Prabhas: ప్రభాస్ ఆతిథ్యానికి ఫిదా అయిన మలయాళ డైరెక్టర్.. క్రేజీ కాంబోపై ఫిక్స్ అయ్యిందా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas: పాన్ ఇండియా సూపర్స్టార్ ప్రభాస్ – మలయాళ టాలెంటెడ్ డైరెక్టర్ దిన్జిత్ అయ్యతాన్ మధ్య జరిగిన తాజా సమావేశం ఇప్పుడు సినీ వర్గాల్లో సెన్సేషన్గా మారింది. హోంబలే ఫిల్మ్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీ, రాబోయే రోజుల్లో ఒక భారీ ప్రాజెక్టుకు నాంది కానుందా? అనే చర్చలకు తెరలేపింది. నిన్న రాత్రి జరిగిన ఈ సమావేశానికి సంబంధించిన విశేషాలను దిన్జిత్ అయ్యతాన్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. “సూపర్స్టార్ ప్రభాస్తో అద్భుతమైన సాయంత్రం గడిచింది. గొప్ప సంభాషణలు, నవ్వులు, రుచికరమైన డిన్నర్ మధ్య ఈ మీటింగ్ సాగింది. ముఖ్యంగా ప్రభాస్ గారు వడ్డించిన ‘ప్రాన్స్ బిర్యానీ’ అమోఘం! మీ అద్భుతమైన ఆతిథ్యానికి ధన్యవాదాలు ప్రభాస్ సార్. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన విజయ్ సార్, హోంబలే ఫిల్మ్స్కు నా కృతజ్ఞతలు” అంటూ దిన్జిత్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
READ ALSO: No-Cook Breakfast Recipes: గ్యాస్ అవసరమే లేదు, ఈ వంటకాలను ఈజీగా చేసుకోండి..
Also Read
- కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
- Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత.. 7000 మంది పోలీసులతో భారీ బందోబస్తు!
- Rega Kantha Rao: "పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడు".. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై యువతి ఫిర్యాదు.. కేసు నమోదు
- PM Modi: పాకిస్థాన్ నుంచి మోడీకి ఆహ్వానం.. మోడీ దాయాది దేశానికి వెళ్తారా?
మలయాళ చిత్ర పరిశ్రమలో విభిన్నమైన కథలతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ దిన్జిత్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన కిష్కింధ కాండం (2024) మిస్టరీ థ్రిల్లర్గా వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఇది డిస్నీ+ హాట్స్టార్లో ట్రెండ్ అవుతోంది. ఏకో (2025) సైకలాజికల్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. కేవలం 25 రోజుల్లోనే రూ.23.93 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించి 2025లో మోస్ట్ ప్రాఫిటబుల్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇటీవల తమిళ స్టార్ ధనుష్ కూడా ‘ఏకో’ చిత్రాన్ని ‘మాస్టర్పీస్’ అని కొనియాడటం విశేషం.
ప్రభాస్ ఇప్పటికే హోంబలే ఫిల్మ్స్తో భారీ ‘మల్టీ-ఫిల్మ్ డీల్’ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ‘సలార్’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత వీరి కాంబినేషన్లో మరిన్ని సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ క్రమంలోనే హోంబలే ఫిల్మ్స్ స్వయంగా దిన్జిత్ అయ్యతాన్ను ప్రభాస్తో కలిపించడంతో, వీరిద్దరి కాంబోలో ఒక విభిన్నమైన థ్రిల్లర్ మూవీ రాబోతుందనే అంచనాలు ప్రేక్షకుల్లో పెరుగుతున్నాయి. ప్రభాస్ ఇమేజ్ – దిన్జిత్ మేకింగ్ స్టైల్ కలిస్తే ఇండియన్ స్క్రీన్పై మరో అద్భుతం ఆవిష్కృతం కావడం ఖాయం అని అభిమానులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
READ ALSO: ఎగుమతిదారులకు JNPA భారీ ఛార్జీల మినహాయింపు.. మధ్యప్రాచ్య సంక్షోభం నేపథ్యంలో కీలక నిర్ణయం!
తాజావార్తలు
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత.. 7000 మంది పోలీసులతో భారీ బందోబస్తు!
-
Shehzad Poonawalla: బీజేపీకి షాజాద్ పూనావాలా రాజీనామా..
-
Shruti Haasan : ఐడెంటిటీ దక్కని పాత్రల్లో శృతి హాసన్
-
Rega Kantha Rao: “పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడు”.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై యువతి ఫిర్యాదు.. కేసు నమోదు
ట్రెండింగ్
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!
-
505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!