సిందూర్లో పాకిస్తాన్కు చైనా ప్రత్యక్ష సహాయం..!
- Rahul Gandhi: రేపు చెన్నైకు రాహుల్గాంధీ.. విజయ్ ప్రమాణస్వీకారానికి హాజరు!
ఇదిలా ఉంటే అయోధ్యకు 1000 కిలోమీటర్ల దూరంలో ఒడిశాలోని మరో రామ మందిరం ఇదే రోజున ప్రారంభమైంది. సముద్ర మట్టానికి 1800 అడుగుల ఎత్తులో ఉన్న కొండపై గొప్ప రామ మందిరం నిర్మితమైంది. ఓ వైపు అయోధ్య రామ మందిర కార్యక్రమాలు జరుగుతుంటే.. మరోవైపు ఒడిశా నయాఘర్లోని ఫతేగర్ గ్రామంలో మరో ఆలయం ప్రారంభమైంది.
165 అడుగుల ఎత్తుతో ఉన్న ఈ ఆలయానికి రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఇచ్చిన విరాళాలతో ఆలయ నిర్మాణం పూర్తైంది. ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధుల్లో సగం ఫతేగర్ వాసులే ఇచ్చారు. 2017లో ప్రారంభమై ఈ ఆలయంలో ఎంతో మంది పాలుపంచుకున్నారు. ఈ ఆలయం అనతి కాలంలోనే పర్యాటక క్షేత్రంగా మారుతుందని స్థానికులు భావిస్తున్నారు.
సాంప్రదాయ ఒడియా నిర్మాణ శైలిలో ఆలయం నిర్మితమైంది. కోణార్క్ వంటి ప్రసిద్ధ ఆలయాలను ఇది గుర్తుకు తెస్తుంది. ఆలయంలో సూర్యదేవుడు, శివుడు, గణేశుడు, హనుమంతుడిని కూడా ప్రతిష్టించారు. ఈ ఆలయానికి చారిత్రక ప్రాధాన్యత ఉందని ఇక్కడి ఆలయ కమిటీ చెప్పింది. ఈ పర్వతంపై గోవర్ధనుడు కొన్ని దశాబ్ధాలు పూజలు అందుకున్నాడని, 1912లో జగన్నాథుడి నవకళేబర సమయంలో సుదర్శన చెట్టను ఫతేఘడ్ నుంచి సేకరించినట్లు చెప్పారు.
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!