Rahul Gandhi: పరువు నష్టం కేసులో నేడు బెంగళూరు కోర్టుకు రాహుల్ గాంధీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నేడు (శుక్రవారం) బెంగళూరుకు వెళ్లనున్నారు. ఇక, బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో బెంగళూరు కోర్టుకు హాజరుకానున్నారు. డీకే శివకుమార్, సిద్ధరామయ్య, రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు.. గత బీజేపీ ప్రభుత్వం అవినీతిమయమైందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. దీంతో బీజేపీ నేత ఎస్ కేశవ ప్రసాద్ పరువు నష్టం దావా వేశారు. దీనిపై ఇవాళ తమ ఎదుట హాజరుకావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే ఈ కేసులో ఇప్పటికే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్లకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Read Also: UP: ఉత్తర్ ప్రదేశ్ బీజేపీలో కలకలం.. రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ రాజీనామా!
Also Read
- Saayoni Ghosh: పార్లమెంట్ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
- Gold Loan Demand: గోల్డ్ లోన్ల జోరు.. మేలో కొత్త రికార్డు.. ఆర్బీఐ వార్నింగ్..
- Single-Teacher Schools: సింగిల్ టీచర్ పాఠశాలలపై హైకోర్టులో పిల్.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
- Cockroach Party: మరో దేశానికి పొంచి ఉన్న ‘కాక్రోచ్’ ముప్పు.. అవినీతిపై ఢిల్లీ తరహాలో కసరత్తు
ఇక, 2023 రాష్ట్ర ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీ అవినీతికి పాల్పడిందంటూ స్థానిక వార్తాపత్రికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటన ఇచ్చింది. అన్ని పబ్లిక్ వర్క్స్ అమలుకు 40 శాతం కమీషన్ వసూలు చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రకటనలో గత ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని అవినీతి కార్డును కూడా హస్తం పార్టీ నేతలు రిలీజ్ చేశారు. దీంతో కర్ణాటక బీజేపీ శాఖ పరువు నష్టం కేసు దాఖలు చేసింది. ఈ కేసులో భాగంగా రాహుల్ గాంధీ ఇవాళ బెంగళూరులోని స్థానిక కోర్టుకు హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే ప్రకటన ప్రచురణలో రాహుల్ గాంధీ ప్రమేయం లేదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. జూన్ 1వ తేదీన హాజరు కానందుకు రాహుల్ గాంధీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని కర్ణాటక బీజేపీ యూనిట్ న్యాయస్థానాన్ని కోరింది. అయితే, జూన్ 7న తప్పనిసరిగా హాజరుకావాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
Telangana SIR : తెలంగాణ ఓటర్లకు గుడ్న్యూస్.. SIR గడువు మరోసారి పొడిగింపు.!
-
Chanakya Niti: ఎంత కోపం వచ్చినా ఇలా కంట్రోల్ చేసుకోండి.. చాణక్యుడి 5 విజయ మంత్రాలు ఇవే!
-
Saayoni Ghosh: పార్లమెంట్ను అడ్డుకోవడం భావ్యం కాదు.. టీఎంసీ రెబల్ సాయోని ఘోష్ ఆగ్రహం
-
Gold Loan Demand: గోల్డ్ లోన్ల జోరు.. మేలో కొత్త రికార్డు.. ఆర్బీఐ వార్నింగ్..
-
Sardar 2: కార్తి డ్యూయల్ రోల్ అరాచకం .. ఎస్.జె. సూర్య స్టైలిష్ విలనిజం..టీజర్ తో షేక్!
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!