Congress: లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CWC Meeting: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా రాహుల్గాంధీని ఎన్నుకొనే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. గత రెండు దఫాలుగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియా గాంధీ పని చేశారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవడంతో.. పదేళ్లుగా నామమాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ నాయకత్వంలో తిరిగి పుంజుకొని సాధారణ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా నిలవడంతో ఆయన్నే పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Read Also: Maharastra : మహారాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం.. భారీగా పార్టీలు మారనున్న ఎమ్మెల్యేలు
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
కాగా, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ వచ్చిన తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ కూడా రాహుల్ గాంధీ పార్లమెంటరీ పార్టీ బాధ్యతలు చేపట్టాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. సాధారణంగా పార్లమెంటరీ పార్టీ లీడరే కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా ఉంటారు. మోడీ సర్కారు ఏడాదిలోపు పడిపోయే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ గట్టిగా నమ్ముతుంది. ఇండియా కూటమి తమ ప్రధాని అభ్యర్థిగా రాహుల్ని సిద్ధంగా ఉంచేందుకు సన్నాహాలు చేస్తుంది.
Read Also: Govinda Namalu: శనివారం గోవిందనామాలు వింటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి
ఇక, ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) నేడు ఢిల్లీలో జరగబోతుంది. అశోకా హోటల్లో ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యే ఈ భేటీలో తెలంగాణ సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ సీఎంలు, వర్కింగ్ కమిటీ సభ్యులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) నేతగా రాహుల్ను ప్రతిపాదిస్తూ తీర్మానం చేసే అవకాశం ఉంది. దాన్ని అనుసరించి, సాయంత్రం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కొత్తగా ఎన్నికైన లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలతో సీపీపీ భేటీ కానున్నారు. ఈ మీటింగ్ లో రాహుల్ను లాంఛనప్రాయంగా సీపీపీ నేతగా ఎన్నుకునే ఛాన్స్ ఉంది.
Read Also: TG Vishwaprasad: పిఠాపురం నుంచే స్వాతంత్ర్యం మొదలైంది!!
అలాగే, రాత్రి 7 గంటలకు అశోకా హోటల్లో సీడబ్ల్యూసీ సభ్యులు, ఎంపీలకు విందు సైతం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం నుం చి ఎంపీలుగా గెలిచిన మల్లురవి, బలరాంనాయక్లు రేవంత్తో మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!