Rahul Gandhi: రాయ్బరేలీకే వైపే రాహుల్ గాంధీ.. వయనాడ్ని వదిలిపెట్టే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ ఎంపీ స్థానంలో పాటు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్బరేలీ స్థానం నుంచి పోటీ చేశాడు. ఈ రెండు స్థానాల్లో ఆయన భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే, ఈ రెండింటిలో రాహుల్ గాంధీ ఏ లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారు..? ఏ స్థానాన్ని వదులుకుంటారు..? అనే దానిపై చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఆయన వయనాడు సీటును వదులుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాయ్బరేలీకి ఎంపీగా ప్రాతినిధ్యం వహించనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
Read Also: Dior Dress: రాధికా మర్చంట్ వేసుకున్న డ్రెస్ ధరతో ఓ సామాన్య కుటుంబం ఏడాది బతికేయొచ్చుగా..
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
జూన్ 17లోపు ఈ అంశంపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఒక వ్యక్తి గరిష్టంగా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయవచ్చు. అయితే, అభ్యర్థి ఒక స్థానానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించాలి. ఫలితాలు వచ్చిన 14 రోజుల లోపు ఏదో ఒక సీటుకు రాజీనామా చేయాలి. ఏ స్థానానికి రాజీనామా చేయకపోయినా, రెండు స్థానాలను కోల్పోయే అవకాశం ఉంది.
శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాహుల్ గాంధీ రాయ్బరేలీ లేదా వాయనాడ్లలో ఏ సీటు ఉంచుకోవాలనే దానిపై చర్చ జరిగింది. నేతలు ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేరళకు చెందిన కొడిక్కున్నిల్ సురేశ్ వంటి ఎంపీలు రాహుల్ గాంధీ వయనాడ్ సీటును కొనసాగించాలని వాదించగా, రాయ్బరేలీ కోసం ఎక్కువ మంది మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. రాయ్బరేలీ అనేది గాంధీ కుటుంబానికి తరతరాలుగా వస్తున్న సంప్రదాయక స్థానం అని అన్నారు. ఉత్తర్ ప్రదేశ్లోని 80 స్థానాల్లో కాంగ్రెస్ ప్రభావం చూపాలంటే రాహుల్ గాంధీ రాయ్బరేలీని నిలబెట్టుకోవడమే కీలకమని నేతలు వాధించారు. 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయ్బరేలీలో బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్పై రాహుల్ గాంధీ 3,90,030 ఓట్ల తేడాతో విజయం సాధించారు. వాయనాడ్లో సీపీఐకి చెందిన అన్నీ రాజాపై 3,64,422 ఓట్ల తేడాతో గెలిచారు.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!