Rahul gandhi: మోడీ, అమిత్ షాపై సంచలన ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోడీ, అమిత్ షాపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. స్టాక్ మార్కెట్ల కుంభకోణానికి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. స్టాక్ మార్కెట్ల స్కామ్పై జేపీసీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జూన్3న స్టాక్ మార్కెట్లు పెరుగుతాయని హోంమంత్రి చెప్పారని.. ఈ విషయం ఆయనకు ఎలా తెలుసని ప్రశ్నించారు. ఇది స్టాక్ మార్కెట్లో అత్యంత పెద్ద స్కామ్ అని చెప్పుకొచ్చారు. స్టాక్ మార్కెట్ల విషయంపై మొదటిసారిగా ప్రధాని మోడీ మాట్లాడారన్నారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా తమ విధులను దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. జూన్ 3 పెరిగిన స్టాక్ మార్కెట్లు.. జూన్ 4న పడిపోయాయన్నారు. ఎన్నికల అనంతరం మీడియా తప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే విషయంలో మోడీ ప్రమేయం ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఫారెన్ ఇన్వెస్టర్లకు .. ఎగ్జిట్ పోల్స్కు ఏమైనా సంబంధం ఉందా.. ఎగ్జిట్ పోల్స్ చేసిన వారికి బీజేపీతో సంబంధం ఉందా.. స్కాక్ మార్కెట్ల పడిపోవడంతో ఇన్వెస్టర్లు 30 లక్షల కోట్లు నష్టపోయారన్నారు. బీజేపీ ఇంటర్నల్ సర్వేలో 220 సీట్లు వస్తాయని ముందే వారికి తెలుసన్నారు. ఎన్నికల తరువాత షేర్లు పెరుగుతాయని ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా పదే పదే ఎందుకు చెప్పాల్సి వచ్చిందని ప్రశ్నించారు. బీజేపీ అగ్రనేతలు స్టాక్ మార్కెట్లో అవకతవకలకు పాల్పడుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్లమెంటరీ విచారణ చేయాలని కోరారు.
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
ఎన్నికల ఫలితాల ప్రకటనకు కొద్ది రోజుల ముందు స్టాక్ మార్కెట్ గురించి బీజేపీ నేతలు ఎందుకు వ్యాఖ్యలు చేశారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్టాక్ మార్కెట్పై వ్యాఖ్యానించడాన్ని తొలిసారిగా గుర్తించినట్లు రాహుల్ గాంధీ అన్నారు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!