Rahul Gandhi: ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ ఎంపీ స్థానంలో పాటు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్బరేలీ స్థానం నుంచి పోటీ చేశాడు. ఈ రెండు స్థానాల్లో ఆయన భారీ మెజారిటీతో గెలుపొందారు.
Rahul Gandhi: లోక్సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని నియమించాలనే తీర్మానాన్ని ఆమోదించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోవాలనే తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది.
కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వరకూ ఎలాంటి అనుమానం లేదు.. కానీ ఆ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ ఎన్నాళ్లు నడుపుతారు అనేది మాత్రం ఊహించలేమని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ వచ్చిన తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ కూడా రాహుల్ గాంధీ పార్లమెంటరీ పార్టీ బాధ్యతలు చేపట్టాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. సాధారణంగా పార్లమెంటరీ పార్టీ లీడరే కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా ఉంటారు.
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి కర్ణాటక ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కర్ణాటక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ కేశవ్ ప్రసాద్ తనపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ శుక్రవారం బెంగళూరు కోర్టుకు హాజరయ్యారు.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నేడు (శుక్రవారం) బెంగళూరుకు వెళ్లనున్నారు. ఇక, బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో బెంగళూరు కోర్టుకు హాజరుకానున్నారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎవరి పొజేషన్ ఏంటో తెలిసిపోయింది. తాజా ఫలితాల్లో ఎన్డీఏ కూటమి తిరిగి అధికారం ఛేజిక్కించుకుంది. ఇక ఇండియా కూటమి కూడా ఊహించని విధంగా సీట్లు సంపాదించింది.
మోడీ, అమిత్ షాపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. స్టాక్ మార్కెట్ల కుంభకోణానికి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.