Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఊరట.. పరువు నష్టం కేసులో బెయిల్ మంజూరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి కర్ణాటక ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కర్ణాటక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ కేశవ్ ప్రసాద్ తనపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ శుక్రవారం బెంగళూరు కోర్టుకు హాజరయ్యారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసులో కాంగ్రెస్ నేత, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా నిందితులుగా ఉన్నారు. అయితే వారిద్దరికీ కొన్ని రోజుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
READ MORE: DELHI: ఎన్డీఏ ఎంపీల సమావేశం ప్రారంభం.. వేదికపై పవన్ కల్యాణ్, చంద్రబాబు
Also Read
- India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
గత బీజేపీ ప్రభుత్వం ప్రాజెక్టుల్లో 40 శాతం కమీషన్ తీసుకున్నదని రాహుల్ గాంధీ ఆరోపించారు. 2019 నుంచి 2023 వరకు రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం తన పాలనలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. దీనికి సంబంధించి ప్రకటనలు ప్రచురిస్తూ తప్పుడు ప్రచారం చేశారని బీజేపీ నేత పరువు నష్టం దావా వేశారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సిద్ధరామయ్య, శివకుమార్ తప్పుడు ఆరోపణలు చేశారని, అందుకే వారిపై ఐపీసీ సెక్షన్ 500 ప్రకారం చర్యలు తీసుకోవాలని కేశవప్రసాద్ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కేసులో జూన్ 7న కచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని రాహుల్ గాంధీని న్యాయమూర్తి కెఎన్ శివకుమార్ ఆదేశించారు.
జూన్ 1న బెంగళూరు కోర్టు ఈ కేసులో భాగస్వాములైన సీఎం సిద్ధరామయ్య, శివకుమార్, రాహుల్ గాంధీని హాజరు కావాలని ఆదేశించింది. హాజరైన సిద్ధరామయ్య, శివకుమార్ కి బెయిల్ మంజూరు చేసింది. రాహుల్ గాంధీ గైర్హాజరవ్వడంతో ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని బీజేపీ నేత తరఫు న్యాయవాది డిమాండ్ చేశారు. జూన్ 7న తప్పక హాజరు కావాలని కోర్టు కోర్టు రాహుల్ కి ఆదేశించింది. కోర్టు విచారణ అనంతరం ఇక్కడి భారత్ జోడో భవన్లో రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలతో పాటు ఓడిపోయిన అభ్యర్థులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు.
తాజావార్తలు
-
Mookuthi Amman 2 Teaser: దేవతగా నయనతార రీఎంట్రీ.. ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్లో మహాశక్తి విశ్వరూపం!
-
Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
-
India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!